Trends

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ బతుకు పోరాటమే. ఎంత బతుకు పోరాటమైనా ప్రాణాలు ఉంటేనే కదా. నిజమే… మేనిలో ప్రాణం ఉంటేనే కదా… ఎంతటి బతుకు పోరాటమైనా ముందుకు సాగేది. ఎవరి ఆలోచనల్లో వారు అలా ముందుకు సాగుతూ ఉండగా… వారు ప్రయాణిస్తున్న రైలుతో అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయంటూ ఓ పుకారు వారిని హడలెత్తించింది.

అంతే… ప్రాణాలు కాపాడుకునే క్రమంలో పరుగులు పెడుతున్న రైలు నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని దూకేశారు. ప్రాణాలు కాపాడుకుందామని వారు ఈ సాహసానికి పూనుకున్నారు. అయితే వారిని విధి మరోలా ట్రీట్ చేసింది. ప్రాణ భయంతో రన్నింగ్ లోని ట్రైన్ లో నుంచి దూకేసిన వారిని మరో రైలు వచ్చి గుద్దేసింది. మహారాష్ట్రలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో ప్రాథమిక వార్తలు అందేసరికి 8 మంది చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

మహారాష్ట్రలోని జల్ గావ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం వైరల్ అయిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు యావత్తు దేశాన్ని వణికించాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే… నిండా ప్రయాణికులతో పరుగులు పెడుతున్న పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో ఓ చోట మంటలు అంటుకున్నాయంటూ పుకార్లు నిమిషాల్లో రైలు అంతటా వ్యాపించాయి. అంతే… ఓ బోగిలోని కొందరు వ్యక్తులు రైలును నిలిపివేసేలా చైన్ ను లాగారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై ఎప్పుడైతే స్లో అయిపోయిందో… చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క ట్రాక్ పైకి దూకేశారు.

అయితే అదే సమయంలో జనం దూకిన పట్టాలపై కర్ణాటక ఎక్స్ ప్రెస్ శరవేగంగా దూసుకువస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిందన్న భయం ఓ వైపు, చైన్ లాగడంతో పట్టాలపై కీచుమంటూ శబ్దం చేస్తూ పుష్పక్ ఎక్స్ ప్రెస్ నిలుస్తున్న వైనంతో పక్క పట్టాలపై వేగంగా దూసుకువస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ను ఎవరూ గమనించలేదు. అదే సమయంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ కూడా క్షణకాలంలో జరుగుతున్న పరిణామాలను గమనించలేకపోయారు. తన రైలును ముందుకు కదిలించారు. అంతే… పుష్పక్ ఎక్స్ ప్రెస్ నుంచి దూకిన వారిని కర్ణాటక ఎక్స్ ప్రెస్ గుద్దుకుంటూ వెళ్లిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగానే ఘోరం జరిగిపోయింది.

This post was last modified on January 22, 2025 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago