వైసీపీ అధినేత జగన్.. తాజాగా ట్వీట్ చేశారు. దీనిలో 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్టు చేశా రు. దీనికి ముందు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా.. చంద్రబాబు తిరుమల రాజకీయా లు మానుకోవడం లేదని, మారడం లేదని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ పోస్టును దేశవ్యాప్తంగా అన్ని మీడి యా చానెళ్లకు, అదేవిధంగా ఎన్డీయేతర పార్టీలకు కూడా పంపించారు. దీనిలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.
ఇక, ఉత్తరాది పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆప్ సహా అనేక పార్టీలను జగన్ ట్యాగ్ చేశారు. `మీరంతా చూడండి. పట్టించుకోండి“ అన్నట్టుగా ఆయన ప్రాథేయ పడ్డారు. ఇక, వీడియోలో యథాలాపంగా.. సుప్రీంకోర్టు గత నెల 30న చేసిన కామెంట్లను, అప్పట్లో జాతీయ మీడియా ప్రచురించిన వార్తలను చదివి వినిపించారు.
అదేవిధంగా తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించిన విషయాన్ని కూడా జగన్ చెప్పుకొచ్చారు. దీనిలో కొత్తగా జగన్ చెప్పింది ఏమీలేదు.
అయితే.. తన బాధను ప్రపంచం పట్టించుకోవడం లేదన్న ఆవేదనే ఆయనలో కనిపిస్తుండడం గమనా ర్హం. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీకి భారీ డ్యామేజీ అయితే ఏర్పడింది. దీని నుంచి బయటకు రాలేక పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు.
దీనికి చంద్రబాబును బూచిగా చూపిస్తూ.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేశాక కూడా వారిలో మార్పురాలేదన్న భావనను ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా జగన్ బాధ ప్రపంచానికి బాధగా మారాలని ఆయన భావిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…