భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 214.8 కోట్ల లావాదేవీలు నమోదుకాగా, ఇప్పుడు 32% వృద్ధి కనిపించింది. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం రోజుకు 9 కోట్లకు పైగా ఆధార్ ధృవీకరణలు జరుగుతున్నాయి. ఇందులో ఫేస్ అథెంటికేషన్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. జనవరిలో 12 కోట్లకు పైగా ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జరిగాయి. 2021లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 102 కోట్ల ఫేస్ ధృవీకరణలు పూర్తయ్యాయి. కేవలం గత 12 నెలల్లోనే 78 కోట్ల ధృవీకరణలు పూర్తయినట్లు UIDAI ప్రకటించింది.
AI ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సేవను UIDAI అభివృద్ధి చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్, హెల్త్కేర్, ప్రభుత్వ పథకాల్లో దీని వినియోగం పెరుగుతోంది. తక్కువ సమయం, ఎక్కువ భద్రత, స్పష్టమైన గుర్తింపు ఇవన్నీ AI వల్ల సాధ్యమవుతున్న ప్రయోజనాలు. ఇక ఆధార్ e-KYC సేవ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనవరిలో 43 కోట్లకు పైగా e-KYC లావాదేవీలు జరిగాయి.
2025 జనవరి నాటికి మొత్తం 2268 కోట్ల e-KYC లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ధృవీకరణలో AI ఉపయోగం వల్ల లావాదేవీలు వేగంగా, సురక్షితంగా, సులభంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో AI టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే, ఆధార్ సేవలు ఇంకా మెరుగవుతాయి. దీని వల్ల లావాదేవీలు సులభంగా, నమ్మకంగా, వేగంగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on February 8, 2025 12:36 pm
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…