ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన ఘటన దేశం మొత్తాన్ని కలచి వేసింది. కదిలించేసింది. దీనిపై అనేక మంది బుగ్గలు నొక్కుకున్నారు. ఇంత దారుణం చేస్తారా? అని తల పట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మన హైదరాబాద్లోనే అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగితే!.. ఆశ్చర్యం కాదు నిజం. మాటలకందని ఘోరం మీర్ పేటలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ మాజీ సైనికోద్యోగి.. ఆమెను చంపేశాడు. అంతేకాదు.. ఆమెను ముక్కలు చేసి .. కుక్కర్లో ఉడికించాడు. అనంతరం.. వాటిని సమీపంలోని జిల్లెలగూడ చెరువులో చేపలకు ఆహారంగా వేశాడు!!
మనసున్న వారు ఎవరూ ఊహించేందుకు కూడా సాహసించని ఈ ఘోరం.. మీర్ పేటలోనే జరిగింది. అది కూడా ఈ నెల 18నే జరిగింది. భారత సైన్యంలో సిపాయిగా పనిచేసిన గురుమూర్తి.. రిటైర్మెంట్ తర్వాత.. మీర్ పేట పరిధిలోని తూప్రాన్లో స్థిరపడ్డా డు. ఈయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైనికుడిగా పనిచేసిన ఆయనకు పింఛన్ వస్తోంది. అదేవిధంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి పెళ్లయి 13 ఏళ్లు అయింది. అయితే.. ఈ మధ్య కాలంలో మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. పలు మార్లు ఆమెతో వివాదానికి దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 17న రాత్రి ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు.
తర్వాత.. ముక్కలు ముక్కలుగా కోసి.. కుక్కర్లో ఉడికించి.. వేర్వేరు సంచుల్లో వాటిని తీసుకువెళ్లి చెరువులో వేశాడు.. వీటిని చేపలు తినేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. అసలు ఏమీ తెలియని వాడిగా.. మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ అమ్మాయి వచ్చిందా? అని ప్రశ్నించాడు. అంటే పండుగకు పుట్టింటికి వచ్చిందని చెప్పాడు.. దీంతో వారు ఆందోళన చెంది.. మీర్ పేట పోలీసులను ఆశ్రయించారు. చిత్రం ఏంటంటే.. అత్తమామలతో కలిసి.. గురుమూర్తి కూడా.. పోలీసుల వద్దకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య అంటే తనకు ఎనలేని ప్రేమ అని.. ఆమెను వెతికి పెట్టాలని కోరాడు.
ఎలా బయట పడిందంటే!
గురుమూర్తిపై తొలుత పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే.. భారత సైన్యంలో పనిచేసిన నేపథ్యం ఉండడంతో ఆయన నిజాయితీని వారు శంకించలేక పోయారు. కానీ, చుట్టుపక్కల విచారించినప్పుడు.. (గురుమూర్తి లేని సమయంలో) భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని.. తెలిసింది. దీంతో ఆయన పనిచేస్తున్న కంపెనీ వద్ద విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో నేరుగా స్టేషన్కు పిలిచి.. విచారించడంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు. అయితే.. మాంసపు ముద్దలు లభించకపోవడం.. వాటిని చేపలు ఇతర క్రిములు తినేయడంతో డీఎన్ ఏ టెస్టు కోసం.. ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on January 23, 2025 10:26 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…