అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్టటి,కే సెమీస్ చేరిన టీమిండియా తాజాగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్ ఆరంభం నుంచి అదరగొడుతున్న భారత బాలికల జట్టు ఫైనల్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది.
అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లిన భారత జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చోటు దక్కించుకోవడంతోనే కాకుండా తన బ్యాటుతో మెరుపులు మెరిపిస్తున్న త్రిష…లీగ్ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసింది. ఈ సెంచరీతో అండర్ 19 క్రికెట్ లో తొలి సెంచనీ చేసిన క్రీడాకారిణిగా త్రిష రికార్డులకెక్కింద. తాజాగా సెమీస్ లో ఇంగ్లండ్ తో జరగిన మ్యాచ్ లో కూడా త్రిష 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది.
సెమీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ తర్వాత 114 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు… 15 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. దీంతో 5 ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టు విజయం సాధించింది. బారత ఇన్నింగ్స్ లో కమలిని 56 పరుగులు చేయగా… త్రిష 29 బంతుల్లోనే 35 పరుగులు చేసి మంచి స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక ఎల్లుండి జరగనున్న ఫైనల్ లో మరోమారు త్రిష తన బ్యాటును ఝుళిపిస్తే… వరల్డ్ కప్ ఇండియాకు వచ్చినట్టేనని చెప్పాలి.
This post was last modified on January 31, 2025 4:13 pm
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…