భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లోనూ హిట్ మాన్ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 5 బంతులు మాత్రమే ఆడిన రోహిత్, కేవలం 3 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో బోలాండ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వైఫల్యంతో రోహిత్ శర్మ పేరు మీద అరుదైన చెత్త రికార్డు నమోదైంది.
టెస్ట్ క్రికెట్లో ప్రత్యర్థి కెప్టెన్ బౌలింగ్లో ఐదుసార్లు ఔట్ అయిన సారథుల జాబితాలో రోహిత్ శర్మ చేరాడు. అతనితో పాటు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 1970లలో సునీల్ గవాస్కర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్లో ఐదుసార్లు ఔట్ కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ను ఆస్ట్రేలియా కెప్టెన్ రిచీ బెనౌడ్ ఐదుసార్లు పెవిలియన్కు పంపాడు.
ఇప్పుడు రోహిత్ కూడా ఈ జాబితాలో చేరడం అభిమానులకు నిరాశ కలిగించింది. రోహిత్ శర్మ తప్పనిసరిగా ఆడాల్సిన మ్యాచ్ లో వెనుదిరగడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. ఈ సిరీస్లో అతడి నిరుత్సాహకర ప్రదర్శన మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ టెస్టు సిరీస్లో భారత జట్టు విజయవకాశాలపై రోహిత్ షాట్ సెలక్షన్ పై కూడా చర్చలు మిన్నంటుతున్నాయి. పూర్తి స్థాయిలో రోహిత్ ఆటకు దురమవుతడనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక 5 టెస్టుల సీరీస్ లో భారత్ 1-1 తో సమానంగా ఉంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా ఇది 4వ టెస్టు. ఇందులో నెగ్గితేనే సీరీస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్లే దారి కూడా సుగమమవుతుంది.
This post was last modified on December 27, 2024 12:10 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…