ఈ మధ్య వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు, దివ్వెల మాధురి అనే వివాహితకు మధ్య సంబంధం గురించి ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. శ్రీనివాస్ తమ కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడని.. మాధురి ఇంట్లోనే ఉంటున్నాడని శ్రీనివాస్ భార్య వాణి, కూతుళ్లు చేసిన ఆరోపణల మీద రచ్చ రచ్చ జరిగింది.
శ్రీనివాస్ భార్యాబిడ్డలను బూతులు తిట్టడంతో పాటు వారి మీద దాడికి కూడా ప్రయత్నించాడు. కొన్ని వారాల పాటు దీని మీద మీడియాలో రచ్చ రచ్చ అయింది. శ్రీనివాస్, మాధురి తమ బంధం గురించి దాదాపుగా ఓపెన్ అయిపోయారు. మరోవైపు మాధురి భర్తేమో తన భార్యను అనుమానించాల్సిన అవసరం లేదని.. ఆమె మీద రాజకీయంగా కుట్ర జరుగుతోందని అన్నారు.
కట్ చేస్తే ఇప్పుడు శ్రీనివాస్, మాధురి తమ బంధాన్ని దాచి పెట్టే ప్రయత్నం ఏమీ చేయట్లేదు. ఎవరేం అనుకుంటే ఏం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ కలిసి తిరుమల వెళ్లారు. తాజాగా ఈ జంట బ్రాండ్ ప్రమోషన్లకు కూడా రెడీ అయిపోవడం విశేషం.
టెక్కలిలో ఓ ఎలక్ట్రిక్ బైక్కు వీళ్లిద్దరూ ప్రచారం చేసిపెట్టిన వీడియో వైరల్ అవుతోంది. శ్రీనివాస్ ఆ కొత్త బైక్ మీద మాధురిని ఎక్కించుకుని తిప్పుతూ కనిపించగా.. మాధురి ఈ బైక్ గురించి, షోరూమ్ ఆఫర్ల గురించి ఇంట్రో ఇచ్చింది. తనకీ బైక్ ఎంతో నచ్చిందని.. దీని మీద మంచి ఆఫర్ ఇస్తున్నారని దీని గురించి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. మరోవైపు శ్రీనివాస్కు ఇష్టమైన వంటకం అంటూ మునక్కాయ సాంబార్ గురించి ఓ న్యూస్ ఛానెల్లో వీడియో కూడా చేసింది మాధురి.
This post was last modified on October 7, 2024 9:41 pm
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…