Political News

ఓజీ అంటే.. పవన్ కు మోడీ అనే వినిపిస్తోందట

మీరు ఓజీ.. ఓజీ అంటుంటే.. నాకు మోడీ-మోడీ అనే వినిపిస్తోంది అని ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా త‌న అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కృష్నాజిల్లా కంకిపాడులో నిర్వ‌హించిన ప‌ల్లె పండ‌గ‌ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. సినిమాల్లో త‌న‌కు ఏ ఇత‌ర న‌ట‌ల‌తోనూ పోటీ లేద‌ని చెప్పారు. హీరోలందరూ బాగుండాల‌నే కోరుకుంటాన‌ని తెలిపారు. అయితే.. సినిమాల‌క‌న్నా ముందు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ప్ర‌తి ఒక్క‌రూ దృష్టి పెట్టాల‌ని కోరారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావ‌లంబ‌న కోసం.. అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. దీనిలో భాగంగా సోమ‌వారం నుంచి వ‌చ్చే వారం రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప‌ల్లె పండుగ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. దీనిలో భాగంగా గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజులపా టు ఉపాధి క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటివి నిర్మించ నున్న‌ట్టు చెప్పారు. ఈ ప‌నుల‌కు స్థానిక కార్మికుల‌నే వినియోగిస్తామ‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ 30 వేలకు పైగానే అభివృద్ధి పనులు చేపట్టేందుకు పల్లె పండుగ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. చేతిలో డ‌బ్బులు లేక‌పోతే.. సినిమాలు కూడా చూసే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. అందుకే.. ప్ర‌జ‌ల ఆర్థిక స్థిర‌త్వానికి ప‌నిక‌ల్ప‌న దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలిపారు. నాకు మొన్న ఒక విష‌యం తెలిసింది. గుడివాడ ఎమ్మెల్యే రాము గారు వ‌చ్చి.. అక్క‌డి 43 గ్రామాల ప‌రిస్థితి వివ‌రించారు. నాకు చాలా బాధ‌నిపించింది. అని ప‌వ‌న్ అన్నారు.

ఆ 43 గ్రామాల్లోనూ తాగేందుకు కూడా నీరు లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు త‌న‌కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వివ‌రించార‌ని ప‌వ‌న్ చెప్పారు. గ‌త వైసీపీ హ‌యాంలో అక్క‌డ మంత్రిగా ప‌నిచేసిన‌ ఎమ్మెల్యే ఈ ప‌నులు ఎందుకు చేయ‌లేద‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించాన‌న్నారు. అయితే.. స‌ద‌రు ఎమ్మెల్యేకు బూతులు తిట్ట‌డం, శాప‌నార్థాలు పెట్ట‌డం త‌ప్ప మ‌రొక‌టి తెలియ‌ద‌ని వారు చెప్పార‌ని అన్నారు అందుకే ఇప్పుడు మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నామ‌ని అన్నారు.

This post was last modified on October 15, 2024 12:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అకీరాకు ఏం మిగలవంటున్న పవన్ ఫ్యాన్స్

స్టార్ లెగసి సృష్టించి పెట్టిన తండ్రి వారసత్వాన్ని మోస్తున్న హీరోలకు దాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. బాలకృష్ణ, నాగార్జున…

29 mins ago

విచారణకు సజ్జల..పోలీసులకు వేలు చూపించి పొన్నవోలు

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు దేవినేని…

42 mins ago

కేంద్రంలో చంద్రబాబే కింగ్ మేకర్…ఆ ఫొటో వైరల్

2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సారి…

46 mins ago

కృష్ణార్పణం కానున్న మరో శుక్రవారం

కొన్ని శుక్రవారాలు సినీ ప్రియులకు చప్పగా అనిపిస్తాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ కు కళ్ళముందు…

1 hour ago

నూతన సీజేఐగా సంజీవ్ ఖన్నా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో, భారత…

2 hours ago

ఒక షెడ్యూల్‌ అయ్యాక రకుల్‌ను తీసేసి..

టాలీవుడ్లో ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ముంబయి భామ రకుల్ ప్రీత్. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కథానాయికగా…

2 hours ago