Political News

సాక్షి పత్రికపై టీటీడీ కేసు

కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ నేతృత్వంలో సిట్ ను నియమించింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం ఉందని కేంద్రం కూడా అభిప్రాయపడింది.

అయితే, తాజాగా ఈ వ్యవహారంపై సాక్షి పత్రికలో ఏపీ సీఎం చంద్రబాబుకు డ్యామేజ్ కలిగించే లాగా వార్తలు రాయడం సంచలనం రేపింది.

ఈ క్రమంలోనే తాజాగా సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు అయింది.

టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమల పర్యటనలో టీటీడీ అధికారులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష గురించి ఆ పత్రికలో అసత్య కథనం ప్రచురితమైందని తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ఈనెల 6వ తేదీన సాక్షి పత్రిక 13వ పేజీలో ఒక కథనం ప్రచురితమైందని, అందులో అన్ని అసత్యాలే ఉన్నాయని పోలీసులకు డిప్యూటీ ఈవో ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డు కోసం వాడిన నెయ్యి విషయంలో మన స్టాండ్ మీకు తెలుసు కదా, సిట్ బృందం విచారణకు వస్తే అందరూ ఒకే మాట చెప్పాలని, ఆ రకంగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని సమీక్షకు హాజరైన అధికారులకు చంద్రబాబు సూచించినట్లు ఆ కథనంలో ప్రచురించారు. ఉద్దేశపూర్వకంగానే అసత్యాలను ప్రచురించిన సాక్షి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

This post was last modified on October 9, 2024 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ హృతిక్ కాకుండా మరో ఇద్దరు ?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం తారక్ లేకుండా…

5 hours ago

మసాలా ఎక్కువైతే ట్రోల్స్ రాకుండా ఉంటాయా

ఏదైనా మితంగా ఉండి రుచిగా అనిపిస్తేనే కడుపు నిండుతుంది. అది ఫుడ్ అయినా సినిమా అయినా రెండింటికి అదే సూత్రం…

5 hours ago

శకునాలన్నీ కలిసి వస్తున్న పుష్ప 2

ఇంకో రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ కి శకునాలన్నీ కలిసి…

5 hours ago

స్పిరిట్ కోసం సందీప్ వంగా క్రేజీ ప్లాన్

ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ స్పిరిట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కబీర్ సింగ్ రూపంలో అదిరిపోయే డెబ్యూ అందుకుని…

12 hours ago

వేట్టయాన్.. రజినీనే అడిగి మరీ

జై భీమ్ సినిమా చూసిన వాళ్లకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వ శైలి మీద ఒక అంచనా వచ్చి ఉంటుంది. సామాజిక…

13 hours ago

తంగలాన్ కొండల్లో OTT పంచాయితీ

చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ థియేటర్లలో విడుదలై నెలలు గడిచిపోతున్నా ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్…

15 hours ago