జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన ఈ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులకు సవాలుగా మారింది. విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రమాదానికి గురైన ‘బీచ్క్రాఫ్ట్ కింగ్ ఎయిర్’ విమానం ఏకంగా 39 ఏళ్ల నాటిది. 1987లో తయారైన ఈ విమానం ఇప్పటివరకు 6,600 గంటల పాటు ప్రయాణించింది. రెడ్బర్డ్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన ఈ విమానం 2018 నుండి 2022 వరకు అసలు వాడకంలోనే లేదు. నాలుగేళ్ల పాటు మూలనపడ్డ పాత విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాడటంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎనిమిది లక్షల రూపాయల కోసం రోగి ప్రాణాలతో ఆడుకున్నారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ (CVR/FDR) ఈ విమానంలో లేదు. సాధారణంగా విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అయితే ఈ విమానం బరువు 5,700 కిలోల కంటే తక్కువ ఉండటం వల్ల, దీనికి బ్లాక్ బాక్స్ ఉండాలనే నిబంధన వర్తించదు. దీనివల్ల పైలట్లు చివరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు వచ్చాయనేది తెలుసుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. కేవలం రాడార్ సమాచారం, శిథిలాల ఆధారంగానే దర్యాప్తు సాగించాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కూడా అనుకూలించలేదు. గాలిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అదే సమయంలో ఆ రూట్లో వెళ్లిన ఇతర సంస్థల విమానాలు కూడా వాతావరణం బాగోలేదని రిపోర్ట్ చేశాయి.
టేకాఫ్ అయిన 23 నిమిషాలకే రాడార్తో సంబంధాలు తెగిపోవడం, ఆ వెంటనే అడవిలో కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ విషాదంలో పేషెంట్ సంజయ్ కుమార్ (41) తో పాటు ఒక డాక్టర్, పారామెడిక్ సిబ్బంది, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి విమానం ఎక్కితే, అదే విమానం ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on February 25, 2026 11:20 pm
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…