తెలంగాణ సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు రంగం రెడీ అయిందంటున్నారు. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ను కేంద్రంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా యి. ముఖ్యంగా నటి సమంత విషయంలో సురేఖ చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అందరూ ఎండగడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సబబు కాదని అందరూ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సెగ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సురేఖకు వ్యతిరే కంగా ధర్నాలు, నిరసనలకు బీఆర్ ఎస్ పక్కా ప్లాన్ చేస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా మీడియా ముందుకు రానున్నారు. అంతేకాదు.. నిరసనల్లో ఆయన కూడా పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సురేఖ అంశం.. మరింత వేడెక్కనుంది. ఇప్పటి వరకు అనేక విమర్శలు వచ్చినా.. సర్కారు తరఫున సీఎం రేవంత్ సరిదిద్దుకుంటూ వస్తున్నారు.
గతంలో నెల రోజుల కిందట.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అసెంబ్లీలోనే తనను దూషించారంటూ.. కన్నీరు పెట్టుకున్నారు. అప్పట్లోనే మహిళలను కించపరుస్తున్నారంటూ బీఆర్ ఎస్ ఉద్యమించింది. దానిని సరిదిద్దుకునేందుకు సీఎం రేవంత్ స్పందించారు. అది సమసి పోయిందని భావిస్తున్న సమయం లో అనూహ్యంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు అన్ని వర్గాలకు చేరిపోయాయి. ఇలాంటి సమయంలో వీటిని సరిదిద్దుకునేందుకు మాటలు చెబితే సరిపోదని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దీనికి ప్రతిగా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం తప్ప.. రేవంత్ ముందున్న ప్రత్యామ్నాయం మరొకటి కనిపించడం లేదు. ఒకవైపు హైడ్రా దూకుడుతో సామాన్యుల్లో సర్కారుపై వ్యతిరేకత పెరిగింది. దీనిని తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక, ఇప్పుడు సురేఖ ఇష్యూ మహిళా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే.. ఎంత మంచి పాలన అందించినా ప్రయోజనం లేదని రేవంత్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తన మంత్రి వర్గం నుంచి సురేఖను పక్కన పెట్టేస్తారని సీఎంవో వర్గాలు సైతం చెబుతుండడం గమనార్హం. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో సురేఖ స్థానంలో వేరేవారికి అవకాశం దక్కనుందని సమాచారం. దీనిపై ఈ రోజు లేదా రేపటిలోనే సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
This post was last modified on October 3, 2024 10:12 am
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…