కొత్త సంవత్సరం వేడుకల సందడి మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా వైన్ షాపులు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని పబ్లు, పార్టీలు, ఇతర స్పెషల్ ఈవెంట్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాల వినియోగం లేకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ప్రత్యేక కార్యక్రమాలకు పచ్చజెండా ఊపినా, నిర్వాహకులు షరతులను పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పబ్లు, పార్టీ ప్రదేశాల్లో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటు చేయాలని సూచించింది. మద్యం మితిమీరిన వినియోగం, డ్రగ్స్ వంటి పదార్థాల వాడకంపై ఎలాంటి దిగొచ్చుడూ ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరం వేడుకలను ప్రజలు సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. డ్రగ్స్ లేని వేడుకలు, భద్రతతో కూడిన ఈవెంట్లను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. కొత్త సంవత్సరం సంబరాలను ప్రజలు సంతోషంగా జరుపుకోవడంతో పాటు, ప్రభుత్వం తన ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుకోగలుగుతుంది. మరి ఆ ఒక్క రోజు ఆదాయం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
This post was last modified on December 28, 2024 1:25 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…