Trends

విమాన ప్రమాదం: 181 మందిలో ఆ ఇద్దరే ఎలా బ్రతికారు?

దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై అదుపుతప్పి కూలిపోవడం, ఆ తర్వాత మంటల్లో కాలిపోవడం హృదయవిదారకమైన ఘటనగా మారింది. ఈ ప్రమాదంలో 181 మందిలో 179 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విడుదలైన దృశ్యాలు హృదయాలను ద్రవింపచేశాయి.

ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరూ విమానం వెనుక భాగంలో కూర్చోవడం వల్లే అద్భుతంగా బతికారని అధికారులు వెల్లడించారు. 32 ఏళ్ల లీ, 25 ఏళ్ల క్వాన్ అనే ఇద్దరు విమాన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి గట్టెక్కారు. రెస్క్యూ సిబ్బంది సమాచారం ప్రకారం, మంటలు వ్యాపించకముందే వీరిని విమానం వెనుక భాగం నుంచి బయటకు తీసుకువచ్చారు. లీ ఎడమ భుజానికి గాయాలు కాగా, క్వాన్ చీలమండ విరగడం, కడుపునొప్పి కారణంగా బాధపడుతున్నాడు. వైద్యులు వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.

విమాన ప్రమాదాలపై గతంలో జరిగిన అధ్యయనాలు కూడా వెనుక భాగంలో కూర్చునే ప్రయాణికులు మరింత సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. 2015లో ‘టైమ్ మ్యాగజైన్’ నిర్వహించిన అధ్యయనంలో వెనుక సీట్లలో మరణాల రేటు 32 శాతంగా ఉండగా, ముందు భాగంలో ఇది 38 శాతం, మధ్యభాగంలో 39 శాతంగా ఉన్నట్లు తేలింది. ఈ గణాంకాలు ప్రస్తుత ఘటనలో కూడా మరోసారి నిజమయ్యాయి.

ఈ ఘటన తర్వాత విమాన సురక్షిత చర్యలపై చర్చలు మరింత ముమ్మరమయ్యాయి. విమాన ప్రయాణికులు ఎల్లప్పుడూ భద్రతా సూచనలను గమనించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని విమాన నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దక్షిణ కొరియా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే బయటపెడతామని అధికారులు వెల్లడించారు.

This post was last modified on December 31, 2024 1:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

30 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

60 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago