వైసీపీ అధినేత జగన్.. తాజాగా ట్వీట్ చేశారు. దీనిలో 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్టు చేశా రు. దీనికి ముందు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా.. చంద్రబాబు తిరుమల రాజకీయా లు మానుకోవడం లేదని, మారడం లేదని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ పోస్టును దేశవ్యాప్తంగా అన్ని మీడి యా చానెళ్లకు, అదేవిధంగా ఎన్డీయేతర పార్టీలకు కూడా పంపించారు. దీనిలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.
ఇక, ఉత్తరాది పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆప్ సహా అనేక పార్టీలను జగన్ ట్యాగ్ చేశారు. `మీరంతా చూడండి. పట్టించుకోండి“ అన్నట్టుగా ఆయన ప్రాథేయ పడ్డారు. ఇక, వీడియోలో యథాలాపంగా.. సుప్రీంకోర్టు గత నెల 30న చేసిన కామెంట్లను, అప్పట్లో జాతీయ మీడియా ప్రచురించిన వార్తలను చదివి వినిపించారు.
అదేవిధంగా తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించిన విషయాన్ని కూడా జగన్ చెప్పుకొచ్చారు. దీనిలో కొత్తగా జగన్ చెప్పింది ఏమీలేదు.
అయితే.. తన బాధను ప్రపంచం పట్టించుకోవడం లేదన్న ఆవేదనే ఆయనలో కనిపిస్తుండడం గమనా ర్హం. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీకి భారీ డ్యామేజీ అయితే ఏర్పడింది. దీని నుంచి బయటకు రాలేక పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు.
దీనికి చంద్రబాబును బూచిగా చూపిస్తూ.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేశాక కూడా వారిలో మార్పురాలేదన్న భావనను ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా జగన్ బాధ ప్రపంచానికి బాధగా మారాలని ఆయన భావిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on October 5, 2024 3:32 pm
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…