అనసూయ.. మళ్లీ అత్తగానే!

బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ.. సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణి అనే క్యారెక్టర్ లో కనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ లో అనసూయ చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2లో నటించబోతుంది. ఇదిలా ఉండగా.. రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషించింది. ఇందులో ఆమె చంద్రకళ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తుందట. 

అయితే ఈ పాత్రకు సంబంధించి మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. ఇందులో అనసూయ డ్యూయల్ రోల్ పోషిస్తుందని.. ఒక క్యారెక్టర్ చనిపోతుందని.. మిగిలిన క్యారెక్టర్ సినిమా మొత్తం కనిపిస్తుందని.. వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది. ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ పోషించడం లేదట. 

‘రంగమ్మత్త’ సినిమాలో మాదిరి ‘ఖిలాడి’లో అనసూయ అత్తగా కనిపించనుందట. అయితే ఇందులో ఆమె రోల్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి తల్లిగా.. రవితేజకి అత్తగా అనసూయ కనిపించనుందని తెలుస్తోంది. అత్తగానే కనిపిస్తుంది తప్ప సినిమాలో అనసూయకి మరో రోల్ లేదని సమాచారం.

ఈ నెలలలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 
రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కి మంచి రేటు పలికింది. రిలీజ్ కు ముందే నిర్మాత టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే డైరెక్టర్ కి గిఫ్ట్ గా ఓ కారు కూడా ఇచ్చారు.