ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన ఘటన దేశం మొత్తాన్ని కలచి వేసింది. కదిలించేసింది. దీనిపై అనేక మంది బుగ్గలు నొక్కుకున్నారు. ఇంత దారుణం చేస్తారా? అని తల పట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మన హైదరాబాద్లోనే అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగితే!.. ఆశ్చర్యం కాదు నిజం. మాటలకందని ఘోరం మీర్ పేటలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ మాజీ సైనికోద్యోగి.. ఆమెను చంపేశాడు. అంతేకాదు.. ఆమెను ముక్కలు చేసి .. కుక్కర్లో ఉడికించాడు. అనంతరం.. వాటిని సమీపంలోని జిల్లెలగూడ చెరువులో చేపలకు ఆహారంగా వేశాడు!!
మనసున్న వారు ఎవరూ ఊహించేందుకు కూడా సాహసించని ఈ ఘోరం.. మీర్ పేటలోనే జరిగింది. అది కూడా ఈ నెల 18నే జరిగింది. భారత సైన్యంలో సిపాయిగా పనిచేసిన గురుమూర్తి.. రిటైర్మెంట్ తర్వాత.. మీర్ పేట పరిధిలోని తూప్రాన్లో స్థిరపడ్డా డు. ఈయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైనికుడిగా పనిచేసిన ఆయనకు పింఛన్ వస్తోంది. అదేవిధంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి పెళ్లయి 13 ఏళ్లు అయింది. అయితే.. ఈ మధ్య కాలంలో మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. పలు మార్లు ఆమెతో వివాదానికి దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 17న రాత్రి ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు.
తర్వాత.. ముక్కలు ముక్కలుగా కోసి.. కుక్కర్లో ఉడికించి.. వేర్వేరు సంచుల్లో వాటిని తీసుకువెళ్లి చెరువులో వేశాడు.. వీటిని చేపలు తినేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. అసలు ఏమీ తెలియని వాడిగా.. మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ అమ్మాయి వచ్చిందా? అని ప్రశ్నించాడు. అంటే పండుగకు పుట్టింటికి వచ్చిందని చెప్పాడు.. దీంతో వారు ఆందోళన చెంది.. మీర్ పేట పోలీసులను ఆశ్రయించారు. చిత్రం ఏంటంటే.. అత్తమామలతో కలిసి.. గురుమూర్తి కూడా.. పోలీసుల వద్దకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య అంటే తనకు ఎనలేని ప్రేమ అని.. ఆమెను వెతికి పెట్టాలని కోరాడు.
ఎలా బయట పడిందంటే!
గురుమూర్తిపై తొలుత పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే.. భారత సైన్యంలో పనిచేసిన నేపథ్యం ఉండడంతో ఆయన నిజాయితీని వారు శంకించలేక పోయారు. కానీ, చుట్టుపక్కల విచారించినప్పుడు.. (గురుమూర్తి లేని సమయంలో) భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని.. తెలిసింది. దీంతో ఆయన పనిచేస్తున్న కంపెనీ వద్ద విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో నేరుగా స్టేషన్కు పిలిచి.. విచారించడంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు. అయితే.. మాంసపు ముద్దలు లభించకపోవడం.. వాటిని చేపలు ఇతర క్రిములు తినేయడంతో డీఎన్ ఏ టెస్టు కోసం.. ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on January 23, 2025 10:26 am
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…