ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిని అధికారికంగాఅమలు చేసేందుకు కేసులు పెట్టించే ప్రయత్నాల్లో ఉందన్నారు. “అధికారికంగా నన్ను ఉరి వేసే కుట్రలు చేస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. దీనిని వారు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇది ముమ్మాటికీ భావప్రకటనపై చేస్తున్న కుట్రగానే చెబుతున్నా“ అని జుకర్బర్గ్ వ్యాఖ్యా నించారు.
జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. దీంతో అసలు ఏం జరిగిందన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. విషయంలోకి వెళ్తే.. కొన్ని రోజుల కిందట పాకిస్థాన్లో కొందరు ఫేస్బుక్లో మమ్మదీయులను కించ పరుస్తూ.. పోస్టులు దర్శన మిచ్చాయి. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ వెంటనే వాటిని తొలగించారు. అయితే.. ఈ పోస్టులు పెట్టిన వారి వివరాలు తమకు ఇవ్వాలని.. లేకపోతే.. ఫేస్బుక్పైనే కేసు నమోదు చేస్తామని ప్రకటించింది.
అయితే.. పోస్టుల పెట్టిన వారి వివరాలుఇచ్చేందుకు తమ నిబంధనలు ఒప్పుకోవని.. కాబట్టి ఇవ్వలేమని ఫేస్ బుక్ అధినేత జుకర్బర్గ్ పాకిస్థాన్కు లేఖ రాశారు. దీనిపై పాకిస్థాన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేరుగా ఆయనపైనే కేసు నమోదుచేసింది. ప్రస్తుతం పాకిస్థాన్సుప్రీంకోర్టులోఈ కేసు విచారణకు రానుంది. అయితే.. పాక్ ప్రభుత్వం తనకు మరణ శిక్ష విధించాలని సుప్రీంకోర్టును కోరనుందన్న విషయం తనకు తెలిసిందని పేర్కొన్నారు.
ఇదే జరిగితే.. భావనా ప్రకటనా స్వేచ్ఛను హరించినట్టేనని జుకర్బర్గ్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పంచుకున్న సందేశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై హక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక మతాన్ని, లేదా వ్యక్తులను కించపరిచాలనేది ఫేస్ బుక్ ఉద్దేశం కాదని.. జుకర్ బర్గ్పేర్కొన్నారు. విషయం తమ దృష్టికి రాగానే సదరు పోస్టులనుతాము తొలగించామని చెబుతున్నారు. కానీ, పాకిస్థాన్ మాత్రం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపింది.
This post was last modified on February 12, 2025 5:38 pm
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…