Political News

కొండా సురేఖకు కేటీఆర్ కౌంటర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, ఎంతో మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.

మత్తు పదార్థాలకు అలవాటు పడిన కేటీఆర్ హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సురేఖ చేసిన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. హీరోయిన్లతో రేవ్ పార్టీలు చేసుకొని, వారి ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకొని ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ కు తల్లి, చెల్లి, భార్య లేరా అని సురేఖ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే సురేఖ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను హీరోయిన్ల ఫోన్ లో టాప్ చేశానని కొండా సురేఖ అన్నప్పుడు తన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు బాధపడలేదా అని కేటీఆర్ నిలదీశారు. సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు, కామెంట్లకు తమకు ఏం సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు గుర్తుకు తెచ్చుకోవాలని, వారు తిట్టినప్పుడు ఇతర పార్టీల నేతల మనోభావాలు దెబ్బ తినలేదా అని ఆయన ప్రశ్నించారు.

కొండా సురేఖ, సీతక్కలు…సీఎం రేవంత్ రెడ్డి నోరు ఫినాయిల్ తో కడగాలని కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిట్టినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక కాంగ్రెస్ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులు మూసి ప్రాంతంలో తిరగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక తనపై దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on October 2, 2024 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

27 minutes ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

27 minutes ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

1 hour ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

10 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago