భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్లో ఫామ్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లోనూ హిట్ మాన్ మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 5 బంతులు మాత్రమే ఆడిన రోహిత్, కేవలం 3 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో బోలాండ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వైఫల్యంతో రోహిత్ శర్మ పేరు మీద అరుదైన చెత్త రికార్డు నమోదైంది.
టెస్ట్ క్రికెట్లో ప్రత్యర్థి కెప్టెన్ బౌలింగ్లో ఐదుసార్లు ఔట్ అయిన సారథుల జాబితాలో రోహిత్ శర్మ చేరాడు. అతనితో పాటు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 1970లలో సునీల్ గవాస్కర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్లో ఐదుసార్లు ఔట్ కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ టెడ్ డెక్స్టర్ను ఆస్ట్రేలియా కెప్టెన్ రిచీ బెనౌడ్ ఐదుసార్లు పెవిలియన్కు పంపాడు.
ఇప్పుడు రోహిత్ కూడా ఈ జాబితాలో చేరడం అభిమానులకు నిరాశ కలిగించింది. రోహిత్ శర్మ తప్పనిసరిగా ఆడాల్సిన మ్యాచ్ లో వెనుదిరగడం ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. ఈ సిరీస్లో అతడి నిరుత్సాహకర ప్రదర్శన మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ టెస్టు సిరీస్లో భారత జట్టు విజయవకాశాలపై రోహిత్ షాట్ సెలక్షన్ పై కూడా చర్చలు మిన్నంటుతున్నాయి. పూర్తి స్థాయిలో రోహిత్ ఆటకు దురమవుతడనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక 5 టెస్టుల సీరీస్ లో భారత్ 1-1 తో సమానంగా ఉంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా ఇది 4వ టెస్టు. ఇందులో నెగ్గితేనే సీరీస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్లే దారి కూడా సుగమమవుతుంది.
This post was last modified on December 27, 2024 12:10 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…