Political News

సాక్షి పత్రికపై టీటీడీ కేసు

కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ నేతృత్వంలో సిట్ ను నియమించింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం ఉందని కేంద్రం కూడా అభిప్రాయపడింది.

అయితే, తాజాగా ఈ వ్యవహారంపై సాక్షి పత్రికలో ఏపీ సీఎం చంద్రబాబుకు డ్యామేజ్ కలిగించే లాగా వార్తలు రాయడం సంచలనం రేపింది.

ఈ క్రమంలోనే తాజాగా సాక్షి యాజమాన్యంపై తిరుమలలో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు అయింది.

టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమల పర్యటనలో టీటీడీ అధికారులతో చంద్రబాబు నిర్వహించిన సమీక్ష గురించి ఆ పత్రికలో అసత్య కథనం ప్రచురితమైందని తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘నేను చూసుకుంటా’ అనే శీర్షికతో ఈనెల 6వ తేదీన సాక్షి పత్రిక 13వ పేజీలో ఒక కథనం ప్రచురితమైందని, అందులో అన్ని అసత్యాలే ఉన్నాయని పోలీసులకు డిప్యూటీ ఈవో ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డు కోసం వాడిన నెయ్యి విషయంలో మన స్టాండ్ మీకు తెలుసు కదా, సిట్ బృందం విచారణకు వస్తే అందరూ ఒకే మాట చెప్పాలని, ఆ రకంగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని సమీక్షకు హాజరైన అధికారులకు చంద్రబాబు సూచించినట్లు ఆ కథనంలో ప్రచురించారు. ఉద్దేశపూర్వకంగానే అసత్యాలను ప్రచురించిన సాక్షి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈవో లోకనాథం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

This post was last modified on October 9, 2024 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

20 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

37 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago