Trends

ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి

దక్షిణ కొరియాలో జరిగిన దారుణ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7సి2216, ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పింది. బోయింగ్ 737-800 విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, ఈ ప్రమాదంలో 179 మంది మృతిచెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాద సమయంలో విమానం రన్‌వే చివరికి చేరినా, వేగాన్ని నియంత్రించలేక విమానాశ్రయం రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఢీకొట్టుదల కారణంగా విమానం ఉన్న ఇంధనం ఒక్కసారిగా మంటలకి ఆహుతి అయింది. మంటలు పెద్దఎత్తున వ్యాపించి విమానాన్ని కాల్చి బూడిద చేశాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, ల్యాండింగ్ సమయంలో గేర్ మరియు టైర్లు పనిచేయకపోవడంతో విమానం అదుపుతప్పింది. ఏదైనా పక్షి ఢీకొన్న కారణంగా ఈ లోపాలు కలిగివుంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ దారుణ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. అన్ని శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ప్రమాదానికి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముయాన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా గాల్లో ప్రయాణం చేసే వారికి భయాందోళన తలెత్తుతోంది. ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మళ్లీ జరుగకుండా ల్యాండింగ్ గేర్ ఇంధన వ్యవస్థలపై మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

This post was last modified on December 29, 2024 2:33 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

1 hour ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago