కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా? అంటూ కేసులు నమోదు చేసే పోలీసులు కొందరుంటారు.ఆ కోవలోకే వస్తుంది ఇండోర్ పోలీసుల తీరు చూస్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాన్ని యాచక రహిత నగరంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇండోర్ అధికార యంత్రాంగం బిచ్చం వేయటాన్ని నిషేధిస్తూ.. పలువురు బిచ్చగాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇదిలా ఉండగా ఒక దేవాలయం ఎదుట ఉన్న ఒక యాచకురాలికి బిచ్చం వేసిన వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఈ నేరం నమోదు అయితే.. సదరు వ్యక్తికి ఏడాది వరకు జైలుశిక్ష కానీ రూ.5 వేల జరిమానా కానీ లేదంటే ఈ రెండు శిక్షల్ని అమలు చేసే వీలుంది. ఇండోర్ లో యాచకులకు దానం చేయటాన్ని బ్యాన్ చేస్తూ జనవరి ఒకటి నుంచి నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు.. ఎక్కడైనా ఎవరైనా భిక్షాటన చేస్తుంటే.. వారి సమాచారాన్ని ఇస్తే రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. గడిచిన మూడు వారాలుగా ఇండోర్ నగరంలో పలువురు ఈ రివార్డును అందుకున్నారు. కేంద్ర సామాజిక న్యాయ.. సాధికార మంత్రిత్వ శాఖ దేశంలోని పది నగరాల్ని ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో ఇండోర్ తో పాటు డిల్లీ.. బెంగళూరు.. చెన్నై.. హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. మొదట ఇండోర్ లో పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. దశల వారీగా మిగిలిన నగరాలకు ఈ విధానాన్ని అమలు చేయనేున్నారు.
This post was last modified on January 24, 2025 10:08 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…