ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా వైసీపీ పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆనాటి పాలన లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా ఆ పార్టీ వారికే తెలియదని అన్నారు. ఇక, ప్రజలకు ఏం తెలుస్తుందని చెప్పారు. తాజాగా ఆయన ఉమ్మడికృష్ణాజిల్లాలోని కంకిపాడులో నిర్వహించిన `పల్లె పండు గ-పంచాయతీ వారోత్సవాలు` కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారి పనులకు పవన్ కల్యాణ్ ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. “రాష్ట్రం చేసుకున్న అదృష్టం.. రాష్ట్ర ప్రజల అదృష్టం.. అపార అనుభ వం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే“ అని తెలిపారు. అన్నీ ఆలోచించుకునే ఆ నాడు టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. తాము అనుకున్న ప్రకారం.. కలిసి ముందుకు నడిచామని.. దీంతో విజ యం దక్కిందన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే తాము వచ్చినట్టు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు గ్రామసభలు పెట్టుకున్నామని(అక్టోబరు 2) చెప్పారు.
ప్రభుత్వం ఎంతో బలంగా ఉందని, అయితే.. వ్యవస్థలో వ్యక్తులు కూడా బలంగా ఉండాలని పవన్ కల్యా ణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చేపట్టిన పనుల ద్వారా అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. “చంద్రబాబు చాలా బలవంతుడు. ఆయన బలాన్ని మనం ఉపయోగించుకోకపోతే ప్రయోజన లేదు. పైగా తప్పు చేసిన వాళ్లం అవుతాం. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరం“ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం లంచాల ప్రభుత్వం కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. తన పేరు చెప్పి.. లంచాలు డిమాండ్ చేసిన అధికారిని కూడా వదిలపెట్టలేదన్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన విధంగా ప్రభు త్వం పనిచేస్తోందని చెప్పారు. గతంలో ఒక్కటంటే ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదన్నారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. “గతం ప్రభుత్వంలో బూతులు తప్ప చేసిందేంలేదు“ అని పవన్ నిప్పులు చెరిగారు.
This post was last modified on October 15, 2024 1:38 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…