కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని పబ్లు, పార్టీలు, ఇతర స్పెషల్ ఈవెంట్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాల వినియోగం లేకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు పచ్చజెండా ఊపినా, నిర్వాహకులు షరతులను పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పబ్లు, పార్టీ ప్రదేశాల్లో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించింది. మద్యం మితిమీరిన వినియోగం, డ్రగ్స్ వంటి పదార్థాల వాడకంపై ఎలాంటి దిగొచ్చుడూ ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరం వేడుకలను ప్రజలు సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. డ్రగ్స్ లేని వేడుకలు, భద్రతతో కూడిన ఈవెంట్లను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త సంవత్సరం సంబరాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవడంతో పాటు, ప్రభుత్వం తన ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోగలుగుతుంది. మరి ఆ ఒక్క రోజు ఆదాయం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
This post was last modified on December 28, 2024 1:25 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…