హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. పుట్టిన రోజు పార్టీ పేరుతో కాలేజీ విద్యార్థిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేసిన వైనం సంచలనంగా మారింది. నమ్మించి మోసం చేయటమే కాదు.. తాము చేసిన పనిని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించిన వైనాన్ని.. బాధితురాలు ధైర్యంగా బయటకు చెప్పటంతో ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్ లో తల్లిదండ్రులతో కలిసి ఉండే పందొమ్మిదేళ్ల డిగ్రీ విద్యార్థిని సికింద్రాబాద్ లో చదువుతోంది.
ఆమె ఇంటికి దగ్గర్లోనే జోసెఫ్.. నవీన్ రెడ్డి.. రాములు ఆమెకు స్నేహితులుగా ఉండేవారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 5న కాలేజీ టర్మ్ ఫీజు కట్టేందుకు కళాశాలకు వెళ్లింది. అదే సమయంలో ఫోన్ చేసిన జోసెఫ్.. ఈ రోజు తన పుట్టినరోజు అని..పార్టీకి రావాలన్నాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా వస్తున్నట్లు చెప్పటంతో.. నమ్మిన ఆమె ఓకే చెప్పింది. వీరంతా బిర్యానీ పార్శిల్ తీసుకొని ట్యాంక్ బండ్ వద్ద కాసేపు గడిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటల వేళలో.. కేపీహెచ్ బీ కాలనీలోని ఒక లాడ్జ్ కు వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుక చేసుకోవాలనుకున్నారు.
కేక్ తెచ్చేందుకు బయటకు వెళ్లిన నవీన్.. కేక్ మీద మత్తు మందు చల్లారు. అందరం కలిసి తిందామంటే.. కాదు.. ముందు నువ్వు తిను అంటూ ఆమె చేత కేక్ తినిపించారు. కాసేపటికే మత్తులోకి వెళ్లిన ఆమెను ఈ ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామని బెదిరించిన వారు.. ఆమెను ఆటోలో ఇంటికి పంపారు. ఆ తర్వాత నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నెల11న అపస్మారకస్థితికి చేరుకోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. ఆ సందర్భంగా ఆమెపై జరిగిన లైంగిక దాడి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో.. జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్నేహం ముసుగులో చోటు చేసుకున్న ఈ దారుణం షాకింగ్ గా మారింది. స్నేహం ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.
This post was last modified on October 16, 2020 2:24 pm
అల్లు అర్జున్కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…