Trends

రూ.1077 కోట్ల భవనం కార్చిచ్చుకు కాలి బూడిదైంది

కొద్ది రోజుల క్రితం రగులుకున్న మాయదారి కార్చిచ్చు.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. సంపదతో తులతూగుతూ.. విలాసవంత జీవనానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండే ఈ మహానగరం.. ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. వేలాది ఇళ్లు కాలి బూడిద అయ్యాయి.

వాటిల్లో అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నాయి. ఈ కార్చిచ్చు కారణంగా జరిగిన ఆస్తి నష్టం దగ్గర దగ్గర రూ.15 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ఒక అంచనా మాత్రమేనని.. వాస్తవంలో అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు కార్చిచ్చు కారణంగా జరిగిన నష్టాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆస్తినష్టానికి మించిన పర్యావరణ నష్టాన్ని చాలామంది లెక్క వేయట్లేదు. ఈ కార్చిచ్చు కారణంగా.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. పొగను అంతరిక్షంలోని ఉపగ్రహాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ కార్చిచ్చు బారిన పడిన ఒక విలాసవంతమైన భవనం మొత్తం నాశనమైంది. అత్యంత విలాసవంతమైన ఈ భవనం విలువ సుమారు 125 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.1077 కోట్లకు పైనే. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

లాస్ ఏంజెలెస్ లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతానికి చెందిన ఈ విలసవంతమైన భవనం ఇప్పుడు శిథిలంగా మారింది. 18 పడకల ఈ ఖరీదైన భవన యజమాని లుమినార్ టెక్నాలజీస్ సీఈవో ఆస్టిన్ రస్సెల్. దీనిని అద్దెకు ఇస్తేనే రూ.3 కోట్లకు పైనే వస్తుంది. సక్సెషన్ అనే టీవీ సీరిస్ లో ఈ ఇల్లు కనిపిస్తుంది. అలా ఈ ఇంటి సౌందర్యం బాహ్య ప్రపంచానికి తెలిసింది.

అబ్బుర పరిచే ఫర్నీచర్.. చూసినంతనే మనసులో ముద్ర వేసే గార్డెన్స్ అన్నీ కాలి బూడిద అయ్యాయి. ఈ మాయదారి కార్చిచ్చుతో లాస్ ఏంజెలెస్ సంపద ఆవిరైపోయింది. ఎటు చూసినా.. పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన ఇళ్లు.. దర్శనమిస్తున్నాయి. ధనవంతులు.. సెలబ్రిటీలు.. హాలీవుడ్ తారలు మంటల ధాటికి ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో.. వారి ఇళ్లల్లోని విలువైన వస్తువుల్ని దొంగలు దోచుకుంటున్నారు.

కార్చిచ్చు కారణంగా చోటు చేసుకున్న ఆస్తి నష్టాన్ని అంచనా వేసింది ఆక్యువెదర్ సంస్థ. దీని అంచనాల ప్రకారం సుమారు 150 బిలియన్ డాలర్లకు పెరగొచ్చని చెబుతున్నారు. ఈ విపత్తుతో అమెరికా బీమా రంగం కుదేలు కావటం ఖాయమంటున్నారు. జేపీ మోర్గాన్.. మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావొచ్చని చెబుతున్నారు.

కొన్ని నెలల క్రితం పాలిసాడ్స్ లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించిన అతి పెద్ద బీమా సంస్థ స్టేట్ ఫామ్ బీమా పాలసీలు ఇవ్వటం మానేసింది. అలాంటి జాగ్రత్తలు తీసుకున్న సంస్థలు మినహా.. మిగిలిన సంస్థల పరిస్థితి దయనీయంగా మారిందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on January 12, 2025 6:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: Los Angeles

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago