Political News

స‌రుకు లేని కంపెనీకి కాంట్రాక్టు.. వైసీపీ మ‌రో ముచ్చ‌ట‌!

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారానికి సంబంధించి అధికార పార్టీ టీడీపీ మ‌రో కీల‌క విష‌యా న్ని వెలుగులోకి తీసుకువ‌చ్చింది. స‌రుకు లేని కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన వ్య‌వ‌హారాన్ని తూర్పార బ‌ట్టిం ది. ఉదాహ‌ర‌ణ‌కు 100 కిలోల బ‌స్తా మోసే వ్య‌క్తిపై 1000 కిలోలు మోపిన చందంగా వైసీపీ వ్య‌వ‌హ‌రించింది. తిరుమ‌ల‌కు నెయ్యి స‌ర‌ఫ‌రా చేసేందుకు ప‌లు కంపెనీల‌ను ఎంచుకున్న వైసీపీ ప్ర‌భుత్వం.. పెద్ద‌గా అనుభ‌వం లేని త‌మిళ‌నాడుకు చెందిన ఏఆర్ ఇండ‌స్ట్రీను ఎంచుకుంది.

పైగా ఈ సంస్థ‌కు తిరుమ‌ల వంటి పెద్ద క్షేత్రానికి భారీ స్థాయిలో నెయ్యి అందించే సామ‌ర్థ్యం లేద‌ని ఇప్పుడు టీడీపీ నాయ‌కులు ఆధారాల‌తో స‌హా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. తిరుమ‌ల నెయ్యి స‌హా ఇత‌ర స‌రుకుల కాంట్రాక్టును ఏటా ఏప్రిల్‌-మే మ‌ధ్య కాంట్రాక్టు ఇస్తుంటారు. దీనికి సంబంధించిన ప్ర‌క్రియ‌ను ఆరు మాసాల ముందే ప్రారంభిస్తారు. ఇలానే ఈ ఏడాది మే 15న ఏఆర్ పుడ్ ఇండ‌స్ట్రీస్‌కి టీటీడీ ఆర్డ‌ర్ ఇచ్చింది. జూన్ 11న ఒప్పందం కూడా చేసుకుంది.

మొత్తం 1000 ట‌న్నుల నెయ్యి స‌ర‌ఫ‌రా చేసుకునేలా ఈ ఒప్పందం ఉన్న‌ద‌ని టీడీపీ చెబుతోంది. కానీ, ఏఆర్ సామ‌ర్థ్యం.. స‌రుకు ఇచ్చే స్థాయి మాత్రం అంత లేదు. నెల‌కు కేవ‌లం 16 ట‌న్నుల నెయ్యిని మాత్రమే ఈ సంస్థ తిరుమ‌ల‌కు ఇచ్చే స్థాయిలో ఉంది. ఇలా చూసుకుంటే.. ఆరు మాసాల‌కు కేవ‌లం 96 ట‌న్నుల నెయ్యిని మాత్రమే ఈ సంస్థ అందిస్తుంది. అయితే.. వెయ్యి ట‌న్నుల మేర‌కు కాంట్రాక్టు ఇవ్వ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఆ సంస్థ త‌ప్పిదాల‌కు పాల్ప‌డి ఉంటుంద‌న్న చ‌ర్చ కూడా టీడీపీ తెర‌మీదికి తెచ్చింది. నిజానికి 2022లో కుదిరిన ఒప్పందం మేర‌కు ఈ సంస్థ 15 ట‌న్నులు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేసింది. ఆ త‌ర్వాతే.. ఇది 16 ట‌న్నుల‌కు పెంచారు. అది కూడా నెల ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అంటే.. అస‌లు సామ‌ర్థ్యం లేని కంపెనీకి ఇంత స‌రుకు ఇవ్వ‌డంలోనే ఎక్క‌డో తేడా కొడుతోంద‌న్న‌ది టీడీపీ నేతుల చెబుతున్న మాట‌. దీనిపైనే విచార‌ణ చేయాల‌న్న‌ది కూడా వారి డిమాండ్‌. మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on October 3, 2024 7:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 hour ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago