కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో భారీ డిమాండ్ను సృష్టించింది. స్థానికంగా కుంభాభిషేకం రేవులో విక్రయించగా, ఓ వ్యాపారి దాన్ని ఏకంగా రూ. 3.95 లక్షలకు కొనుగోలు చేశాడు. సాధారణంగా పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో, ఆ స్థాయికన్నా ఎక్కువగా కచిడి చేపకు ఆదరణ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఈ చేప ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కచిడి చేప గాల్ బ్లాడర్ నుంచి తయారయ్యే పదార్థాన్ని శస్త్రచికిత్సల్లో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతారు. కేవలం రుచికే కాకుండా, దీని శరీరంలోని భాగాలను ఆయుర్వేద చికిత్సల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా, దీని పొట్ట భాగాన్ని బలవర్ధక మందుల్లో ఉపయోగించడంతో, వైద్యపరంగా దీని విలువ మరింత పెరుగుతోంది.
బంగారు వర్ణంలో ఉండే ఈ చేపలను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి చేపలు అరుదుగా దొరికే కారణంగా, మార్కెట్లో వీటి ధరలు క్షణాల్లో ఆకాశానికే చేరుతాయి. ఒక్కో భాగానికి ప్రత్యేక విలువ ఉండటంతో, వ్యాపారులు దీనిని కొనుగోలు చేసేందుకు పోటీ పడతారు.
ఇటీవల మత్స్యకారులకు ఇలాంటి చేపలు చిక్కినప్పుడు వేలాది నుంచి లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈసారి కాకినాడ తీరంలో దొరికిన కచిడి చేప మత్స్యకారులకు లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీని ఔషధ గుణాల వల్ల ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on February 3, 2025 1:05 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…