Political News

కాంగ్రెస్ ఇప్ప‌టికి క‌ళ్లు తెరిచిందా?

అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పార్టీలో వేగంగా మారుతున్న ప‌రిణామాలు.. పెరుగుతున్న అస‌మ్మ‌తి గ‌ళం.. సీనియ‌ర్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌.. పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. పార్టీ భ‌విష్య‌త్‌పై కార్య‌క‌ర్తల్లో ఆందోళ‌న‌.. ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ది పార్టీని ఓ గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ ఎట్ట‌కేల‌కు సిద్ధ‌మైంది. ఆల‌స్యంగా క‌ళ్లు తెరిచిన ఆ పార్టీ అధిష్థానం అక్టోబ‌ర్ 16న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశం నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించింది. పార్టీ అధ్య‌క్ష …

Read More »

టీడీపీకి గంటా గుడ్ బై.. పక్కా ప్లానింగ్ తో ?

ఏపీలోని రాజకీయ నేతల్లో చాలామంది అయితే రాజకీయ పార్టీతో వారి పేరు ముడిపడి ఉంటుంది. వ్యక్తిగతంగా వారికున్న బలం ఏమిటన్నది అంత స్పష్టంగా కనిపించదు. కానీ.. గంటా శ్రీనివాసరావు మాత్రం అందుకు భిన్నంగా. ఆయనకు పార్టీ ఏదైనా.. ఆయన గెలుపు మాత్రం ఖాయమని చెబుతారు. ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే.. కాంగ్రెస్.. ప్రజారాజ్యం.. తెలుగుదేశం.. ఇలా ఏ పార్టీలో చేరినా.. ఆయన వరకు ఆయన ఎన్నికల్లో గెలుపు మాత్రం …

Read More »

లోకేష్‌కు డ్రగ్స్ దొరక్క ఎండిపోయాడు-కొడాలి నాని

మంత్రి కొడాలి నాని చాన్నాళ్ల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మీద తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు నాని. ఉత్తరాదిన వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడటం, అందులో ఏపీ అధికార పార్టీ వైకాపాకు చెందిన వ్యక్తులున్నట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ గట్టిగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో …

Read More »

మోడీపై పెరిగిపోతున్న ఒత్తిడి

తన మంత్రివర్గంలోని ఓ సహాయ మంత్రిని తప్పించే విషయంలో నరేంద్ర మోడిపై ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాలు తదనంతర పరిణామాల నేపథ్యంలో సహాయ మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలంటు డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా రెండు డిమాండ్లపైనే రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. మొదటిదేమో సహాయ మంత్రి కొడుకు, వివాదానికి మూల కారకుడైన ఆశిష్ …

Read More »

తొందరలోనే మరో సంక్షోభం తప్పదా ?

దేశ కాల పరిస్థితులను బట్టి చూస్తుంటే విద్యుత్ సంక్షోభం తప్పేట్లు లేదు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచుకునే అవకాశం లేకపోవడంతో వినియోగాన్ని తగ్గిచుకోవాలంటు ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. అలాగే పరిశ్రమలకు, వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్ లో కోతలు కూడా మొదలైపోయాయి. ఈ సంక్షోభం ఏ ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, …

Read More »

వైసీపీ కోసం.. 150 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు

వారంతా ఎంతో క‌ష్ట‌ప‌డి.. జేఈఈ చ‌దివారు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి రాత్ర‌న‌క‌.. ప‌గ‌ల‌న‌క‌.. కోచింగ్ తీసుకుని అడ్వాన్స్‌డ్ పాస‌య్యారు. ప్ర‌ఖ్యాత ఐఐటీల్లో చోటు సంపాయించుకున్నారు. అందునా.. ముంబాయి ఐఐటీ వంటి సంస్థ‌ల్లోనూ చ‌దువుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇలాంటివారిలో చాలా మంది రోడ్డున ప‌డుతున్నారు! అదేంటి అనుకుంటున్నారా? ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న‌ ప్ర‌భుత్వాన్ని తిరిగి గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. త‌ను అమలు చేస్తున్న సంక్షేమం.. ఇత‌ర ప‌థ‌కాలు.. వంటివి త‌న‌ను …

