Political News

కోర్టులపై పవన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతూ స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ పవన్ కల్యాణ్ ఈ సభలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి పాదాల సాక్షిగా, శ్రీవారి పాదాల సాక్షిగా చెబుతున్నానని…ఇలా రోడ్డు మీదకు వచ్చి ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుందనుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని, తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా తాను బాధపడనని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకోబోనని పవన్ చెప్పారు.

గత దశాబ్ద కాలంగా తనను, తన కుటుంబాన్ని అవమానించారని, నీచంగా మాట్లాడారాని పవన్ చెప్పారు. అయినా తాను ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని అన్నారు. తన చిన్న కూతురు చేత తిరుమల డిక్లరేషన్ ఇప్పించానని, నిజమైన సంప్రదాయాలు పాటించే వ్యక్తిని అని చెప్పారు.

సనాతన ధర్మం పై దాడులు జరుగుతుంటే ఈ మధ్య కోర్టులు వాటిని సమర్డిస్తున్నాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిన వాడికి కంచాలు, కానివాడికి ఆకులు అన్నట్లుగా ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతిలో పెడతాం నాకండి అంటున్నారు అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సనాతన ధర్మంపై దాడులు చేసిన వారిని కోర్టులు కాపాడటం దురదృష్టకరమని పవన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.

తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. గతంలోనే వైసీపీ వారిని హెచ్చరించినా వారు వినలేదని చెప్పారు.
ఈ రోజూ ఏపీ ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజల ముందుకు రాలేదని, సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా ప్రజల ముందుకు వచ్చానని పవన్ చెప్పారు. తాను హిందూ మతాన్ని అనుసరిస్తానని, ఇస్లాం, క్రిస్టియానిటి, సిఖ్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పారు.

This post was last modified on October 3, 2024 7:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

35 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

1 hour ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago