Trends

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ బతుకు పోరాటమే. ఎంత బతుకు పోరాటమైనా ప్రాణాలు ఉంటేనే కదా. నిజమే… మేనిలో ప్రాణం ఉంటేనే కదా… ఎంతటి బతుకు పోరాటమైనా ముందుకు సాగేది. ఎవరి ఆలోచనల్లో వారు అలా ముందుకు సాగుతూ ఉండగా… వారు ప్రయాణిస్తున్న రైలుతో అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయంటూ ఓ పుకారు వారిని హడలెత్తించింది.

అంతే… ప్రాణాలు కాపాడుకునే క్రమంలో పరుగులు పెడుతున్న రైలు నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని దూకేశారు. ప్రాణాలు కాపాడుకుందామని వారు ఈ సాహసానికి పూనుకున్నారు. అయితే వారిని విధి మరోలా ట్రీట్ చేసింది. ప్రాణ భయంతో రన్నింగ్ లోని ట్రైన్ లో నుంచి దూకేసిన వారిని మరో రైలు వచ్చి గుద్దేసింది. మహారాష్ట్రలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో ప్రాథమిక వార్తలు అందేసరికి 8 మంది చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.

మహారాష్ట్రలోని జల్ గావ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం వైరల్ అయిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు యావత్తు దేశాన్ని వణికించాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంలోకి వెళితే… నిండా ప్రయాణికులతో పరుగులు పెడుతున్న పుష్పక్ ఎక్స్ ప్రెస్ లో ఓ చోట మంటలు అంటుకున్నాయంటూ పుకార్లు నిమిషాల్లో రైలు అంతటా వ్యాపించాయి. అంతే… ఓ బోగిలోని కొందరు వ్యక్తులు రైలును నిలిపివేసేలా చైన్ ను లాగారు. ఈ క్రమంలో రైలు పట్టాలపై ఎప్పుడైతే స్లో అయిపోయిందో… చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క ట్రాక్ పైకి దూకేశారు.

అయితే అదే సమయంలో జనం దూకిన పట్టాలపై కర్ణాటక ఎక్స్ ప్రెస్ శరవేగంగా దూసుకువస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిందన్న భయం ఓ వైపు, చైన్ లాగడంతో పట్టాలపై కీచుమంటూ శబ్దం చేస్తూ పుష్పక్ ఎక్స్ ప్రెస్ నిలుస్తున్న వైనంతో పక్క పట్టాలపై వేగంగా దూసుకువస్తున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ ను ఎవరూ గమనించలేదు. అదే సమయంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ కూడా క్షణకాలంలో జరుగుతున్న పరిణామాలను గమనించలేకపోయారు. తన రైలును ముందుకు కదిలించారు. అంతే… పుష్పక్ ఎక్స్ ప్రెస్ నుంచి దూకిన వారిని కర్ణాటక ఎక్స్ ప్రెస్ గుద్దుకుంటూ వెళ్లిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగానే ఘోరం జరిగిపోయింది.

This post was last modified on January 22, 2025 7:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago