Trends

ఇదో కొత్త రకం దోపిడీ!… ఒలా, ఉబెర్ లకు కేంద్రం నోటీసులు!

ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా ఒకే వస్తువును రెండు రకాల ధరలకు విక్రయించేవారు. అయితే అందుకు వారు వినియోగించుకున్న మార్గం… పేదలు,. ధనికులు నివసించే ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దందాను సాగించారు. మొన్నామధ్య ఈ మంత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఓ ఆన్ లైన్ సెల్లింగ్ సంస్థ.. కస్టమర్లు వాడే సెల్ ఫోన్ స్థాయిని బట్టి రేట్లను ఫిక్స్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో నిన్నటిదాకా తెలియలేదు గానీ… తాజా ఘటనను చూస్తే అది నిజమేనని చెప్పక తప్పదు.

నగర జీవనానికి ఇప్పుడు వాహనాలు తప్పనిసరిగా మారిపోయాయి. అయితే వాహనం లేని వారో, ట్రాఫిక్ చిక్కులకు భయపడేవారో, లేదంటే దూరాభారం వాహనాన్ని నడపడాన్ని ఇష్టం లేని వారో… ఒలా, ఉబెర్ వంటి అద్దె సేవలను వినియోగిస్తున్నారు. ఇలా సెల్ ఫోన్లలో బుక్ చేస్తే… మోటార్ సైకిళ్ల నుంచి ఖరీదైన కార్ల దాకా మన ఇళ్ల ముందు వాలిపోతున్నాయి. ఈ సేవల ద్వారా బాగానే సంపాదిస్తున్న ఆయా సంస్థలు ఇప్పుడు దురాశతో మరింతగా తెగించేశాయి. వీరి దురాశ గురించి తెలిసిన కేంద్రం… ఒలా, ఉబెర్ సంస్థలకు ఏకంగా నోటీసులు జారీ చేసింది.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?. అయితే మీకు తక్కువ ధరలకే ఒలా, ఉబెర్ సేవలు అందుతాయి. అదే మీరు ఐఫోన్ వాడుతున్నారా?.. అయితే మీ జేబును ఆ సంస్థలు గుల్ల చేస్తాయి. ఈ సరికొత్త దందాకు చాలాకాలం క్రితమే ఆ సంస్థలు తెర తీశాయని సమాచారం. ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించేవారిని ఓ మోస్తరు కస్టమర్లుగా పరిగణిస్తున్న ఆ కంపెనీలు… ఐఫోన్లను వాడుతున్న వారిని మాత్రం ఖరీదైన కస్టమర్లుగా భావిస్తున్నాయి. ఖరీదైన కస్టమర్ల వద్ద ఎంత లాగినా.. వారు పెద్దగా పట్టించుకోరులే అన్న భావనతో ఈ సంస్థలు ఈ సరికొత్త దందాకు తెరలేపినట్లుగా సమాచారం.

అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఫోన్లు కూడా సరసరమైన ధరలకే లబిస్తున్నాయి. పేదలు కూడా చాలా మంది ఐఫోన్లను వాడుతున్నారు. అదే సమయంలో ధనికుల్లో చాలా మంది వాటి జోలికే వెళ్లడం లేదు. ఈ రెండు రకాల వారితో ఈ సంస్థల ఆటలు ఇంతకాలం సాగాయి. అయితే కొందరు అటు ఆండ్రాయిడ్ తో పాటు ఇటు ఐఫోన్లనూ వినియోగిస్తున్నారు కదా. వీరు ఒలా,ఉబెర్ సేవలను వినియోగించిన సందర్భంగా ఈ సంస్థల నయా మోసం బయటపడింది. దీంతో కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రాథమిక పరిశీలనలో బాగంగా ఈ సంస్థల మోసం నిజమేని తేలడంతో వాటికి కేంద్రం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

This post was last modified on January 23, 2025 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

21 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago