Political News

తిరుమ‌ల – చంద్ర‌బాబు.. ఈ రికార్డు తెలుసా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ – ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగు తున్న నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి కీల‌క విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. తిరుమ‌ల‌-చంద్ర‌బాబుల‌కు సంబంధించిన స‌రికొత్త రికార్డు ఆవిష్కృత‌మైంది. తాజాగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతు న్నాయి. ఏటా ఆశ్వీయుజ మాసం పాడ్య‌మి నుంచి 9 రోజుల పాటు నిర్వ‌హించే ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఈ ఏడాది కూడా ఈ ఉత్సాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు దంప‌తులు స‌ర్కారు త‌ర‌ఫున స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిం చారు. అయితే ఎప్పుడూ జ‌రిగేదే క‌దా! అనే అనుమానం వ‌స్తుంది. కానీ, ఇక్క‌డే చిత్ర‌మైన విష‌యం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్వామివారికి అత్య‌ధిక సంఖ్య‌లో ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు రికార్డు సృష్టించారు. 14 ఏళ్లు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు.. ఇప్పుడు 15 వ సంవ‌త్స‌రంలో ఉన్నారు. సో.. ఆయ‌న 15 సార్లు స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన‌ట్టు అయింది.

ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి కూడా 15 సార్లు శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌లేదు. దీంతో ఈ రికార్డు చంద్ర‌బాబుకే సొంత‌మైంది. ఏటా సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఇచ్చే ప‌ట్టు వ‌స్త్రాల‌ను తాజాగా చంద్ర‌బాబు దంప‌తులు స్వామికి స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎంల‌లో ఎక్కువ సంఖ్య‌లో రికార్డును సృష్టించారంటూ.. టీటీడీ అధికారులే స్వ‌యంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో చంద్ర‌బాబు దంప‌తులు మురిసిపోయారు.

ఇది నా అదృష్టం!

శుక్ర‌వారం రాత్రి పొద్దు పోయాక జ‌రిగిన వాహ‌న సేవ‌ల్లో పాల్గొన్న చంద్ర‌బాబు దంప‌తులు శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యధిక సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు లభించిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. అనంత‌రం.. శ్రీవారి మూల మూర్తిని ద‌ర్శించుకున్నారు. కొద్దిసేపు వాహ‌న సేవ‌ల్లోనూ పాల్గొన్నారు.

This post was last modified on October 5, 2024 4:28 pm

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

1 minute ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago