మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రజలు కూడా మానసికంగా సిద్ధమయ్యారు. భారత్ సహా.. అన్ని దేశాలూ కూడా.. ఇటీవల కాలంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహించుకుం టున్నాయి. ఒక్క కొరియా మాత్రమే ఈ వేడుకలకు దూరం.
తాజాగా 179 మంది ప్రయాణికులు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో దక్షిణ కొరియా సైతం ఈ సారి అధికారిక వేడుకలను రద్దు చేసుకుంది. ఇజ్రాయెల్, పాలస్తీనాలు, ఉక్రెయిన్ కూడా.. ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నాయి. అలాగే అఫ్ఘాన్ కూడా.. వేడుకలకు దూరంగా ఉంది.
కొత్త సంవత్సరం వేడుకలపై అఫ్ఘాన్లోని తాలిబన్ పాలకులు.. నిషేధం విధించారని వార్తలు వచ్చాయి. దీంతో అక్కడ కూడా వేడుకలకు ప్రజలు దూరంగా ఉండనున్నారు. ఇక, బంగ్లాదేశ్లో కూడా దాదాపు నిషేధమే అమలు చేసే అవకాశం ఉందని తెలిసింది.
అక్కడ రాజకీయంగా అస్థిరత కొనసాగుతుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతాయన్న బెంగ ఉన్న కారణంగా తాత్కాలిక ప్రధాని యూనస్.. కొత్త సంవత్సర వేడుకలను ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఇక, భారత్లోకి వచ్చేసరికి ఏర్పాట్లు ధూంధాంగా సాగుతున్నాయి. మెట్రో నగరాల్లో 48 గంటల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. కేకుల తయారీ కర్మాగారాలు.. రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. అయినా.. ఆర్డర్ల సంఖ్యతో పోలిస్తే..తయారీ మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు.. మద్యం వినియోగం పెరగనున్న నేపథ్యంలో డిస్టిలరీలలో కూడా సరుకు పూర్తిగా అయిపోయింది. మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరో గంట అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.30 వరకు బార్లకు, 12 గంటల వరకు వైన్స్కు అనుమతి ఇచ్చారు.
సరే.. అసలు విషయానికి వస్తే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్కు పబ్బులు కూడా రెడీ అయ్యాయి. తమ క్లయింట్లకు పబ్బులు ప్రత్యేక ఆకర్షణలను కూడా జోడిస్తున్నాయి. విదేశీ మద్యంపై 5 శాతం, స్వదేశీ తయారీ విదేశీ మద్యంపై 10 శాతం రాయితీలు ఇస్తున్నా యి. ఇదిలావుంటే.. మహారాష్ట్రలోని పుణేలో ఓ పబ్ నిర్వాహకులు చిత్రమైన ఘటనకు తెరదీశారు. తమ ఖాతా దారులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. సాయంత్రం 6 నుంచే సంబరాలు ప్రారంభమవుతాయని.. తిన్నంత తిని, తాగినంత తాగవచ్చని కూడా పేర్కొన్నారు.
అయితే.. ఆ ఆహ్వాన సంచుల్లో(ఇన్విటేషన్ బ్యాగ్స్) కండోమ్లు, ఓఆర్ ఎస్లు పంపించారు. ఇది.. తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఖాతా దారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పబ్పై కేసు నమోదు చేశారు. పబ్ ఉద్దేశం మేం తాగు బోతులం.. తిరుగుబోతులమనేగా! అని ఖాతా దారుడు నిప్పులు చెరిగాడు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…