వైసీపీ అధినేత జగన్.. తాజాగా ట్వీట్ చేశారు. దీనిలో 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్టు చేశా రు. దీనికి ముందు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా.. చంద్రబాబు తిరుమల రాజకీయా లు మానుకోవడం లేదని, మారడం లేదని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ పోస్టును దేశవ్యాప్తంగా అన్ని మీడి యా చానెళ్లకు, అదేవిధంగా ఎన్డీయేతర పార్టీలకు కూడా పంపించారు. దీనిలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.
ఇక, ఉత్తరాది పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆప్ సహా అనేక పార్టీలను జగన్ ట్యాగ్ చేశారు. `మీరంతా చూడండి. పట్టించుకోండి“ అన్నట్టుగా ఆయన ప్రాథేయ పడ్డారు. ఇక, వీడియోలో యథాలాపంగా.. సుప్రీంకోర్టు గత నెల 30న చేసిన కామెంట్లను, అప్పట్లో జాతీయ మీడియా ప్రచురించిన వార్తలను చదివి వినిపించారు.
అదేవిధంగా తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించిన విషయాన్ని కూడా జగన్ చెప్పుకొచ్చారు. దీనిలో కొత్తగా జగన్ చెప్పింది ఏమీలేదు.
అయితే.. తన బాధను ప్రపంచం పట్టించుకోవడం లేదన్న ఆవేదనే ఆయనలో కనిపిస్తుండడం గమనా ర్హం. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీకి భారీ డ్యామేజీ అయితే ఏర్పడింది. దీని నుంచి బయటకు రాలేక పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు.
దీనికి చంద్రబాబును బూచిగా చూపిస్తూ.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేశాక కూడా వారిలో మార్పురాలేదన్న భావనను ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా జగన్ బాధ ప్రపంచానికి బాధగా మారాలని ఆయన భావిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on October 5, 2024 3:32 pm
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…