Political News

తిరుమ‌ల – చంద్ర‌బాబు.. ఈ రికార్డు తెలుసా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ – ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగు తున్న నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రోసారి కీల‌క విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. తిరుమ‌ల‌-చంద్ర‌బాబుల‌కు సంబంధించిన స‌రికొత్త రికార్డు ఆవిష్కృత‌మైంది. తాజాగా శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతు న్నాయి. ఏటా ఆశ్వీయుజ మాసం పాడ్య‌మి నుంచి 9 రోజుల పాటు నిర్వ‌హించే ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ఈ ఏడాది కూడా ఈ ఉత్సాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు దంప‌తులు స‌ర్కారు త‌ర‌ఫున స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిం చారు. అయితే ఎప్పుడూ జ‌రిగేదే క‌దా! అనే అనుమానం వ‌స్తుంది. కానీ, ఇక్క‌డే చిత్ర‌మైన విష‌యం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు స్వామివారికి అత్య‌ధిక సంఖ్య‌లో ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు రికార్డు సృష్టించారు. 14 ఏళ్లు గ‌తంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు.. ఇప్పుడు 15 వ సంవ‌త్స‌రంలో ఉన్నారు. సో.. ఆయ‌న 15 సార్లు స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన‌ట్టు అయింది.

ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి కూడా 15 సార్లు శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌లేదు. దీంతో ఈ రికార్డు చంద్ర‌బాబుకే సొంత‌మైంది. ఏటా సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఇచ్చే ప‌ట్టు వ‌స్త్రాల‌ను తాజాగా చంద్ర‌బాబు దంప‌తులు స్వామికి స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎంల‌లో ఎక్కువ సంఖ్య‌లో రికార్డును సృష్టించారంటూ.. టీటీడీ అధికారులే స్వ‌యంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో చంద్ర‌బాబు దంప‌తులు మురిసిపోయారు.

ఇది నా అదృష్టం!

శుక్ర‌వారం రాత్రి పొద్దు పోయాక జ‌రిగిన వాహ‌న సేవ‌ల్లో పాల్గొన్న చంద్ర‌బాబు దంప‌తులు శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యధిక సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు లభించిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. అనంత‌రం.. శ్రీవారి మూల మూర్తిని ద‌ర్శించుకున్నారు. కొద్దిసేపు వాహ‌న సేవ‌ల్లోనూ పాల్గొన్నారు.

This post was last modified on October 5, 2024 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

18 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

35 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago