టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, ఎంతో మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన కేటీఆర్ హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సురేఖ చేసిన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. హీరోయిన్లతో రేవ్ పార్టీలు చేసుకొని, వారి ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకొని ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ కు తల్లి, చెల్లి, భార్య లేరా అని సురేఖ ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సురేఖ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను హీరోయిన్ల ఫోన్ లో టాప్ చేశానని కొండా సురేఖ అన్నప్పుడు తన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు బాధపడలేదా అని కేటీఆర్ నిలదీశారు. సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు, కామెంట్లకు తమకు ఏం సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు గుర్తుకు తెచ్చుకోవాలని, వారు తిట్టినప్పుడు ఇతర పార్టీల నేతల మనోభావాలు దెబ్బ తినలేదా అని ఆయన ప్రశ్నించారు.
కొండా సురేఖ, సీతక్కలు…సీఎం రేవంత్ రెడ్డి నోరు ఫినాయిల్ తో కడగాలని కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిట్టినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక కాంగ్రెస్ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులు మూసి ప్రాంతంలో తిరగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక తనపై దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on October 2, 2024 10:15 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…