Political News

ప‌వ‌న్ పేరుతో దందా.. నాయ‌కుడు కాదు, జిల్లా అధికారే!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు పార్టీ పేరు చెప్పి దందాలు చేయ‌డం స‌హ‌జం. లేదా.. అగ్ర‌నాయ‌కుల పేర్లు చెప్పి ఇత‌ర నేత‌లు దందాలు చేయ‌డం కామ‌నే. ఇది రాజ‌కీయాల్లో ఎప్పుడూ క‌నిపించేదే. ఇక‌, అధికారంలో ఉన్న పార్టీల‌కు ఈ త‌ర‌హా ప‌రిస్థితులు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితే జ‌న‌సేన‌కు కూడా ఎదురైంది. ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తమ‌కు సంబంధాలు ఉన్నాయని, ఆయ‌న‌తో త‌మ‌కు మంచి రెపో ఉంద‌ని పేర్కొంటూ ప‌లువురు నాయ‌కులు దందాలు చేశారంటే స‌రే.. కామ‌నేక‌దా! అని స‌రిపుచ్చుకునేందుకు అవ‌కాశం ఉంది.

కానీ, చిత్రం ఏంటంటే.. పార్టీల‌తో సంబంధం లేని జిల్లా అధికారి ఒక‌రు ప‌వ‌న్ పేరు చెప్పి దందాల‌కు పాల్ప‌డుతుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా ఏపీ అట‌వీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కాకినాడ జిల్లాకు(ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలిచిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం ఈ జిల్లాలోదే) చెందిన జిల్లా అట‌వీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి ఏకంగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు చెప్పి దందాల‌కు దిగిన‌ట్టు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వ్యాపారులను, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను కూడా ఆయ‌న బెదిరించి లంచాలు వ‌సూలు చేస్తున్నార‌ని స‌మాచారం.

దీనిపై కాకినాడ జిల్లా జ‌న‌సేన నాయకులు, నేరుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది జ‌రిగిన నాలుగు రోజులు అయింది. అయితే.. ఈ విష‌యంపై ర‌హ‌స్యంగా విచార‌ణ చేయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌తాధికారుల‌ను ఈ విష‌యంపై నివేదిక కోరారు. నివేదిక అందిన త‌ర్వాత‌.. స‌ద‌రు అధికారిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు తాజాగా హామీ ఇచ్చారు. తన పేరును, తన కార్యాలయం పేరును దుర్వినియోగం చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి వ్యవహారంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు పార్టీ నాయ‌కులు చెప్పారు.

వాస్త‌వానికి ఈ ఏడాది ఎన్నిక‌ల ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అని రాసుకుని ప‌లువురు యువ‌కులు ట్రాఫిక్ రూల్స్ పాటించ‌కుండా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో దీనిపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అస‌లు అలా రాసి ఉన్న బండ్ల‌ను 24 గంట‌ల్లోనే గుర్తించి భారీ ఫైన్లు వేయాల‌ని ఆదేశించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక జిల్లా అధికారి ఇలా త‌న పేరును వాడుకుని.. త‌న‌కు చెడ్డ‌పేరు తెచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తుండడంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. స‌ద‌రు అధికారిని క‌ఠినంగా శిక్షించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on October 12, 2024 3:25 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

34 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago