Political News

కోర్టులపై పవన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరంతో బాధపడుతూ స్వల్ప అస్వస్థతకు గురైనప్పటికీ పవన్ కల్యాణ్ ఈ సభలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి పాదాల సాక్షిగా, శ్రీవారి పాదాల సాక్షిగా చెబుతున్నానని…ఇలా రోడ్డు మీదకు వచ్చి ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుందనుకోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని, తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయినా తాను బాధపడనని అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే చూస్తూ ఊరుకోబోనని పవన్ చెప్పారు.

గత దశాబ్ద కాలంగా తనను, తన కుటుంబాన్ని అవమానించారని, నీచంగా మాట్లాడారాని పవన్ చెప్పారు. అయినా తాను ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని అన్నారు. తన చిన్న కూతురు చేత తిరుమల డిక్లరేషన్ ఇప్పించానని, నిజమైన సంప్రదాయాలు పాటించే వ్యక్తిని అని చెప్పారు.

సనాతన ధర్మం పై దాడులు జరుగుతుంటే ఈ మధ్య కోర్టులు వాటిని సమర్డిస్తున్నాయని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయిన వాడికి కంచాలు, కానివాడికి ఆకులు అన్నట్లుగా ఉన్నారని విమర్శించారు. ఇప్పుడు ఆకులు కూడా లేవు, చేతిలో పెడతాం నాకండి అంటున్నారు అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సనాతన ధర్మంపై దాడులు చేసిన వారిని కోర్టులు కాపాడటం దురదృష్టకరమని పవన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.

తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. గతంలోనే వైసీపీ వారిని హెచ్చరించినా వారు వినలేదని చెప్పారు.
ఈ రోజూ ఏపీ ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజల ముందుకు రాలేదని, సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా ప్రజల ముందుకు వచ్చానని పవన్ చెప్పారు. తాను హిందూ మతాన్ని అనుసరిస్తానని, ఇస్లాం, క్రిస్టియానిటి, సిఖ్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తానని పవన్ చెప్పారు.

This post was last modified on October 3, 2024 7:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

28 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago