Trends

ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి

దక్షిణ కొరియాలో జరిగిన దారుణ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7సి2216, ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పింది. బోయింగ్ 737-800 విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, ఈ ప్రమాదంలో 179 మంది మృతిచెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాద సమయంలో విమానం రన్‌వే చివరికి చేరినా, వేగాన్ని నియంత్రించలేక విమానాశ్రయం రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఢీకొట్టుదల కారణంగా విమానం ఉన్న ఇంధనం ఒక్కసారిగా మంటలకి ఆహుతి అయింది. మంటలు పెద్దఎత్తున వ్యాపించి విమానాన్ని కాల్చి బూడిద చేశాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, ల్యాండింగ్ సమయంలో గేర్ మరియు టైర్లు పనిచేయకపోవడంతో విమానం అదుపుతప్పింది. ఏదైనా పక్షి ఢీకొన్న కారణంగా ఈ లోపాలు కలిగివుంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ దారుణ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. అన్ని శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ప్రమాదానికి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముయాన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా గాల్లో ప్రయాణం చేసే వారికి భయాందోళన తలెత్తుతోంది. ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మళ్లీ జరుగకుండా ల్యాండింగ్ గేర్ ఇంధన వ్యవస్థలపై మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

This post was last modified on December 29, 2024 2:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

35 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

56 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

2 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

3 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago