Trends

ఇదో కొత్త రకం దోపిడీ!… ఒలా, ఉబెర్ లకు కేంద్రం నోటీసులు!

ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా ఒకే వస్తువును రెండు రకాల ధరలకు విక్రయించేవారు. అయితే అందుకు వారు వినియోగించుకున్న మార్గం… పేదలు,. ధనికులు నివసించే ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దందాను సాగించారు. మొన్నామధ్య ఈ మంత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఓ ఆన్ లైన్ సెల్లింగ్ సంస్థ.. కస్టమర్లు వాడే సెల్ ఫోన్ స్థాయిని బట్టి రేట్లను ఫిక్స్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో నిన్నటిదాకా తెలియలేదు గానీ… తాజా ఘటనను చూస్తే అది నిజమేనని చెప్పక తప్పదు.

నగర జీవనానికి ఇప్పుడు వాహనాలు తప్పనిసరిగా మారిపోయాయి. అయితే వాహనం లేని వారో, ట్రాఫిక్ చిక్కులకు భయపడేవారో, లేదంటే దూరాభారం వాహనాన్ని నడపడాన్ని ఇష్టం లేని వారో… ఒలా, ఉబెర్ వంటి అద్దె సేవలను వినియోగిస్తున్నారు. ఇలా సెల్ ఫోన్లలో బుక్ చేస్తే… మోటార్ సైకిళ్ల నుంచి ఖరీదైన కార్ల దాకా మన ఇళ్ల ముందు వాలిపోతున్నాయి. ఈ సేవల ద్వారా బాగానే సంపాదిస్తున్న ఆయా సంస్థలు ఇప్పుడు దురాశతో మరింతగా తెగించేశాయి. వీరి దురాశ గురించి తెలిసిన కేంద్రం… ఒలా, ఉబెర్ సంస్థలకు ఏకంగా నోటీసులు జారీ చేసింది.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?. అయితే మీకు తక్కువ ధరలకే ఒలా, ఉబెర్ సేవలు అందుతాయి. అదే మీరు ఐఫోన్ వాడుతున్నారా?.. అయితే మీ జేబును ఆ సంస్థలు గుల్ల చేస్తాయి. ఈ సరికొత్త దందాకు చాలాకాలం క్రితమే ఆ సంస్థలు తెర తీశాయని సమాచారం. ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించేవారిని ఓ మోస్తరు కస్టమర్లుగా పరిగణిస్తున్న ఆ కంపెనీలు… ఐఫోన్లను వాడుతున్న వారిని మాత్రం ఖరీదైన కస్టమర్లుగా భావిస్తున్నాయి. ఖరీదైన కస్టమర్ల వద్ద ఎంత లాగినా.. వారు పెద్దగా పట్టించుకోరులే అన్న భావనతో ఈ సంస్థలు ఈ సరికొత్త దందాకు తెరలేపినట్లుగా సమాచారం.

అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఫోన్లు కూడా సరసరమైన ధరలకే లబిస్తున్నాయి. పేదలు కూడా చాలా మంది ఐఫోన్లను వాడుతున్నారు. అదే సమయంలో ధనికుల్లో చాలా మంది వాటి జోలికే వెళ్లడం లేదు. ఈ రెండు రకాల వారితో ఈ సంస్థల ఆటలు ఇంతకాలం సాగాయి. అయితే కొందరు అటు ఆండ్రాయిడ్ తో పాటు ఇటు ఐఫోన్లనూ వినియోగిస్తున్నారు కదా. వీరు ఒలా,ఉబెర్ సేవలను వినియోగించిన సందర్భంగా ఈ సంస్థల నయా మోసం బయటపడింది. దీంతో కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రాథమిక పరిశీలనలో బాగంగా ఈ సంస్థల మోసం నిజమేని తేలడంతో వాటికి కేంద్రం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.

This post was last modified on January 23, 2025 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago