జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన ఈ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులకు సవాలుగా మారింది. విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రమాదానికి గురైన ‘బీచ్క్రాఫ్ట్ కింగ్ ఎయిర్’ విమానం ఏకంగా 39 ఏళ్ల నాటిది. 1987లో తయారైన ఈ విమానం ఇప్పటివరకు 6,600 గంటల పాటు ప్రయాణించింది. రెడ్బర్డ్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన ఈ విమానం 2018 నుండి 2022 వరకు అసలు వాడకంలోనే లేదు. నాలుగేళ్ల పాటు మూలనపడ్డ పాత విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాడటంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎనిమిది లక్షల రూపాయల కోసం రోగి ప్రాణాలతో ఆడుకున్నారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ (CVR/FDR) ఈ విమానంలో లేదు. సాధారణంగా విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అయితే ఈ విమానం బరువు 5,700 కిలోల కంటే తక్కువ ఉండటం వల్ల, దీనికి బ్లాక్ బాక్స్ ఉండాలనే నిబంధన వర్తించదు. దీనివల్ల పైలట్లు చివరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు వచ్చాయనేది తెలుసుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. కేవలం రాడార్ సమాచారం, శిథిలాల ఆధారంగానే దర్యాప్తు సాగించాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కూడా అనుకూలించలేదు. గాలిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అదే సమయంలో ఆ రూట్లో వెళ్లిన ఇతర సంస్థల విమానాలు కూడా వాతావరణం బాగోలేదని రిపోర్ట్ చేశాయి.
టేకాఫ్ అయిన 23 నిమిషాలకే రాడార్తో సంబంధాలు తెగిపోవడం, ఆ వెంటనే అడవిలో కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ విషాదంలో పేషెంట్ సంజయ్ కుమార్ (41) తో పాటు ఒక డాక్టర్, పారామెడిక్ సిబ్బంది, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి విమానం ఎక్కితే, అదే విమానం ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on February 25, 2026 11:20 pm
జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…
చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…
ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…