Political News

‘సాక్షి’ యాడ్స్ పై విచారణ జరుపుతాం: పార్థ సారథి

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ ఉండేది కాదని, అప్పుల మీద అప్పులు చేసి పథకాలకు పప్పూ బెల్లాల్లాగా డబ్బులు పంచిపెట్టారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ చేస్తున్న అప్పులపై కాగ్ మొదలు కేంద్రం వరకు అందరూ హెచ్చరించినా పెడ చెవిన పెట్టి రాష్ట్రంపై పది లక్షల కోట్ల అప్పు జగన్ పెట్టారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి పార్ధసారధి కీలక వ్యాఖ్యలు చేశారు.

మేనిఫెస్టో పేరుతో గత ప్రభుత్వం దోపిడీ చేసిందని, ఐదేళ్ల జగన్ పాలనలో రూ. 10.50 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. అవినీతిని జగన్ వ్యవస్థీకృతం చేశారని మండిపడ్డారు. ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేస్తున్నారని పార్ధసారధి కితాబిచ్చారు. వైసీపీ ప్రభుత్వం కనిపించిన పాసు పుస్తకంపై.. రేషన్ కార్డుపై పార్టీ రంగులు, బొమ్మలు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఎద్దేవా చేశారు.

తమ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయబోదని అన్నారు. లబ్ధిదారులకు ఇచ్చే గృహ నిర్మాణ వ్యయాన్ని రెండున్నర లక్షల నుంచి రూ.1.80 లక్షలకు తగ్గించింది జగన్ అని అన్నారు. ఇఖ, గత ప్రభుత్వం సాక్షి పత్రికకు నిధులు, ప్రభుత్వ ప్రకటనలను సాక్షికి మాత్రమే ఇచ్చిన వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.

రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఏపీలో సుస్థిర పాలన, చంద్రబాబు ఇమేజ్ చూసి పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కడుతున్నారని చెప్పారు. ఒక్క రోజులోనే ప్రభుత్వ ఉద్యోగుల చేత 60 లక్షలకు పైగా పింఛన్లను పంపిణీ చేయించిన ఘనత చంద్రబాబుదని ఆయన కొనియాడారు.

This post was last modified on October 11, 2024 5:55 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రాహుల్ చేతికి ర‌క్త‌పు మ‌ర‌క‌లు: కేటీఆర్

బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ…

1 hour ago

‘జాక్’కు అడ్డం పడుతున్న ఆ డిజాస్టర్

ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం…

1 hour ago

ఏపీలో సర్కారీ వైద్యానికి కూటమి మార్కు బూస్ట్

ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…

3 hours ago

వైసీపీ ఆ ఇద్దరి రాజకీయాన్ని చిదిమేసిందా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…

4 hours ago

‘టెస్ట్’ మ్యాచులో ఓడిపోయిన ప్రేక్షకుడు

ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…

5 hours ago

బోలెడు శుభవార్తలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…

5 hours ago