టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, ఎంతో మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన కేటీఆర్ హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సురేఖ చేసిన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. హీరోయిన్లతో రేవ్ పార్టీలు చేసుకొని, వారి ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకొని ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ కు తల్లి, చెల్లి, భార్య లేరా అని సురేఖ ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సురేఖ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను హీరోయిన్ల ఫోన్ లో టాప్ చేశానని కొండా సురేఖ అన్నప్పుడు తన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు బాధపడలేదా అని కేటీఆర్ నిలదీశారు. సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు, కామెంట్లకు తమకు ఏం సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు గుర్తుకు తెచ్చుకోవాలని, వారు తిట్టినప్పుడు ఇతర పార్టీల నేతల మనోభావాలు దెబ్బ తినలేదా అని ఆయన ప్రశ్నించారు.
కొండా సురేఖ, సీతక్కలు…సీఎం రేవంత్ రెడ్డి నోరు ఫినాయిల్ తో కడగాలని కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిట్టినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక కాంగ్రెస్ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులు మూసి ప్రాంతంలో తిరగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక తనపై దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on October 2, 2024 10:15 pm
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో…
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…