Trends

లోన్ యాప్‌ల వేధింపులకు చెక్: కేంద్రం కొత్త బిల్లు

తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్‌ లోన్‌ యాప్‌లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

2021లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు ఈ సమస్యకు సంబంధించిన నివేదికను సమర్పించగా, అందులో అనియంత్రిత రుణాల వ్యాపారాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని ప్రతిపాదించింది. కొత్త బిల్లు ప్రకారం, బంధువులకు ఇచ్చే రుణాలను మినహాయించి, అనుమతుల్లేని రుణదాతలు భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో రుణాలు ఇవ్వడం నిషేధంగా మారుతుంది. రుణాలను తిరిగి వసూలు చేసే సమయంలో హింసాత్మక పద్ధతులను ఉపయోగించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయి.

‘బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్’ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు పైన 2025 ఫిబ్రవరి 13 నాటికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. రుణగ్రహీతల రక్షణ కోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు చేర్చబడ్డాయి. రుణాలను చెల్లించలేని వ్యక్తులను వేధించే వారు లేదా నైతికత లేని పద్ధతులతో బకాయిలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తే, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా బిల్లులో ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల రుణ గ్రహీతలు రుణదాతల వేధింపులకు గురికాకుండా ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మరి దీన్ని ఎంత కఠినంగా అమలు చేస్తారో చూడాలి.

This post was last modified on December 22, 2024 2:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago