Trends

హైద‌రాబాద్‌లో భార్య‌ను చంపి.. కుక్క‌ర్‌లో ఉడికించాడు!

ఎక్క‌డో ఢిల్లీలో రెండేళ్ల కింద‌ట ప్రియురాలిని చంపి.. ముక్క‌లు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడ‌త‌ల వారీగా వాటిని అడ‌విలో విసిరేసిన ఘ‌ట‌న దేశం మొత్తాన్ని క‌ల‌చి వేసింది. క‌దిలించేసింది. దీనిపై అనేక మంది బుగ్గ‌లు నొక్కుకున్నారు. ఇంత దారుణం చేస్తారా? అని త‌ల ప‌ట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మ‌న హైద‌రాబాద్‌లోనే అచ్చంగా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగితే!.. ఆశ్చ‌ర్యం కాదు నిజం. మాట‌ల‌కంద‌ని ఘోరం మీర్ పేట‌లో చోటు చేసుకుంది. క‌ట్టుకున్న భార్య‌పై అనుమానం పెంచుకున్న ఓ మాజీ సైనికోద్యోగి.. ఆమెను చంపేశాడు. అంతేకాదు.. ఆమెను ముక్క‌లు చేసి .. కుక్క‌ర్‌లో ఉడికించాడు. అనంత‌రం.. వాటిని స‌మీపంలోని జిల్లెల‌గూడ చెరువులో చేప‌ల‌కు ఆహారంగా వేశాడు!!

మ‌న‌సున్న వారు ఎవ‌రూ ఊహించేందుకు కూడా సాహ‌సించ‌ని ఈ ఘోరం.. మీర్ పేట‌లోనే జ‌రిగింది. అది కూడా ఈ నెల 18నే జ‌రిగింది. భార‌త‌ సైన్యంలో సిపాయిగా ప‌నిచేసిన గురుమూర్తి.. రిటైర్మెంట్ త‌ర్వాత‌.. మీర్ పేట ప‌రిధిలోని తూప్రాన్‌లో స్థిర‌ప‌డ్డా డు. ఈయ‌న‌కు భార్య‌ మాధ‌వి, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. సైనికుడిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు పింఛ‌న్ వ‌స్తోంది. అదేవిధంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. వీరికి పెళ్ల‌యి 13 ఏళ్లు అయింది. అయితే.. ఈ మ‌ధ్య కాలంలో మాధ‌విపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. ప‌లు మార్లు ఆమెతో వివాదానికి దిగాడు. ఈ క్ర‌మంలో ఈ నెల 17న రాత్రి ఆమెను ఇంట్లోనే హ‌త్య చేశాడు.

త‌ర్వాత‌.. ముక్క‌లు ముక్క‌లుగా కోసి.. కుక్క‌ర్‌లో ఉడికించి.. వేర్వేరు సంచుల్లో వాటిని తీసుకువెళ్లి చెరువులో వేశాడు.. వీటిని చేప‌లు తినేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. అస‌లు ఏమీ తెలియ‌ని వాడిగా.. మాధ‌వి త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి.. మీ అమ్మాయి వ‌చ్చిందా? అని ప్ర‌శ్నించాడు. అంటే పండుగ‌కు పుట్టింటికి వ‌చ్చింద‌ని చెప్పాడు.. దీంతో వారు ఆందోళ‌న చెంది.. మీర్ పేట పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. చిత్రం ఏంటంటే.. అత్త‌మామ‌ల‌తో క‌లిసి.. గురుమూర్తి కూడా.. పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. త‌న భార్య అంటే త‌న‌కు ఎన‌లేని ప్రేమ అని.. ఆమెను వెతికి పెట్టాల‌ని కోరాడు.

ఎలా బ‌య‌ట ప‌డిందంటే!

గురుమూర్తిపై తొలుత పోలీసుల‌కు ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే.. భార‌త సైన్యంలో ప‌నిచేసిన నేప‌థ్యం ఉండ‌డంతో ఆయ‌న నిజాయితీని వారు శంకించ‌లేక పోయారు. కానీ, చుట్టుప‌క్క‌ల విచారించిన‌ప్పుడు.. (గురుమూర్తి లేని స‌మ‌యంలో) భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వివాదాలు ఉన్నాయ‌ని.. తెలిసింది. దీంతో ఆయ‌న ప‌నిచేస్తున్న కంపెనీ వ‌ద్ద విచారించ‌గా.. అస‌లు విష‌యం వెలుగు చూసింది. దీంతో నేరుగా స్టేష‌న్‌కు పిలిచి.. విచారించ‌డంతో గురుమూర్తి అస‌లు విష‌యం చెప్పాడు. అయితే.. మాంస‌పు ముద్ద‌లు ల‌భించ‌క‌పోవ‌డం.. వాటిని చేప‌లు ఇత‌ర క్రిములు తినేయ‌డంతో డీఎన్ ఏ టెస్టు కోసం.. ప్ర‌య‌త్నిస్తున్నారు.

Satya

Recent Posts

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

2 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

3 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

4 hours ago

న‌ట‌రాజ‌న్‌… కింక‌ర్త‌వ్యం…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజ‌న్‌ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…

6 hours ago

పూజా హెగ్డేకు మరోసారి నిరాశ

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…

7 hours ago

లెజెండరీ దర్శకులు భారతీరాజా ఇక లేరు

ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…

9 hours ago