Political News

జ‌గ‌న్ త‌న బాధ‌ను ప్ర‌పంచం బాధ చేస్తున్నారే!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా ట్వీట్ చేశారు. దీనిలో 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్టు చేశా రు. దీనికి ముందు.. సుప్రీంకోర్టు మొట్టికాయ‌లు వేసిన త‌ర్వాత కూడా.. చంద్ర‌బాబు తిరుమ‌ల రాజ‌కీయా లు మానుకోవ‌డం లేద‌ని, మార‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, ఈ పోస్టును దేశ‌వ్యాప్తంగా అన్ని మీడి యా చానెళ్ల‌కు, అదేవిధంగా ఎన్డీయేత‌ర పార్టీల‌కు కూడా పంపించారు. దీనిలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.

ఇక‌, ఉత్త‌రాది పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆప్ స‌హా అనేక పార్టీలను జ‌గ‌న్ ట్యాగ్ చేశారు. `మీరంతా చూడండి. ప‌ట్టించుకోండి“ అన్న‌ట్టుగా ఆయ‌న ప్రాథేయ ప‌డ్డారు. ఇక‌, వీడియోలో య‌థాలాపంగా.. సుప్రీంకోర్టు గ‌త నెల 30న చేసిన కామెంట్ల‌ను, అప్ప‌ట్లో జాతీయ మీడియా ప్ర‌చురించిన వార్త‌ల‌ను చ‌దివి వినిపించారు.

అదేవిధంగా తాజాగా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియ‌మించిన విష‌యాన్ని కూడా జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. దీనిలో కొత్త‌గా జ‌గ‌న్ చెప్పింది ఏమీలేదు.

అయితే.. త‌న బాధ‌ను ప్ర‌పంచం పట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేదనే ఆయ‌న‌లో క‌నిపిస్తుండ‌డం గ‌మనా ర్హం. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ విషయంలో వైసీపీకి భారీ డ్యామేజీ అయితే ఏర్ప‌డింది. దీని నుంచి బ‌య‌ట‌కు రాలేక పోతున్న ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు.

దీనికి చంద్ర‌బాబును బూచిగా చూపిస్తూ.. సుప్రీంకోర్టు మొట్టికాయ‌లు వేశాక కూడా వారిలో మార్పురాలేద‌న్న భావ‌న‌ను ప్ర‌చారం చేస్తున్నారు. మొత్తంగా జ‌గ‌న్ బాధ ప్ర‌పంచానికి బాధగా మారాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 5, 2024 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

27 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago