Trends

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన ఈ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులకు సవాలుగా మారింది. విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రమాదానికి గురైన ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్’ విమానం ఏకంగా 39 ఏళ్ల నాటిది. 1987లో తయారైన ఈ విమానం ఇప్పటివరకు 6,600 గంటల పాటు ప్రయాణించింది. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన ఈ విమానం 2018 నుండి 2022 వరకు అసలు వాడకంలోనే లేదు. నాలుగేళ్ల పాటు మూలనపడ్డ పాత విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాడటంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎనిమిది లక్షల రూపాయల కోసం రోగి ప్రాణాలతో ఆడుకున్నారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ (CVR/FDR) ఈ విమానంలో లేదు. సాధారణంగా విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అయితే ఈ విమానం బరువు 5,700 కిలోల కంటే తక్కువ ఉండటం వల్ల, దీనికి బ్లాక్ బాక్స్ ఉండాలనే నిబంధన వర్తించదు. దీనివల్ల పైలట్లు చివరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు వచ్చాయనేది తెలుసుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. కేవలం రాడార్ సమాచారం, శిథిలాల ఆధారంగానే దర్యాప్తు సాగించాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కూడా అనుకూలించలేదు. గాలిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అదే సమయంలో ఆ రూట్‌లో వెళ్లిన ఇతర సంస్థల విమానాలు కూడా వాతావరణం బాగోలేదని రిపోర్ట్ చేశాయి.

టేకాఫ్ అయిన 23 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం, ఆ వెంటనే అడవిలో కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ విషాదంలో పేషెంట్ సంజయ్ కుమార్ (41) తో పాటు ఒక డాక్టర్, పారామెడిక్ సిబ్బంది, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి విమానం ఎక్కితే, అదే విమానం ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Kumar

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

46 minutes ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

1 hour ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

1 hour ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

2 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

2 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

2 hours ago