దక్షిణ కొరియాలో జరిగిన దారుణ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7సి2216, ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పింది. బోయింగ్ 737-800 విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, ఈ ప్రమాదంలో 179 మంది మృతిచెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాద సమయంలో విమానం రన్వే చివరికి చేరినా, వేగాన్ని నియంత్రించలేక విమానాశ్రయం రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఢీకొట్టుదల కారణంగా విమానం ఉన్న ఇంధనం ఒక్కసారిగా మంటలకి ఆహుతి అయింది. మంటలు పెద్దఎత్తున వ్యాపించి విమానాన్ని కాల్చి బూడిద చేశాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, ల్యాండింగ్ సమయంలో గేర్ మరియు టైర్లు పనిచేయకపోవడంతో విమానం అదుపుతప్పింది. ఏదైనా పక్షి ఢీకొన్న కారణంగా ఈ లోపాలు కలిగివుంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దారుణ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. అన్ని శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ప్రమాదానికి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముయాన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా గాల్లో ప్రయాణం చేసే వారికి భయాందోళన తలెత్తుతోంది. ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మళ్లీ జరుగకుండా ల్యాండింగ్ గేర్ ఇంధన వ్యవస్థలపై మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
This post was last modified on December 29, 2024 2:33 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…