దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్ విమానం రన్వేపై అదుపుతప్పి కూలిపోవడం, ఆ తర్వాత మంటల్లో కాలిపోవడం హృదయవిదారకమైన ఘటనగా మారింది. ఈ ప్రమాదంలో 181 మందిలో 179 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విడుదలైన దృశ్యాలు హృదయాలను ద్రవింపచేశాయి.
ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరూ విమానం వెనుక భాగంలో కూర్చోవడం వల్లే అద్భుతంగా బతికారని అధికారులు వెల్లడించారు. 32 ఏళ్ల లీ, 25 ఏళ్ల క్వాన్ అనే ఇద్దరు విమాన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి గట్టెక్కారు. రెస్క్యూ సిబ్బంది సమాచారం ప్రకారం, మంటలు వ్యాపించకముందే వీరిని విమానం వెనుక భాగం నుంచి బయటకు తీసుకువచ్చారు. లీ ఎడమ భుజానికి గాయాలు కాగా, క్వాన్ చీలమండ విరగడం, కడుపునొప్పి కారణంగా బాధపడుతున్నాడు. వైద్యులు వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
విమాన ప్రమాదాలపై గతంలో జరిగిన అధ్యయనాలు కూడా వెనుక భాగంలో కూర్చునే ప్రయాణికులు మరింత సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. 2015లో ‘టైమ్ మ్యాగజైన్’ నిర్వహించిన అధ్యయనంలో వెనుక సీట్లలో మరణాల రేటు 32 శాతంగా ఉండగా, ముందు భాగంలో ఇది 38 శాతం, మధ్యభాగంలో 39 శాతంగా ఉన్నట్లు తేలింది. ఈ గణాంకాలు ప్రస్తుత ఘటనలో కూడా మరోసారి నిజమయ్యాయి.
ఈ ఘటన తర్వాత విమాన సురక్షిత చర్యలపై చర్చలు మరింత ముమ్మరమయ్యాయి. విమాన ప్రయాణికులు ఎల్లప్పుడూ భద్రతా సూచనలను గమనించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని విమాన నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దక్షిణ కొరియా ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే బయటపెడతామని అధికారులు వెల్లడించారు.
This post was last modified on December 31, 2024 1:30 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…