భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 214.8 కోట్ల లావాదేవీలు నమోదుకాగా, ఇప్పుడు 32% వృద్ధి కనిపించింది. దీని వెనుక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం రోజుకు 9 కోట్లకు పైగా ఆధార్ ధృవీకరణలు జరుగుతున్నాయి. ఇందులో ఫేస్ అథెంటికేషన్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. జనవరిలో 12 కోట్లకు పైగా ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు జరిగాయి. 2021లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 102 కోట్ల ఫేస్ ధృవీకరణలు పూర్తయ్యాయి. కేవలం గత 12 నెలల్లోనే 78 కోట్ల ధృవీకరణలు పూర్తయినట్లు UIDAI ప్రకటించింది.
AI ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సేవను UIDAI అభివృద్ధి చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్, హెల్త్కేర్, ప్రభుత్వ పథకాల్లో దీని వినియోగం పెరుగుతోంది. తక్కువ సమయం, ఎక్కువ భద్రత, స్పష్టమైన గుర్తింపు ఇవన్నీ AI వల్ల సాధ్యమవుతున్న ప్రయోజనాలు. ఇక ఆధార్ e-KYC సేవ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనవరిలో 43 కోట్లకు పైగా e-KYC లావాదేవీలు జరిగాయి.
2025 జనవరి నాటికి మొత్తం 2268 కోట్ల e-KYC లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ధృవీకరణలో AI ఉపయోగం వల్ల లావాదేవీలు వేగంగా, సురక్షితంగా, సులభంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో AI టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే, ఆధార్ సేవలు ఇంకా మెరుగవుతాయి. దీని వల్ల లావాదేవీలు సులభంగా, నమ్మకంగా, వేగంగా జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on February 8, 2025 12:36 pm
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…