మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు అండగా నిలుస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఎస్ఎంఏ టైప్–1 కారణంగా పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడుతూ కదలికలు, శ్వాసక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పునర్విక అసాధారణ ధైర్యంతో వ్యాధితో పోరాడుతున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ప్రత్యేక ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు కాగా, ప్రజలు, దాతల సహకారంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమీకరించగలిగారని వెల్లడించారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైన నిధులు సమీకరించేందుకు తన కార్యాలయం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చికిత్స ఆలస్యం కాకుండా వెంటనే ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వ, సమాజ మద్దతు అవసరమని, ఇలాంటి సందర్భాల్లో అందరూ ఒక్కటై ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. పునర్విక ఆరోగ్యం త్వరగా మెరుగుపడి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. చిన్నారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
This post was last modified on February 25, 2026 10:12 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…