Political News

కోర్టులపై పవన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతూ స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ పవన్ కల్యాణ్ ఈ సభలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి పాదాల సాక్షిగా, శ్రీవారి పాదాల సాక్షిగా చెబుతున్నానని…ఇలా రోడ్డు మీదకు వచ్చి ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుందనుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని, తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా తాను బాధపడనని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకోబోనని పవన్ చెప్పారు.

గత దశాబ్ద కాలంగా తనను, తన కుటుంబాన్ని అవమానించారని, నీచంగా మాట్లాడారాని పవన్ చెప్పారు. అయినా తాను ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని అన్నారు. తన చిన్న కూతురు చేత తిరుమల డిక్లరేషన్ ఇప్పించానని, నిజమైన సంప్రదాయాలు పాటించే వ్యక్తిని అని చెప్పారు.

సనాతన ధర్మం పై దాడులు జరుగుతుంటే ఈ మధ్య కోర్టులు వాటిని సమర్డిస్తున్నాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిన వాడికి కంచాలు, కానివాడికి ఆకులు అన్నట్లుగా ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతిలో పెడతాం నాకండి అంటున్నారు అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సనాతన ధర్మంపై దాడులు చేసిన వారిని కోర్టులు కాపాడటం దురదృష్టకరమని పవన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.

తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. గతంలోనే వైసీపీ వారిని హెచ్చరించినా వారు వినలేదని చెప్పారు.
ఈ రోజూ ఏపీ ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజల ముందుకు రాలేదని, సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా ప్రజల ముందుకు వచ్చానని పవన్ చెప్పారు. తాను హిందూ మతాన్ని అనుసరిస్తానని, ఇస్లాం, క్రిస్టియానిటి, సిఖ్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పారు.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

1 hour ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

1 hour ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

2 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

3 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago