దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటిస్తోన్న కరోనా కేసుల సంఖ్య చూస్తే నిజంగా కరోనా తగ్గిపోయిందేమోననే భావన కలుగుతుంది. కానీ నిజానికి కరోనా కేసులను రిపోర్ట్ చేయడం మానేసారంతే. ఇంకా దానికి విరుగుడు రాలేదు. అలాగే జనం దాని బారిన పడడం ఆగలేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికే వస్తే షూటింగ్ మొదలైన పలు యూనిట్లలో పలువురికి కరోనా సోకిందట. వారానికోసారి టెస్టులు చేసుకుంటూ ఎవరికి కరోనా వస్తే వారిని ఇంటికి పంపించేసి మిగతా వాళ్లతో షూటింగ్ చేస్తున్నారట. అయితే దీని గురించి మీడియాలో రాకుండా చూసుకుంటున్నారట. కానీ ఇండస్ట్రీలో అయితే పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలుసు.
ధైర్యంగా వున్న కొందరు యువ హీరోలు మినహాయించి పెద్ద స్టార్లు, ముఖ్యంగా సీనియర్లు మాత్రం కోవిడ్కి భయపడుతున్నారు. నవంబరు నుంచి షూటింగ్ చేద్దామని అనుకున్న వాళ్లు కూడా మరికొన్నాళ్ల పాటు షూటింగ్ వాయిదా వేసుకుంటున్నారు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప షూటింగ్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం వుందంటున్నారు. అలాగే మరో సీనియర్ స్టార్ బాలకృష్ణ కూడా బోయపాటితో చేస్తోన్న సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సుముఖంగా లేరు.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…