టీడీపీకి రాజకీయంగా ఆది నుంచి అండగా ఉన్న బీసీలకు మరింత మేలు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఎన్నికలకుముందు ఇచ్చిన హామీల మేరకు బీసీల జీవితాల్లో వెలుగులు నింపేలా ఆయన నిర్ణయించారు. ప్రతి బీసీ కుటుంబానికీ మేలు చేయాలన్నది చంద్రబాబు సంకల్పంగా ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఓబీసీల గణన జరుగుతున్నట్టుగానే.. ఇక్కడ బీసీలకు సంబంధించి లెక్కలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంత మంది ఉన్నారు? వారి ఆర్థిక పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు, ఉపాధి వంటివాటిని తెలుసుకునేందుకు సర్కారు రెడీ అయింది. ఢిల్లీకి లేదా చెన్నైకి చెందిన ప్రతిష్టాత్మక సంస్థలతో(ఇంకా ఫైనల్ కాలేదు) సర్వే చేయించాలని సర్కారు నిర్ణయించుకుంది. ఇది నవంబరు తొలి వారం నాటికి పూర్తి అవుతుందని సమాచారం. క్షేత్రస్థాయిలో బీసీల పరిస్థితిని ఈ సంస్థ నిశితంగా అంచనా వేయనుంది.
తద్వారా.. బీసీలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? వారికి ఎలాంటి మెరుగైన సౌకర్యాలు కల్పిం చాలనే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం పొందుతున్న ఉపాధిని మరింత నాణ్య మైన శిక్షణ ఇచ్చి.. అప్ గ్రేడ్ చేయాలన్నది ఒక నిర్ణయంగా ఉంది. ఇదేసమయంలో ఉపాధి కల్పనతో పాటు యువతకు ఉద్యోగాల కల్పన దిశగా కూడా చంద్రబాబు నిర్ణయించారు. గతంలో బీసీల కోసం.. పనిముట్లు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
వారి వారి వృత్తులను బట్టి.. పనిముట్లను ఉచితంగా అందించారు. అయితే.. ఇప్పుడు టెక్నాలజీ మరింత వేగంగా విస్తరించిన నేపథ్యంలో వృత్తి పనులు చేసుకునేవారికి నైపుణ్య శిక్ష ఇచ్చి.. సాంకేతికతను చేరువ చేయాలని నిర్ణయించారు. ఫలితంగా బీసీల ఆదాయం రెట్టింపు కావడంతోపాటు.. వారి జీవన స్థితిగతులు కూడా మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ పరిణామాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చేస్తుండడం ఆహ్వానించదగిన పరిణామం.
This post was last modified on October 8, 2024 6:37 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…