తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్ లోన్ యాప్లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
2021లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు ఈ సమస్యకు సంబంధించిన నివేదికను సమర్పించగా, అందులో అనియంత్రిత రుణాల వ్యాపారాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని ప్రతిపాదించింది. కొత్త బిల్లు ప్రకారం, బంధువులకు ఇచ్చే రుణాలను మినహాయించి, అనుమతుల్లేని రుణదాతలు భౌతికంగా లేదా ఆన్లైన్లో రుణాలు ఇవ్వడం నిషేధంగా మారుతుంది. రుణాలను తిరిగి వసూలు చేసే సమయంలో హింసాత్మక పద్ధతులను ఉపయోగించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయి.
‘బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు పైన 2025 ఫిబ్రవరి 13 నాటికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. రుణగ్రహీతల రక్షణ కోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు చేర్చబడ్డాయి. రుణాలను చెల్లించలేని వ్యక్తులను వేధించే వారు లేదా నైతికత లేని పద్ధతులతో బకాయిలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తే, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల రుణ గ్రహీతలు రుణదాతల వేధింపులకు గురికాకుండా ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మరి దీన్ని ఎంత కఠినంగా అమలు చేస్తారో చూడాలి.
This post was last modified on December 22, 2024 2:14 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…