ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన ఘటన దేశం మొత్తాన్ని కలచి వేసింది. కదిలించేసింది. దీనిపై అనేక మంది బుగ్గలు నొక్కుకున్నారు. ఇంత దారుణం చేస్తారా? అని తల పట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మన హైదరాబాద్లోనే అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగితే!.. ఆశ్చర్యం కాదు నిజం. మాటలకందని ఘోరం మీర్ పేటలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ మాజీ సైనికోద్యోగి.. ఆమెను చంపేశాడు. అంతేకాదు.. ఆమెను ముక్కలు చేసి .. కుక్కర్లో ఉడికించాడు. అనంతరం.. వాటిని సమీపంలోని జిల్లెలగూడ చెరువులో చేపలకు ఆహారంగా వేశాడు!!
మనసున్న వారు ఎవరూ ఊహించేందుకు కూడా సాహసించని ఈ ఘోరం.. మీర్ పేటలోనే జరిగింది. అది కూడా ఈ నెల 18నే జరిగింది. భారత సైన్యంలో సిపాయిగా పనిచేసిన గురుమూర్తి.. రిటైర్మెంట్ తర్వాత.. మీర్ పేట పరిధిలోని తూప్రాన్లో స్థిరపడ్డా డు. ఈయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైనికుడిగా పనిచేసిన ఆయనకు పింఛన్ వస్తోంది. అదేవిధంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి పెళ్లయి 13 ఏళ్లు అయింది. అయితే.. ఈ మధ్య కాలంలో మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. పలు మార్లు ఆమెతో వివాదానికి దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 17న రాత్రి ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు.
తర్వాత.. ముక్కలు ముక్కలుగా కోసి.. కుక్కర్లో ఉడికించి.. వేర్వేరు సంచుల్లో వాటిని తీసుకువెళ్లి చెరువులో వేశాడు.. వీటిని చేపలు తినేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. అసలు ఏమీ తెలియని వాడిగా.. మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ అమ్మాయి వచ్చిందా? అని ప్రశ్నించాడు. అంటే పండుగకు పుట్టింటికి వచ్చిందని చెప్పాడు.. దీంతో వారు ఆందోళన చెంది.. మీర్ పేట పోలీసులను ఆశ్రయించారు. చిత్రం ఏంటంటే.. అత్తమామలతో కలిసి.. గురుమూర్తి కూడా.. పోలీసుల వద్దకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య అంటే తనకు ఎనలేని ప్రేమ అని.. ఆమెను వెతికి పెట్టాలని కోరాడు.
ఎలా బయట పడిందంటే!
గురుమూర్తిపై తొలుత పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే.. భారత సైన్యంలో పనిచేసిన నేపథ్యం ఉండడంతో ఆయన నిజాయితీని వారు శంకించలేక పోయారు. కానీ, చుట్టుపక్కల విచారించినప్పుడు.. (గురుమూర్తి లేని సమయంలో) భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని.. తెలిసింది. దీంతో ఆయన పనిచేస్తున్న కంపెనీ వద్ద విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో నేరుగా స్టేషన్కు పిలిచి.. విచారించడంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు. అయితే.. మాంసపు ముద్దలు లభించకపోవడం.. వాటిని చేపలు ఇతర క్రిములు తినేయడంతో డీఎన్ ఏ టెస్టు కోసం.. ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on January 23, 2025 10:26 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…