Trends

విమాన ప్రమాదం: 181 మందిలో ఆ ఇద్దరే ఎలా బ్రతికారు?

దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై అదుపుతప్పి కూలిపోవడం, ఆ తర్వాత మంటల్లో కాలిపోవడం హృదయవిదారకమైన ఘటనగా మారింది. ఈ ప్రమాదంలో 181 మందిలో 179 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విడుదలైన దృశ్యాలు హృదయాలను ద్రవింపచేశాయి.

ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరూ విమానం వెనుక భాగంలో కూర్చోవడం వల్లే అద్భుతంగా బతికారని అధికారులు వెల్లడించారు. 32 ఏళ్ల లీ, 25 ఏళ్ల క్వాన్ అనే ఇద్దరు విమాన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి గట్టెక్కారు. రెస్క్యూ సిబ్బంది సమాచారం ప్రకారం, మంటలు వ్యాపించకముందే వీరిని విమానం వెనుక భాగం నుంచి బయటకు తీసుకువచ్చారు. లీ ఎడమ భుజానికి గాయాలు కాగా, క్వాన్ చీలమండ విరగడం, కడుపునొప్పి కారణంగా బాధపడుతున్నాడు. వైద్యులు వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.

విమాన ప్రమాదాలపై గతంలో జరిగిన అధ్యయనాలు కూడా వెనుక భాగంలో కూర్చునే ప్రయాణికులు మరింత సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. 2015లో ‘టైమ్ మ్యాగజైన్’ నిర్వహించిన అధ్యయనంలో వెనుక సీట్లలో మరణాల రేటు 32 శాతంగా ఉండగా, ముందు భాగంలో ఇది 38 శాతం, మధ్యభాగంలో 39 శాతంగా ఉన్నట్లు తేలింది. ఈ గణాంకాలు ప్రస్తుత ఘటనలో కూడా మరోసారి నిజమయ్యాయి.

ఈ ఘటన తర్వాత విమాన సురక్షిత చర్యలపై చర్చలు మరింత ముమ్మరమయ్యాయి. విమాన ప్రయాణికులు ఎల్లప్పుడూ భద్రతా సూచనలను గమనించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని విమాన నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దక్షిణ కొరియా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే బయటపెడతామని అధికారులు వెల్లడించారు.

This post was last modified on December 31, 2024 1:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

44 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago