Political News

ప‌వ‌న్ పేరుతో దందా.. నాయ‌కుడు కాదు, జిల్లా అధికారే!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు పార్టీ పేరు చెప్పి దందాలు చేయ‌డం స‌హ‌జం. లేదా.. అగ్ర‌నాయ‌కుల పేర్లు చెప్పి ఇత‌ర నేత‌లు దందాలు చేయ‌డం కామ‌నే. ఇది రాజ‌కీయాల్లో ఎప్పుడూ క‌నిపించేదే. ఇక‌, అధికారంలో ఉన్న పార్టీల‌కు ఈ త‌ర‌హా ప‌రిస్థితులు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితే జ‌న‌సేన‌కు కూడా ఎదురైంది. ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తమ‌కు సంబంధాలు ఉన్నాయని, ఆయ‌న‌తో త‌మ‌కు మంచి రెపో ఉంద‌ని పేర్కొంటూ ప‌లువురు నాయ‌కులు దందాలు చేశారంటే స‌రే.. కామ‌నేక‌దా! అని స‌రిపుచ్చుకునేందుకు అవ‌కాశం ఉంది.

కానీ, చిత్రం ఏంటంటే.. పార్టీల‌తో సంబంధం లేని జిల్లా అధికారి ఒక‌రు ప‌వ‌న్ పేరు చెప్పి దందాల‌కు పాల్ప‌డుతుండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా ఏపీ అట‌వీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కాకినాడ జిల్లాకు(ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలిచిన పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం ఈ జిల్లాలోదే) చెందిన జిల్లా అట‌వీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి ఏకంగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు చెప్పి దందాల‌కు దిగిన‌ట్టు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వ్యాపారులను, ఇత‌ర ప్ర‌ముఖుల‌ను కూడా ఆయ‌న బెదిరించి లంచాలు వ‌సూలు చేస్తున్నార‌ని స‌మాచారం.

దీనిపై కాకినాడ జిల్లా జ‌న‌సేన నాయకులు, నేరుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది జ‌రిగిన నాలుగు రోజులు అయింది. అయితే.. ఈ విష‌యంపై ర‌హ‌స్యంగా విచార‌ణ చేయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న‌తాధికారుల‌ను ఈ విష‌యంపై నివేదిక కోరారు. నివేదిక అందిన త‌ర్వాత‌.. స‌ద‌రు అధికారిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు తాజాగా హామీ ఇచ్చారు. తన పేరును, తన కార్యాలయం పేరును దుర్వినియోగం చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి వ్యవహారంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు పార్టీ నాయ‌కులు చెప్పారు.

వాస్త‌వానికి ఈ ఏడాది ఎన్నిక‌ల ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అని రాసుకుని ప‌లువురు యువ‌కులు ట్రాఫిక్ రూల్స్ పాటించ‌కుండా వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో దీనిపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అస‌లు అలా రాసి ఉన్న బండ్ల‌ను 24 గంట‌ల్లోనే గుర్తించి భారీ ఫైన్లు వేయాల‌ని ఆదేశించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక జిల్లా అధికారి ఇలా త‌న పేరును వాడుకుని.. త‌న‌కు చెడ్డ‌పేరు తెచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తుండడంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. స‌ద‌రు అధికారిని క‌ఠినంగా శిక్షించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on October 12, 2024 3:25 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

26 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago