Political News

మోడీ వ‌ర‌ద సాయం ఏపీ కన్నా మ‌హారాష్ట్ర‌కు ఎక్కువ ఎందుకు?

ఏపీలోని విజ‌య‌వాడ‌, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో గ‌త నెల 1 నుంచి 15 వ తేదీల మ‌ధ్య తీవ్ర వ‌ర‌ద వ‌చ్చిన విష‌యం తెలిసిందే. విజ‌య‌వాడ‌లో శివారు ప్రాంతాలైతే.. ప‌ది రోజుల పాటు వ‌ర‌ద నీటిలోనే నానిపోయాయి.

ఇక‌, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ప‌దుల సంఖ్య‌లో గ్రామాలు ముంపు బారిన ప‌డ్డాయి. ఆయా ప్రాంతాల్లో నిద్రాహారాలు లేక‌.. ప్ర‌జ‌లు అల్లాడిపోయారు. ఆస్తులు పోగొట్టు కున్నారు. వాహ‌నాలు పోగొట్టుకున్నారు. డ‌బ్బులు పోగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నానా ప్ర‌యాస‌లు ప‌డింది. సీఎం చంద్ర‌బాబు నేరుగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రం నుంచి కూడా సాయం ఆశించారు. ప్రాథ‌మిక న‌ష్టాల‌ను అంచ‌నా వేసిన ఏపీ ప్ర‌భుత్వం సుమారు రూ.6880 కోట్లను త‌మ‌కు త‌క్ష‌ణ సాయంగా అందించాల‌ని వేడుకుంది.

ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌డంతోపాటు బాధిత ప్రాంతాల ఛాయా చిత్రాల‌తో పాటు.. వీడియోల‌ను కూడా పెన్ డ్రైవ్‌లో వేసి పంపించింది. కేంద్రం నుంచి విప‌త్తు ప‌రిశీల‌న బృందాలు వ‌స్తే.. వాటిని కూడా క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లి ప‌రిస్థితిని వివ‌రించారు. ఇక‌, కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఏపీకి వ‌చ్చి రెండు రోజులపాటు ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో వ‌ర‌ద నీటిలోనే ప‌ర్య‌టించి ప‌రిస్థితిని క‌ళ్లారా చూశారు.

దీంతో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర‌ద సాయంపై కోటి ఆశ‌లు పెట్టుకుంది. ఈ లోగా దాత‌ల నుంచి విరాళాలు సేక‌రించి.. బాధితుల‌కు పంచుతోంది. ఇదిలావుంటే.. తాజాగా కేంద్రం నుంచి నిధులు విడుద‌ల‌య్యాయి. జాతీయ విప‌త్తు నివార‌ణ కింద‌.. ఈ నిధుల‌ను ప‌లు రాష్ట్రాల‌కు విడుద‌ల చేశారు. దీనిలో ఏపీ రూ.6880 కోట్లు అడిగితే.. కేంద్రం ఇచ్చింది… మాత్రం రూ.1,036 కోట్లు, అంటే.. క‌నీసం మూడో వంతు నిధులు కూడా ఇవ్వ‌లేదు. ఇదేస‌మ‌యంలో వ‌చ్చే కొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌హారాష్ట్ర‌కు మాత్రం 1432 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింది.

ఈ ప‌రిణామంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. కేంద్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు ప్ర‌ధాన కార‌ణ‌మైన‌.. ఏపీ క‌ష్టాల్లో ఉంటే ఇలానేనా సాయం చేసేద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిధులు అడిగితే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌లు చేసిన త‌ర్వాత కూడా.. విదిలింపులేనా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం స్పందించాల్సి ఉంది. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on October 2, 2024 7:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

21 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago