Trends

బిచ్చం వేసిన వ్యక్తిపై కేసు.. ఇండోర్ పోలీసుల తీరుతో షాక్!

కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా? అంటూ కేసులు నమోదు చేసే పోలీసులు కొందరుంటారు.ఆ కోవలోకే వస్తుంది ఇండోర్ పోలీసుల తీరు చూస్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాన్ని యాచక రహిత నగరంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇండోర్ అధికార యంత్రాంగం బిచ్చం వేయటాన్ని నిషేధిస్తూ.. పలువురు బిచ్చగాళ్లను పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇదిలా ఉండగా ఒక దేవాలయం ఎదుట ఉన్న ఒక యాచకురాలికి బిచ్చం వేసిన వ్యక్తిపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 223 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఈ నేరం నమోదు అయితే.. సదరు వ్యక్తికి ఏడాది వరకు జైలుశిక్ష కానీ రూ.5 వేల జరిమానా కానీ లేదంటే ఈ రెండు శిక్షల్ని అమలు చేసే వీలుంది. ఇండోర్ లో యాచకులకు దానం చేయటాన్ని బ్యాన్ చేస్తూ జనవరి ఒకటి నుంచి నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. ఎక్కడైనా ఎవరైనా భిక్షాటన చేస్తుంటే.. వారి సమాచారాన్ని ఇస్తే రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. గడిచిన మూడు వారాలుగా ఇండోర్ నగరంలో పలువురు ఈ రివార్డును అందుకున్నారు. కేంద్ర సామాజిక న్యాయ.. సాధికార మంత్రిత్వ శాఖ దేశంలోని పది నగరాల్ని ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో ఇండోర్ తో పాటు డిల్లీ.. బెంగళూరు.. చెన్నై.. హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. మొదట ఇండోర్ లో పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. దశల వారీగా మిగిలిన నగరాలకు ఈ విధానాన్ని అమలు చేయనేున్నారు.

This post was last modified on January 24, 2025 10:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago