కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో భారీ డిమాండ్ను సృష్టించింది. స్థానికంగా కుంభాభిషేకం రేవులో విక్రయించగా, ఓ వ్యాపారి దాన్ని ఏకంగా రూ. 3.95 లక్షలకు కొనుగోలు చేశాడు. సాధారణంగా పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో, ఆ స్థాయికన్నా ఎక్కువగా కచిడి చేపకు ఆదరణ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఈ చేప ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కచిడి చేప గాల్ బ్లాడర్ నుంచి తయారయ్యే పదార్థాన్ని శస్త్రచికిత్సల్లో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతారు. కేవలం రుచికే కాకుండా, దీని శరీరంలోని భాగాలను ఆయుర్వేద చికిత్సల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా, దీని పొట్ట భాగాన్ని బలవర్ధక మందుల్లో ఉపయోగించడంతో, వైద్యపరంగా దీని విలువ మరింత పెరుగుతోంది.
బంగారు వర్ణంలో ఉండే ఈ చేపలను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి చేపలు అరుదుగా దొరికే కారణంగా, మార్కెట్లో వీటి ధరలు క్షణాల్లో ఆకాశానికే చేరుతాయి. ఒక్కో భాగానికి ప్రత్యేక విలువ ఉండటంతో, వ్యాపారులు దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడతారు.
ఇటీవల మత్స్యకారులకు ఇలాంటి చేపలు చిక్కినప్పుడు వేలాది నుంచి లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈసారి కాకినాడ తీరంలో దొరికిన కచిడి చేప మత్స్యకారులకు లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీని ఔషధ గుణాల వల్ల ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on February 3, 2025 1:05 pm
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…