టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మైదానంలోనే కాదు, ప్రాక్టీస్ సెషన్లకు కూడా అభిమానులు భారీగా హాజరవుతుంటారు.
తాజాగా కోహ్లీ మరోసారి తన అభిమానులతో జరిగిన ఆసక్తికర ఘటనతో వార్తల్లోకి ఎక్కారు. ఇంగ్లాండ్తో రెండో వన్డే అనంతరం భారత జట్టు అహ్మదాబాద్కు బయలుదేరే ముందు భువనేశ్వర్ విమానాశ్రయంలో కోహ్లీ అభిమానులతో ముచ్చటించారు.
విమానాశ్రయంలో చెకింగ్ ఏరియాకు ముందు అభిమానులు తమ ఫేవరెట్ ఆటగాళ్లను చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ అక్కడికి చేరుకుని, అభిమానులను చూసి చిరునవ్వు చిందించాడు. అంతేకాకుండా, అక్కడే నిలబడి ఉన్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకొని ముచ్చటించాడు.
కోహ్లీ ఆ మహిళను హగ్ చేయడాన్ని చూసిన ఇతర ఫ్యాన్స్ షేక్హ్యాండ్ ఇవ్వాలని ముందుకు రావడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని కోహ్లీని అక్కడి నుంచి పంపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ లక్కీ లేడీ ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
అయితే ఆమె కోహ్లీకి దగ్గరి బంధువు అని సమాచారం. అందుకే కోహ్లీ ఆమెను హగ్ చేశాడని తెలుస్తోంది. కానీ తను ఒక అభిమాని అని కొందరు చెబుతున్నారు. ఈ ఘటన మరోసారి కోహ్లీ అభిమానుల ప్రేమను రుజువు చేస్తోంది.
కొద్ది రోజుల క్రితం కోహ్లీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్తున్న సమయంలో అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఒకరు ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరగా ఫ్లైట్ టైం అయిపోతున్న తరుణంలో కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేక వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది చూసిన నెటిజన్లు కోహ్లీ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ తాజాగా ఈ వీడియో చూసిన కోహ్లీ అభిమానులు ఫ్యాన్స్ అంటే కోహ్లీ కి ఎంత ప్రేమో అని పోస్టుల రూపం లో అభిమానం వ్యక్తం చేస్తున్నారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ముగిశాయి. ఈ రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే జరగనుంది. అయితే ఇప్పటికే సిరీస్ భారత్ ఖాతాలో పడిన నేపథ్యంలో చివరి మ్యాచ్ నామమాత్రంగా మారింది.
This post was last modified on February 11, 2025 5:46 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…