Political News

సాక్షి పత్రికపై టీటీడీ కేసు

కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ నేతృత్వంలో సిట్ ను నియమించింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం ఉందని కేంద్రం కూడా అభిప్రాయపడింది.

అయితే, తాజాగా ఈ వ్యవహారంపై సాక్షి పత్రికలో ఏపీ సీఎం చంద్రబాబుకు డ్యామేజ్ కలిగించే లాగా వార్తలు రాయడం సంచలనం రేపింది.

ఈ క్రమంలోనే తాజాగా సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు అయింది.

టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమల పర్యటనలో టీటీడీ అధికారులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష గురించి ఆ పత్రికలో అసత్య కథనం ప్రచురితమైందని తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ఈనెల 6వ తేదీన సాక్షి పత్రిక 13వ పేజీలో ఒక కథనం ప్రచురితమైందని, అందులో అన్ని అసత్యాలే ఉన్నాయని పోలీసులకు డిప్యూటీ ఈవో ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డు కోసం వాడిన నెయ్యి విషయంలో మన స్టాండ్ మీకు తెలుసు కదా, సిట్ బృందం విచారణకు వస్తే అందరూ ఒకే మాట చెప్పాలని, ఆ రకంగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని సమీక్షకు హాజరైన అధికారులకు చంద్రబాబు సూచించినట్లు ఆ కథనంలో ప్రచురించారు. ఉద్దేశపూర్వకంగానే అసత్యాలను ప్రచురించిన సాక్షి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

This post was last modified on October 9, 2024 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

6 minutes ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

1 hour ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

3 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

4 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

4 hours ago

విజయ్ నిర్మాతలకు ఊహించని పండగ

అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…

4 hours ago