Trends

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు గుడ్ న్యూస్!

కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, పార్టీలు, ఇతర స్పెషల్ ఈవెంట్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాల వినియోగం లేకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పేర్కొంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు పచ్చజెండా ఊపినా, నిర్వాహకులు షరతులను పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పబ్‌లు, పార్టీ ప్రదేశాల్లో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించింది. మద్యం మితిమీరిన వినియోగం, డ్రగ్స్ వంటి పదార్థాల వాడకంపై ఎలాంటి దిగొచ్చుడూ ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

కొత్త సంవత్సరం వేడుకలను ప్రజలు సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. డ్రగ్స్ లేని వేడుకలు, భద్రతతో కూడిన ఈవెంట్లను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త సంవత్సరం సంబరాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవడంతో పాటు, ప్రభుత్వం తన ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోగలుగుతుంది. మరి ఆ ఒక్క రోజు ఆదాయం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

This post was last modified on December 28, 2024 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ – దేవి : ఆరు మెలోడీల లవ్ స్టోరీ

అల్లు అర్జున్‌కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…

34 minutes ago

ఆయ‌న ‘ఎన్నిక‌ల’ గాంధీ: కేటీఆర్ సెటైర్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కుల గ‌ణ‌న‌, ఎస్సీ రిజ‌ర్వేషన్ వ‌ర్గీక‌ర‌ణ‌పై బీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి…

1 hour ago

స్టార్ పిల్లలను పట్టించుకోవడం లేదబ్బా

మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…

1 hour ago

టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…

1 hour ago

తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…

2 hours ago

చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

3 hours ago