Trends

రూ.1077 కోట్ల భవనం కార్చిచ్చుకు కాలి బూడిదైంది

కొద్ది రోజుల క్రితం రగులుకున్న మాయదారి కార్చిచ్చు.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. సంపదతో తులతూగుతూ.. విలాసవంత జీవనానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండే ఈ మహానగరం.. ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. వేలాది ఇళ్లు కాలి బూడిద అయ్యాయి.

వాటిల్లో అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నాయి. ఈ కార్చిచ్చు కారణంగా జరిగిన ఆస్తి నష్టం దగ్గర దగ్గర రూ.15 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ఒక అంచనా మాత్రమేనని.. వాస్తవంలో అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు కార్చిచ్చు కారణంగా జరిగిన నష్టాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆస్తినష్టానికి మించిన పర్యావరణ నష్టాన్ని చాలామంది లెక్క వేయట్లేదు. ఈ కార్చిచ్చు కారణంగా.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. పొగను అంతరిక్షంలోని ఉపగ్రహాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ కార్చిచ్చు బారిన పడిన ఒక విలాసవంతమైన భవనం మొత్తం నాశనమైంది. అత్యంత విలాసవంతమైన ఈ భవనం విలువ సుమారు 125 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.1077 కోట్లకు పైనే. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

లాస్ ఏంజెలెస్ లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతానికి చెందిన ఈ విలసవంతమైన భవనం ఇప్పుడు శిథిలంగా మారింది. 18 పడకల ఈ ఖరీదైన భవన యజమాని లుమినార్ టెక్నాలజీస్ సీఈవో ఆస్టిన్ రస్సెల్. దీనిని అద్దెకు ఇస్తేనే రూ.3 కోట్లకు పైనే వస్తుంది. సక్సెషన్ అనే టీవీ సీరిస్ లో ఈ ఇల్లు కనిపిస్తుంది. అలా ఈ ఇంటి సౌందర్యం బాహ్య ప్రపంచానికి తెలిసింది.

అబ్బుర పరిచే ఫర్నీచర్.. చూసినంతనే మనసులో ముద్ర వేసే గార్డెన్స్ అన్నీ కాలి బూడిద అయ్యాయి. ఈ మాయదారి కార్చిచ్చుతో లాస్ ఏంజెలెస్ సంపద ఆవిరైపోయింది. ఎటు చూసినా.. పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన ఇళ్లు.. దర్శనమిస్తున్నాయి. ధనవంతులు.. సెలబ్రిటీలు.. హాలీవుడ్ తారలు మంటల ధాటికి ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో.. వారి ఇళ్లల్లోని విలువైన వస్తువుల్ని దొంగలు దోచుకుంటున్నారు.

కార్చిచ్చు కారణంగా చోటు చేసుకున్న ఆస్తి నష్టాన్ని అంచనా వేసింది ఆక్యువెదర్ సంస్థ. దీని అంచనాల ప్రకారం సుమారు 150 బిలియన్ డాలర్లకు పెరగొచ్చని చెబుతున్నారు. ఈ విపత్తుతో అమెరికా బీమా రంగం కుదేలు కావటం ఖాయమంటున్నారు. జేపీ మోర్గాన్.. మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావొచ్చని చెబుతున్నారు.

కొన్ని నెలల క్రితం పాలిసాడ్స్ లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించిన అతి పెద్ద బీమా సంస్థ స్టేట్ ఫామ్ బీమా పాలసీలు ఇవ్వటం మానేసింది. అలాంటి జాగ్రత్తలు తీసుకున్న సంస్థలు మినహా.. మిగిలిన సంస్థల పరిస్థితి దయనీయంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on January 12, 2025 6:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: Los Angeles

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

6 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

8 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

9 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago