అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్టటి,కే సెమీస్ చేరిన టీమిండియా తాజాగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్ ఆరంభం నుంచి అదరగొడుతున్న భారత బాలికల జట్టు ఫైనల్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది.
అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లిన భారత జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చోటు దక్కించుకోవడంతోనే కాకుండా తన బ్యాటుతో మెరుపులు మెరిపిస్తున్న త్రిష…లీగ్ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసింది. ఈ సెంచరీతో అండర్ 19 క్రికెట్ లో తొలి సెంచనీ చేసిన క్రీడాకారిణిగా త్రిష రికార్డులకెక్కింద. తాజాగా సెమీస్ లో ఇంగ్లండ్ తో జరగిన మ్యాచ్ లో కూడా త్రిష 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది.
సెమీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ తర్వాత 114 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు… 15 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. దీంతో 5 ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టు విజయం సాధించింది. బారత ఇన్నింగ్స్ లో కమలిని 56 పరుగులు చేయగా… త్రిష 29 బంతుల్లోనే 35 పరుగులు చేసి మంచి స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక ఎల్లుండి జరగనున్న ఫైనల్ లో మరోమారు త్రిష తన బ్యాటును ఝుళిపిస్తే… వరల్డ్ కప్ ఇండియాకు వచ్చినట్టేనని చెప్పాలి.
This post was last modified on January 31, 2025 4:13 pm
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…