Trends

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన ఈ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులకు సవాలుగా మారింది. విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రమాదానికి గురైన ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్’ విమానం ఏకంగా 39 ఏళ్ల నాటిది. 1987లో తయారైన ఈ విమానం ఇప్పటివరకు 6,600 గంటల పాటు ప్రయాణించింది. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన ఈ విమానం 2018 నుండి 2022 వరకు అసలు వాడకంలోనే లేదు. నాలుగేళ్ల పాటు మూలనపడ్డ పాత విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాడటంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎనిమిది లక్షల రూపాయల కోసం రోగి ప్రాణాలతో ఆడుకున్నారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ (CVR/FDR) ఈ విమానంలో లేదు. సాధారణంగా విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అయితే ఈ విమానం బరువు 5,700 కిలోల కంటే తక్కువ ఉండటం వల్ల, దీనికి బ్లాక్ బాక్స్ ఉండాలనే నిబంధన వర్తించదు. దీనివల్ల పైలట్లు చివరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు వచ్చాయనేది తెలుసుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. కేవలం రాడార్ సమాచారం, శిథిలాల ఆధారంగానే దర్యాప్తు సాగించాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కూడా అనుకూలించలేదు. గాలిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అదే సమయంలో ఆ రూట్‌లో వెళ్లిన ఇతర సంస్థల విమానాలు కూడా వాతావరణం బాగోలేదని రిపోర్ట్ చేశాయి.

టేకాఫ్ అయిన 23 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం, ఆ వెంటనే అడవిలో కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ విషాదంలో పేషెంట్ సంజయ్ కుమార్ (41) తో పాటు ఒక డాక్టర్, పారామెడిక్ సిబ్బంది, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి విమానం ఎక్కితే, అదే విమానం ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on February 25, 2026 11:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago