Political News

స‌రుకు లేని కంపెనీకి కాంట్రాక్టు.. వైసీపీ మ‌రో ముచ్చ‌ట‌!

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారానికి సంబంధించి అధికార పార్టీ టీడీపీ మ‌రో కీల‌క విష‌యా న్ని వెలుగులోకి తీసుకువ‌చ్చింది. స‌రుకు లేని కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన వ్య‌వ‌హారాన్ని తూర్పార బ‌ట్టిం ది. ఉదాహ‌ర‌ణ‌కు 100 కిలోల బ‌స్తా మోసే వ్య‌క్తిపై 1000 కిలోలు మోపిన చందంగా వైసీపీ వ్య‌వ‌హ‌రించింది. తిరుమ‌ల‌కు నెయ్యి స‌ర‌ఫ‌రా చేసేందుకు ప‌లు కంపెనీల‌ను ఎంచుకున్న వైసీపీ ప్ర‌భుత్వం.. పెద్ద‌గా అనుభ‌వం లేని త‌మిళ‌నాడుకు చెందిన ఏఆర్ ఇండ‌స్ట్రీను ఎంచుకుంది.

పైగా ఈ సంస్థ‌కు తిరుమ‌ల వంటి పెద్ద క్షేత్రానికి భారీ స్థాయిలో నెయ్యి అందించే సామ‌ర్థ్యం లేద‌ని ఇప్పుడు టీడీపీ నాయ‌కులు ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. తిరుమ‌ల నెయ్యి స‌హా ఇత‌ర స‌రుకుల కాంట్రాక్టును ఏటా ఏప్రిల్‌-మే మ‌ధ్య కాంట్రాక్టు ఇస్తుంటారు. దీనికి సంబంధించిన ప్ర‌క్రియ‌ను ఆరు మాసాల ముందే ప్రారంభిస్తారు. ఇలానే ఈ ఏడాది మే 15న ఏఆర్ పుడ్ ఇండ‌స్ట్రీస్‌కి టీటీడీ ఆర్డ‌ర్ ఇచ్చింది. జూన్ 11న ఒప్పందం కూడా చేసుకుంది.

మొత్తం 1000 ట‌న్నుల నెయ్యి స‌ర‌ఫ‌రా చేసుకునేలా ఈ ఒప్పందం ఉన్న‌ద‌ని టీడీపీ చెబుతోంది. కానీ, ఏఆర్ సామ‌ర్థ్యం.. స‌రుకు ఇచ్చే స్థాయి మాత్రం అంత లేదు. నెల‌కు కేవ‌లం 16 ట‌న్నుల నెయ్యిని మాత్రమే ఈ సంస్థ తిరుమ‌ల‌కు ఇచ్చే స్థాయిలో ఉంది. ఇలా చూసుకుంటే.. ఆరు మాసాల‌కు కేవ‌లం 96 ట‌న్నుల నెయ్యిని మాత్రమే ఈ సంస్థ అందిస్తుంది. అయితే.. వెయ్యి ట‌న్నుల మేర‌కు కాంట్రాక్టు ఇవ్వ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆ సంస్థ త‌ప్పిదాల‌కు పాల్ప‌డి ఉంటుంద‌న్న చ‌ర్చ కూడా టీడీపీ తెర‌మీదికి తెచ్చింది. నిజానికి 2022లో కుదిరిన ఒప్పందం మేర‌కు ఈ సంస్థ 15 ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేసింది. ఆ త‌ర్వాతే.. ఇది 16 ట‌న్నుల‌కు పెంచారు. అది కూడా నెల ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అంటే.. అస‌లు సామ‌ర్థ్యం లేని కంపెనీకి ఇంత స‌రుకు ఇవ్వ‌డంలోనే ఎక్క‌డో తేడా కొడుతోంద‌న్న‌ది టీడీపీ నేతుల చెబుతున్న మాట‌. దీనిపైనే విచార‌ణ చేయాల‌న్న‌ది కూడా వారి డిమాండ్‌. మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on October 3, 2024 7:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

41 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago