Political News

ఉద‌య‌నిధిని ఇర‌కాటంలోకి నెట్టేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడు వ్య‌వ‌హారంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తూనే ఉన్నారు. త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధిని ఉద్దేశించి తిరుప‌తిలో నిర్వ‌హించిన వారాహి బ‌హిరంగ స‌భ‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాత‌.. అటు వైపు నుంచి పెద్ద‌గా స్పంద‌న రాలేదు. ‘వేచి చూస్తున్నాం’ అని మాత్ర‌మే ఉద‌య‌నిధి పేర్కొన్నారు. కానీ, ప‌వ‌న్ వైపు నుంచి నిరంత‌రం ట్వీట్ రూపంలో త‌మిళ‌నాడు గురించి కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. తిరుప‌తి స‌భ త‌ర్వాత‌.. వ‌రుసగా మూడో రోజు కూడా ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌మిళ‌నాడును స‌నాత‌న ధ‌ర్మానికి ప్ర‌తీక‌గా, వేదిక‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. తాజాగా చేసిన ట్వీట్‌లో త‌మిళ‌నాడు సిద్ధ‌సాధువ‌ల‌కు పురుటి గ‌డ్డ‌గా పేర్కొన్నారు. పునీత భూమి అని వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడు గ‌డ్డ‌పై అనేక మంది సాధువులు, స‌త్సంగులు జ‌న్మించార‌ని..అనేక మంది ఈ గ‌డ్డ‌పైనే జీవించార‌ని ప‌వ‌న్ పేర్కొన‌డం ద్వారా.. ఉద‌య నిధికి బ‌ల‌మైన వ్యాఖ్య‌లు చేర‌వేస్తున్న‌ట్టు అయింది. త‌మిళ‌నాడు స‌నాత‌నధ‌ర్మానికి వేదిక‌గా ఉంద‌న్న బ‌ల‌మైన వాద‌న‌ను కూడా ఆయ‌న పంపిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో త‌న కుటుంబానికి చెందిన విష‌యాల‌ను కూడా ప‌వ‌న్ పేర్కొన్నారు.

“మా నాన్న(వెంక‌ట్రావు) రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌, శార‌దామా, వివేకానంద‌న‌ల‌ను ఆరాధించేవారు. అప్పట్లోనే మా నాన్న‌ రాంచీ వెళ్లి ‘క్రియా యోగ’ దీక్ష చేపట్టారు. త‌ర్వాత మాకు కూడా క్రియా యోగను పరిచయం చేశారు. 1980ల‌ చివర్లో, 1990వ దశకం ఆరంభంలో మా నాన్న చెన్నైలోని శాంథోమ్ వెళ్లి మహావతార్ బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన తరచుగా తిరువణ్ణామలై వెళ్లి యోగి రామ్ సూరత్ కుమార్ సేవలో పాల్గొనేవారు” అని ప‌వ‌న్ వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌మిళ‌నాడును పుణ్య‌భూమిగా, పునీత భూమిగా పేర్కొన్నారు.

తాజాగా ప‌వ‌న్ చేసిన కామెంట్లు త‌మిళ‌నాడులో అధికార పార్టీ డీఎంకేకు ఇబ్బందిక‌ర ప‌రిణామాల‌ను తెచ్చిన‌ట్టే అయింది. ఎందుకంటే.. నాస్తిక‌త్వాన్ని అనుస‌రించే డీఎంకే సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలు(సీఎం భార్య దుర్గ మాత్రం ఆస్తికురాలు) ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించేందుకు సాహ‌సం చేస్తాయా? అనేది చూడాలి. అంతేకాదు.. త‌మిళ‌నాడును స‌నాత‌న ధ‌ర్మానికి ప్ర‌తీక‌గా పేర్కొన్న ప‌వ‌న్‌పై ఎదురు దాడి చేయ‌లేని ప‌రిస్థితి కూడా ఏర్ప‌డింది. ఒక‌వేళ ఎదురు దాడి చేస్తే.. త‌మిళ‌నాడును పుణ్య‌భూమి కాద‌ని చెప్పిన‌ట్టే అవుతుంది. సో.. ఎలా చూసుకున్నా ప‌వ‌న్‌.. డీఎంకేను ఇర‌కాటంలోకి నెట్టేశార‌నే చెప్పాలి.

This post was last modified on October 6, 2024 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

1 minute ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

3 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

5 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

5 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

5 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

6 hours ago