Trends

లోన్ యాప్‌ల వేధింపులకు చెక్: కేంద్రం కొత్త బిల్లు

తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్‌ లోన్‌ యాప్‌లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

2021లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు ఈ సమస్యకు సంబంధించిన నివేదికను సమర్పించగా, అందులో అనియంత్రిత రుణాల వ్యాపారాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని ప్రతిపాదించింది. కొత్త బిల్లు ప్రకారం, బంధువులకు ఇచ్చే రుణాలను మినహాయించి, అనుమతుల్లేని రుణదాతలు భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో రుణాలు ఇవ్వడం నిషేధంగా మారుతుంది. రుణాలను తిరిగి వసూలు చేసే సమయంలో హింసాత్మక పద్ధతులను ఉపయోగించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయి.

‘బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు పైన 2025 ఫిబ్రవరి 13 నాటికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. రుణగ్రహీతల రక్షణ కోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు చేర్చబడ్డాయి. రుణాలను చెల్లించలేని వ్యక్తులను వేధించే వారు లేదా నైతికత లేని పద్ధతులతో బకాయిలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తే, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల రుణ గ్రహీతలు రుణదాతల వేధింపులకు గురికాకుండా ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మరి దీన్ని ఎంత కఠినంగా అమలు చేస్తారో చూడాలి.

This post was last modified on December 22, 2024 2:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

3 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

3 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

5 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

6 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

7 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

8 hours ago