తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్ లోన్ యాప్లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
2021లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు ఈ సమస్యకు సంబంధించిన నివేదికను సమర్పించగా, అందులో అనియంత్రిత రుణాల వ్యాపారాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని ప్రతిపాదించింది. కొత్త బిల్లు ప్రకారం, బంధువులకు ఇచ్చే రుణాలను మినహాయించి, అనుమతుల్లేని రుణదాతలు భౌతికంగా లేదా ఆన్లైన్లో రుణాలు ఇవ్వడం నిషేధంగా మారుతుంది. రుణాలను తిరిగి వసూలు చేసే సమయంలో హింసాత్మక పద్ధతులను ఉపయోగించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయి.
‘బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు పైన 2025 ఫిబ్రవరి 13 నాటికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. రుణగ్రహీతల రక్షణ కోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు చేర్చబడ్డాయి. రుణాలను చెల్లించలేని వ్యక్తులను వేధించే వారు లేదా నైతికత లేని పద్ధతులతో బకాయిలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తే, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల రుణ గ్రహీతలు రుణదాతల వేధింపులకు గురికాకుండా ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మరి దీన్ని ఎంత కఠినంగా అమలు చేస్తారో చూడాలి.
This post was last modified on December 22, 2024 2:14 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…