టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, ఎంతో మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన కేటీఆర్ హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సురేఖ చేసిన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. హీరోయిన్లతో రేవ్ పార్టీలు చేసుకొని, వారి ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకొని ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ కు తల్లి, చెల్లి, భార్య లేరా అని సురేఖ ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సురేఖ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను హీరోయిన్ల ఫోన్ లో టాప్ చేశానని కొండా సురేఖ అన్నప్పుడు తన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు బాధపడలేదా అని కేటీఆర్ నిలదీశారు. సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు, కామెంట్లకు తమకు ఏం సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు గుర్తుకు తెచ్చుకోవాలని, వారు తిట్టినప్పుడు ఇతర పార్టీల నేతల మనోభావాలు దెబ్బ తినలేదా అని ఆయన ప్రశ్నించారు.
కొండా సురేఖ, సీతక్కలు…సీఎం రేవంత్ రెడ్డి నోరు ఫినాయిల్ తో కడగాలని కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిట్టినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక కాంగ్రెస్ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులు మూసి ప్రాంతంలో తిరగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక తనపై దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on October 2, 2024 10:15 pm
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…