హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. పుట్టిన రోజు పార్టీ పేరుతో కాలేజీ విద్యార్థిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేసిన వైనం సంచలనంగా మారింది. నమ్మించి మోసం చేయటమే కాదు.. తాము చేసిన పనిని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించిన వైనాన్ని.. బాధితురాలు ధైర్యంగా బయటకు చెప్పటంతో ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్ లో తల్లిదండ్రులతో కలిసి ఉండే పందొమ్మిదేళ్ల డిగ్రీ విద్యార్థిని సికింద్రాబాద్ లో చదువుతోంది.
ఆమె ఇంటికి దగ్గర్లోనే జోసెఫ్.. నవీన్ రెడ్డి.. రాములు ఆమెకు స్నేహితులుగా ఉండేవారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 5న కాలేజీ టర్మ్ ఫీజు కట్టేందుకు కళాశాలకు వెళ్లింది. అదే సమయంలో ఫోన్ చేసిన జోసెఫ్.. ఈ రోజు తన పుట్టినరోజు అని..పార్టీకి రావాలన్నాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా వస్తున్నట్లు చెప్పటంతో.. నమ్మిన ఆమె ఓకే చెప్పింది. వీరంతా బిర్యానీ పార్శిల్ తీసుకొని ట్యాంక్ బండ్ వద్ద కాసేపు గడిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటల వేళలో.. కేపీహెచ్ బీ కాలనీలోని ఒక లాడ్జ్ కు వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుక చేసుకోవాలనుకున్నారు.
కేక్ తెచ్చేందుకు బయటకు వెళ్లిన నవీన్.. కేక్ మీద మత్తు మందు చల్లారు. అందరం కలిసి తిందామంటే.. కాదు.. ముందు నువ్వు తిను అంటూ ఆమె చేత కేక్ తినిపించారు. కాసేపటికే మత్తులోకి వెళ్లిన ఆమెను ఈ ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామని బెదిరించిన వారు.. ఆమెను ఆటోలో ఇంటికి పంపారు. ఆ తర్వాత నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నెల11న అపస్మారకస్థితికి చేరుకోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. ఆ సందర్భంగా ఆమెపై జరిగిన లైంగిక దాడి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో.. జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్నేహం ముసుగులో చోటు చేసుకున్న ఈ దారుణం షాకింగ్ గా మారింది. స్నేహం ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.
This post was last modified on October 16, 2020 2:24 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…