Trends

న్యూ ఇయ‌ర్ వేడుక‌లకు రడీ అవుతున్నారా

మ‌రికొన్ని గంటల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి ప్ర‌జ‌లు కూడా మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు. భార‌త్ స‌హా.. అన్ని దేశాలూ కూడా.. ఇటీవ‌ల కాలంలో ఘ‌నంగా ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకుం టున్నాయి. ఒక్క కొరియా మాత్ర‌మే ఈ వేడుక‌ల‌కు దూరం.

తాజాగా 179 మంది ప్ర‌యాణికులు విమాన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డంతో ద‌క్షిణ కొరియా సైతం ఈ సారి అధికారిక వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకుంది. ఇజ్రాయెల్‌, పాల‌స్తీనాలు, ఉక్రెయిన్ కూడా.. ఈ సారి వేడుక‌ల‌కు దూరంగా ఉన్నాయి. అలాగే అఫ్ఘాన్ కూడా.. వేడుక‌ల‌కు దూరంగా ఉంది.

కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌పై అఫ్ఘాన్‌లోని తాలిబ‌న్ పాల‌కులు.. నిషేధం విధించారని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో అక్క‌డ కూడా వేడుక‌లకు ప్ర‌జ‌లు దూరంగా ఉండ‌నున్నారు. ఇక‌, బంగ్లాదేశ్‌లో కూడా దాదాపు నిషేధ‌మే అమ‌లు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

అక్క‌డ రాజ‌కీయంగా అస్థిర‌త కొన‌సాగుతుండ‌డం, శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పుతాయ‌న్న బెంగ ఉన్న కార‌ణంగా తాత్కాలిక ప్ర‌ధాని యూన‌స్‌.. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ఎవ‌రి ఇళ్ల‌లో వారు జ‌రుపుకోవ‌డ‌మే మంచిద‌ని వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

ఇక‌, భార‌త్‌లోకి వ‌చ్చేసరికి ఏర్పాట్లు ధూంధాంగా సాగుతున్నాయి. మెట్రో న‌గ‌రాల్లో 48 గంట‌ల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. కేకుల త‌యారీ క‌ర్మాగారాలు.. రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నాయి. అయినా.. ఆర్డ‌ర్ల సంఖ్య‌తో పోలిస్తే..త‌యారీ మంద‌గించింద‌ని వ్యాపారులు చెబుతున్నారు.

మ‌రోవైపు.. మ‌ద్యం వినియోగం పెర‌గ‌నున్న నేప‌థ్యంలో డిస్టిల‌రీలలో కూడా స‌రుకు పూర్తిగా అయిపోయింది. మ‌ద్యం దుకాణాల‌కు ప్ర‌భుత్వం మ‌రో గంట అనుమ‌తి ఇచ్చింది. హైద‌రాబాద్ స‌హా విజ‌య‌వాడ‌, విశాఖ‌, ఏలూరు, రాజ‌మండ్రి, విజ‌య‌న‌గ‌రం వంటి ప్రాంతాల్లో అర్ధ‌రాత్రి 12.30 వ‌ర‌కు బార్ల‌కు, 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్‌కు అనుమ‌తి ఇచ్చారు.

స‌రే.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌కు ప‌బ్బులు కూడా రెడీ అయ్యాయి. త‌మ క్ల‌యింట్ల‌కు పబ్బులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ల‌ను కూడా జోడిస్తున్నాయి. విదేశీ మ‌ద్యంపై 5 శాతం, స్వ‌దేశీ త‌యారీ విదేశీ మ‌ద్యంపై 10 శాతం రాయితీలు ఇస్తున్నా యి. ఇదిలావుంటే.. మ‌హారాష్ట్ర‌లోని పుణేలో ఓ ప‌బ్ నిర్వాహ‌కులు చిత్ర‌మైన ఘ‌ట‌న‌కు తెర‌దీశారు. త‌మ ఖాతా దారుల‌కు ప్ర‌త్యేక ఆహ్వానాలు పంపించారు. సాయంత్రం 6 నుంచే సంబ‌రాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని.. తిన్నంత తిని, తాగినంత తాగ‌వ‌చ్చ‌ని కూడా పేర్కొన్నారు.

అయితే.. ఆ ఆహ్వాన సంచుల్లో(ఇన్విటేష‌న్ బ్యాగ్స్‌) కండోమ్‌లు, ఓఆర్ ఎస్‌లు పంపించారు. ఇది.. తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఖాతా దారుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ప‌బ్‌పై కేసు న‌మోదు చేశారు. ప‌బ్ ఉద్దేశం మేం తాగు బోతులం.. తిరుగుబోతుల‌మ‌నేగా! అని ఖాతా దారుడు నిప్పులు చెరిగాడు.

Satya

Recent Posts

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

16 minutes ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

49 minutes ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

3 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

4 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

5 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

5 hours ago