Trends

మన త్రిష సత్తా చాటితే వరల్డ్ కప్ మనదే

అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్టటి,కే సెమీస్ చేరిన టీమిండియా తాజాగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్ ఆరంభం నుంచి అదరగొడుతున్న భారత బాలికల జట్టు ఫైనల్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది.

అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లిన భారత జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చోటు దక్కించుకోవడంతోనే కాకుండా తన బ్యాటుతో మెరుపులు మెరిపిస్తున్న త్రిష…లీగ్ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసింది. ఈ సెంచరీతో అండర్ 19 క్రికెట్ లో తొలి సెంచనీ చేసిన క్రీడాకారిణిగా త్రిష రికార్డులకెక్కింద. తాజాగా సెమీస్ లో ఇంగ్లండ్ తో జరగిన మ్యాచ్ లో కూడా త్రిష 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది.

సెమీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ తర్వాత 114 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు… 15 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. దీంతో 5 ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టు విజయం సాధించింది. బారత ఇన్నింగ్స్ లో కమలిని 56 పరుగులు చేయగా… త్రిష 29 బంతుల్లోనే 35 పరుగులు చేసి మంచి స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక ఎల్లుండి జరగనున్న ఫైనల్ లో మరోమారు త్రిష తన బ్యాటును ఝుళిపిస్తే… వరల్డ్ కప్ ఇండియాకు వచ్చినట్టేనని చెప్పాలి.

This post was last modified on January 31, 2025 4:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

18 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago