Trends

ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి

దక్షిణ కొరియాలో జరిగిన దారుణ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7సి2216, ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పింది. బోయింగ్ 737-800 విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, ఈ ప్రమాదంలో 179 మంది మృతిచెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాద సమయంలో విమానం రన్‌వే చివరికి చేరినా, వేగాన్ని నియంత్రించలేక విమానాశ్రయం రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఢీకొట్టుదల కారణంగా విమానం ఉన్న ఇంధనం ఒక్కసారిగా మంటలకి ఆహుతి అయింది. మంటలు పెద్దఎత్తున వ్యాపించి విమానాన్ని కాల్చి బూడిద చేశాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, ల్యాండింగ్ సమయంలో గేర్ మరియు టైర్లు పనిచేయకపోవడంతో విమానం అదుపుతప్పింది. ఏదైనా పక్షి ఢీకొన్న కారణంగా ఈ లోపాలు కలిగివుంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ దారుణ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. అన్ని శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ప్రమాదానికి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముయాన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా గాల్లో ప్రయాణం చేసే వారికి భయాందోళన తలెత్తుతోంది. ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మళ్లీ జరుగకుండా ల్యాండింగ్ గేర్ ఇంధన వ్యవస్థలపై మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

This post was last modified on December 29, 2024 2:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

13 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago