మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు అండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఎస్ఎంఏ టైప్–1 కారణంగా పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడుతూ కదలికలు, శ్వాసక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పునర్విక అసాధారణ ధైర్యంతో వ్యాధితో పోరాడుతున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ప్రత్యేక ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు కాగా, ప్రజలు, దాతల సహకారంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమీకరించగలిగారని వెల్లడించారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైన నిధులు సమీకరించేందుకు తన కార్యాలయం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చికిత్స ఆలస్యం కాకుండా వెంటనే ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వ, సమాజ మద్దతు అవసరమని, ఇలాంటి సందర్భాల్లో అందరూ ఒక్కటై ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. పునర్విక ఆరోగ్యం త్వరగా మెరుగుపడి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. చిన్నారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
This post was last modified on February 25, 2026 10:12 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…