అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్రను కూడా కూటమి పార్టీల ఎమ్మెల్యేలే పోషిస్తున్నారు. ప్రతి రోజూ అసెంబ్లీలో జరిగే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు.
ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన కీలక ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. చమత్కరించారు. “అధ్యక్షా ప్రతిపక్షం లేని లోటును మన ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. మనోళ్ల ప్రశ్నలే ఇంత ఘాటుగా ఉంటాయని ఊహించలేదు. మంచిదే అధ్యక్షా“ అని అనడంతో స్పీకర్ సహా అందరూ ఫక్కున నవ్వేశారు. ఇంతకీ ప్రశ్న.. ఏంటంటే.. “రాష్ట్రంలో ఎంత మందికి నైపుణ్యాభివృద్ధి కింద శిక్షణ ఇస్తున్నారు?“ అనే.
దీనిని టీడీపీ ఎమ్మెల్యేలు.. యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం), కన్నా లక్ష్మీనారాయణ(సత్తెనపల్లి) ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. ఎన్నికలకు ముందు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువతకు.. నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే పెట్టుబడులు సాకారం అవుతాయని.. ఆయా కంపెనీల్లో వీరికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఉద్యోగాల కల్పన రంగాలకు సంబంధించి వివిధ సెక్టార్లను ఏర్పాటు చేశామని.. వీటిపై మంత్రి వర్గ ఉప సంఘం కూడా కసరత్తు చేస్తోందని మంత్రి వివరించారు. అభ్యర్థుల నైపుణ్యాలను అనుసరించి ఆయా రంగాల్లో వారికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేసమయంలో నియోజకవర్గాల వారీగా 1500 లకు పైగా జాబ్ మేళాలు నిర్వహించామన్నారు. వాటి ద్వారా లక్ష మందికిపైగా ఉద్యోగాలు పొందారని చెప్పారు.
This post was last modified on February 25, 2026 11:25 pm
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…