Read More »

బద్వేలు ఉప ఎన్నిక.. జనసేన ఇంకో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య ఈ మార్చిలో చనిపోవడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్నిక జరగబోతోంది. వెంకటసుబ్బయ్య స్థానంలో ఆయన భార్య డాక్టర్ సుధనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోయినపుడు వారి కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపితే.. …

Read More »

ఇక్కడ రేవంతే అభ్యర్ధా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో రెండు ప్రధానమైన పార్టీల తరపున గట్టి అభ్యర్ధులే పోటీచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ తరపున మాత్రం చాలా మందికి తెలీని అభ్యర్థి పోటీచేస్తున్నారు. దీంతో ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే క్యాండిడేట్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అధికార టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. గెల్లు గురించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్దగా తెలీకపోయినా నియోజకవర్గంలో …

Read More »

ఎమ్మెల్యే రోజా పొరపాటు చేసిందా ?

నిజమైన రాజకీయ నేతలెవరు తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకులాడరు. అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళదే అంతిమ విజయం అని తెలుసుకోవాలి. ఇదంతా ఎవరి విషయంలో అంటే నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా విషయంలోనే. కొద్దిరోజులుగా రోజాను ఇబ్బందిపెడుతున్న నిండ్ర మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఎలాగైతేనేమి తన మద్దతుదారుకే ఇప్పించుకున్నారు. కాస్త ఆలస్యమైనా తన మద్దతుదారు దీపకే ఎంపీపీ పదవి వచ్చేట్లు చేసుకున్న …

Read More »

ఇళ్ల పట్టాలు అందరికీ అందేనా ?

అందరికీ ఇళ్ల పట్టాలు అనే విషయంలో ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా ఆచరణలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఇంటి పట్టాలు అందరికీ అందించేందుకు రూపొందించిన మార్గదర్శకాలను హైకోర్టు కొట్టేసింది. ప్రధానంగా రెండు మూడు అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. దీంతో కోర్టు తప్పు పట్టిన అంశాలను సరిచేసి మళ్ళీ మార్గదర్శకాలను జారీచేయాల్సిన అనివార్యత ఏర్పడింది. కొత్తగా జారీ చేయబోయే మార్గదర్శకాలు ఎలాగుంటాయో ? వాటిని మళ్ళీ ఇంకెవరైనా కోర్టులో సవాలు చేస్తారా …

Read More »

సొంతింటికే నిప్పంటించుకుంటున్నారా ?

ఆప్ఘనిస్థాన్ లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడు వ్యవహారం చూసిన తర్వాత ఇవే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే ఉగ్రవాదులు రాజ్యమేలుతున్న దేశం ఆఫ్ఘన్ మాత్రమే. ఇలాంటి దేశంలోనే బాంబులు పేలడమంటే ఎలా అర్థం చేసుకోవాలి. మామూలుగా ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు బాంబులు పేలుస్తారు, విధ్వంసాలు సృష్టిస్తారు. కానీ ఇపుడు మాత్రం తమ దేశంలోని షియా వర్గానికి చెందిన ముస్లింలే టార్గెట్ గా బాంబులు పేల్చడం గమనార్హం. …

Read More »

మోడీకి రివర్స్ షాకిస్తున్న సొంత ఎంపి

ఉత్తరప్రదేశ్ ఘటన విషయంలో నరేంద్ర మోడీకి సొంత పార్టీ ఎంపీయే రివర్స్ షాకిస్తున్నారు. మొన్నటి ఆదివారం యూపీలో ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న రైతులపై కార్లు దూసుకెళ్ళిన ఘటన ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఘటనలో నలుగురు రైతులు మరణిస్తే తర్వాత జరిగిన గొడవల్లో మరో నలుగురు మరణించారు. ఘటన జరిగిన రోజు నుంచి బీజేపీ పిలిబిత్ ఎంపి పదే పదే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ …

Read More »