Trends

ఇదో కొత్త రకం దోపిడీ!… ఒలా, ఉబెర్ లకు కేంద్రం నోటీసులు!

ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా ఒకే వస్తువును రెండు రకాల ధరలకు విక్రయించేవారు. అయితే అందుకు వారు వినియోగించుకున్న మార్గం… పేదలు,. ధనికులు నివసించే ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దందాను సాగించారు. మొన్నామధ్య ఈ మంత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఓ ఆన్ లైన్ సెల్లింగ్ సంస్థ.. కస్టమర్లు వాడే సెల్ ఫోన్ స్థాయిని బట్టి రేట్లను ఫిక్స్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో నిన్నటిదాకా తెలియలేదు గానీ… తాజా ఘటనను చూస్తే అది నిజమేనని చెప్పక తప్పదు.

నగర జీవనానికి ఇప్పుడు వాహనాలు తప్పనిసరిగా మారిపోయాయి. అయితే వాహనం లేని వారో, ట్రాఫిక్ చిక్కులకు భయపడేవారో, లేదంటే దూరాభారం వాహనాన్ని నడపడాన్ని ఇష్టం లేని వారో… ఒలా, ఉబెర్ వంటి అద్దె సేవలను వినియోగిస్తున్నారు. ఇలా సెల్ ఫోన్లలో బుక్ చేస్తే… మోటార్ సైకిళ్ల నుంచి ఖరీదైన కార్ల దాకా మన ఇళ్ల ముందు వాలిపోతున్నాయి. ఈ సేవల ద్వారా బాగానే సంపాదిస్తున్న ఆయా సంస్థలు ఇప్పుడు దురాశతో మరింతగా తెగించేశాయి. వీరి దురాశ గురించి తెలిసిన కేంద్రం… ఒలా, ఉబెర్ సంస్థలకు ఏకంగా నోటీసులు జారీ చేసింది.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?. అయితే మీకు తక్కువ ధరలకే ఒలా, ఉబెర్ సేవలు అందుతాయి. అదే మీరు ఐఫోన్ వాడుతున్నారా?.. అయితే మీ జేబును ఆ సంస్థలు గుల్ల చేస్తాయి. ఈ సరికొత్త దందాకు చాలాకాలం క్రితమే ఆ సంస్థలు తెర తీశాయని సమాచారం. ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించేవారిని ఓ మోస్తరు కస్టమర్లుగా పరిగణిస్తున్న ఆ కంపెనీలు… ఐఫోన్లను వాడుతున్న వారిని మాత్రం ఖరీదైన కస్టమర్లుగా భావిస్తున్నాయి. ఖరీదైన కస్టమర్ల వద్ద ఎంత లాగినా.. వారు పెద్దగా పట్టించుకోరులే అన్న భావనతో ఈ సంస్థలు ఈ సరికొత్త దందాకు తెరలేపినట్లుగా సమాచారం.

అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఫోన్లు కూడా సరసరమైన ధరలకే లబిస్తున్నాయి. పేదలు కూడా చాలా మంది ఐఫోన్లను వాడుతున్నారు. అదే సమయంలో ధనికుల్లో చాలా మంది వాటి జోలికే వెళ్లడం లేదు. ఈ రెండు రకాల వారితో ఈ సంస్థల ఆటలు ఇంతకాలం సాగాయి. అయితే కొందరు అటు ఆండ్రాయిడ్ తో పాటు ఇటు ఐఫోన్లనూ వినియోగిస్తున్నారు కదా. వీరు ఒలా,ఉబెర్ సేవలను వినియోగించిన సందర్భంగా ఈ సంస్థల నయా మోసం బయటపడింది. దీంతో కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రాథమిక పరిశీలనలో బాగంగా ఈ సంస్థల మోసం నిజమేని తేలడంతో వాటికి కేంద్రం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

Satya

Recent Posts

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

50 minutes ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

1 hour ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

3 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

5 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

6 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

6 hours ago