భార్యను చంపేసి.. శవాన్ని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించిన గురుమూర్తికి సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అంతేకాదు.. తాజాగా కోర్టుకు హాజరుపర్చిన సందర్బంగా అతగాడి ధోరణి విస్తుపోయేలా ఉంది. అతడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు.. రాచకొండ సీపీ చెప్పిన విషయం తెలిసిందే.
ఇతగాడి విచిత్రమైన తీరు తాజాగా రంగారెడ్డి కోర్టుల్లోనూ కనిపించింది. భార్యను చంపేసి.. కిరాతకంగా వ్యవహరించిన గురుమూర్తిని తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన పలు ప్రశ్నలకు నిందితుడు బెరుకు లేకుండా.. ఎలాంటి పశ్చాత్తాపానికి గురి కాకుండా సమాధానాలు ఇవ్వటం అక్కడున్న వారిని విస్మయానికి గురి చేసింది. పోలీసులు తనను కొట్టలేదని.. తనకు వైద్య పరీక్షలు చేయించినట్లుగా వెల్లడించారు.
లీగల్ ఎయిడ్ కోసం లాయర్ ను పెట్టుకుంటారా? అని న్యాయమూర్తి అడిగితే.. తనకు లాయర్ అవసరం లేదని బదులివ్వటంతో పాటు.. తాను జైల్లో ఉంటానని చెప్పటం గమనార్హం. దీంతో అతడ్నిచర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడే పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉండనున్నాడు. ఆ తర్వాత తదుపరి చర్యల కోసం నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భార్యను చంపేసి.. ఆమె శవాన్ని కిరాతకంగా మాయం చేసిన గంటల వ్యవధిలోనే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన వైనం వెలుగు చూసింది.
ఇద్దరు పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్లిందంటే.. బయటకు వెళ్లిందని చెప్పటంతో పాటు.. ఇంట్లో దుర్వాసన వస్తుందని అడగ్గా.. పండుగ రోజులు కావటంతో చుట్టుపక్కల వారు మటన్ వండుతున్నారని ఒకసారి.. డ్రైయినేజీ వాసన అంటూ వారిని సమాధానపర్చినట్లుగా తెలుస్తోంది. ఎయిర్ ఫ్రెషనర్ తో వాసన పోగొట్టే ప్రయత్నం చేశాడు. వారికి ఆకలేస్తే ఆన్ లైన్ లో ఆహారం తెప్పించాడు.
పిల్లలు బెడ్రూంలోకి వెళ్లకుండా తాళం వేసిన అతను.. వారికి అనుమానం రాకుండా.. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తల్లిని దారుణంగా హతమార్చిన బాత్రూంలోనే పిల్లల అవసరాలు తీర్చిన వైనం తెలుసుకున్న స్థానికులు షాక్ తింటున్నారు. ఇతగాడి వేరియన్స్ అపరిచితుడ్ని తలపిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
This post was last modified on January 30, 2025 10:26 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…