Trends

ఇదో కొత్త రకం దోపిడీ!… ఒలా, ఉబెర్ లకు కేంద్రం నోటీసులు!

ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా ఒకే వస్తువును రెండు రకాల ధరలకు విక్రయించేవారు. అయితే అందుకు వారు వినియోగించుకున్న మార్గం… పేదలు,. ధనికులు నివసించే ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దందాను సాగించారు. మొన్నామధ్య ఈ మంత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఓ ఆన్ లైన్ సెల్లింగ్ సంస్థ.. కస్టమర్లు వాడే సెల్ ఫోన్ స్థాయిని బట్టి రేట్లను ఫిక్స్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో నిన్నటిదాకా తెలియలేదు గానీ… తాజా ఘటనను చూస్తే అది నిజమేనని చెప్పక తప్పదు.

నగర జీవనానికి ఇప్పుడు వాహనాలు తప్పనిసరిగా మారిపోయాయి. అయితే వాహనం లేని వారో, ట్రాఫిక్ చిక్కులకు భయపడేవారో, లేదంటే దూరాభారం వాహనాన్ని నడపడాన్ని ఇష్టం లేని వారో… ఒలా, ఉబెర్ వంటి అద్దె సేవలను వినియోగిస్తున్నారు. ఇలా సెల్ ఫోన్లలో బుక్ చేస్తే… మోటార్ సైకిళ్ల నుంచి ఖరీదైన కార్ల దాకా మన ఇళ్ల ముందు వాలిపోతున్నాయి. ఈ సేవల ద్వారా బాగానే సంపాదిస్తున్న ఆయా సంస్థలు ఇప్పుడు దురాశతో మరింతగా తెగించేశాయి. వీరి దురాశ గురించి తెలిసిన కేంద్రం… ఒలా, ఉబెర్ సంస్థలకు ఏకంగా నోటీసులు జారీ చేసింది.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?. అయితే మీకు తక్కువ ధరలకే ఒలా, ఉబెర్ సేవలు అందుతాయి. అదే మీరు ఐఫోన్ వాడుతున్నారా?.. అయితే మీ జేబును ఆ సంస్థలు గుల్ల చేస్తాయి. ఈ సరికొత్త దందాకు చాలాకాలం క్రితమే ఆ సంస్థలు తెర తీశాయని సమాచారం. ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించేవారిని ఓ మోస్తరు కస్టమర్లుగా పరిగణిస్తున్న ఆ కంపెనీలు… ఐఫోన్లను వాడుతున్న వారిని మాత్రం ఖరీదైన కస్టమర్లుగా భావిస్తున్నాయి. ఖరీదైన కస్టమర్ల వద్ద ఎంత లాగినా.. వారు పెద్దగా పట్టించుకోరులే అన్న భావనతో ఈ సంస్థలు ఈ సరికొత్త దందాకు తెరలేపినట్లుగా సమాచారం.

అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఫోన్లు కూడా సరసరమైన ధరలకే లబిస్తున్నాయి. పేదలు కూడా చాలా మంది ఐఫోన్లను వాడుతున్నారు. అదే సమయంలో ధనికుల్లో చాలా మంది వాటి జోలికే వెళ్లడం లేదు. ఈ రెండు రకాల వారితో ఈ సంస్థల ఆటలు ఇంతకాలం సాగాయి. అయితే కొందరు అటు ఆండ్రాయిడ్ తో పాటు ఇటు ఐఫోన్లనూ వినియోగిస్తున్నారు కదా. వీరు ఒలా,ఉబెర్ సేవలను వినియోగించిన సందర్భంగా ఈ సంస్థల నయా మోసం బయటపడింది. దీంతో కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రాథమిక పరిశీలనలో బాగంగా ఈ సంస్థల మోసం నిజమేని తేలడంతో వాటికి కేంద్రం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

This post was last modified on January 23, 2025 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

5 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

6 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago