ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో గత నెల 1 నుంచి 15 వ తేదీల మధ్య తీవ్ర వరద వచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో శివారు ప్రాంతాలైతే.. పది రోజుల పాటు వరద నీటిలోనే నానిపోయాయి.
ఇక, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో నిద్రాహారాలు లేక.. ప్రజలు అల్లాడిపోయారు. ఆస్తులు పోగొట్టు కున్నారు. వాహనాలు పోగొట్టుకున్నారు. డబ్బులు పోగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా ప్రయాసలు పడింది. సీఎం చంద్రబాబు నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే కేంద్రం నుంచి కూడా సాయం ఆశించారు. ప్రాథమిక నష్టాలను అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం సుమారు రూ.6880 కోట్లను తమకు తక్షణ సాయంగా అందించాలని వేడుకుంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు బాధిత ప్రాంతాల ఛాయా చిత్రాలతో పాటు.. వీడియోలను కూడా పెన్ డ్రైవ్లో వేసి పంపించింది. కేంద్రం నుంచి విపత్తు పరిశీలన బృందాలు వస్తే.. వాటిని కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. ఇక, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీకి వచ్చి రెండు రోజులపాటు ఆయన క్షేత్రస్థాయిలో వరద నీటిలోనే పర్యటించి పరిస్థితిని కళ్లారా చూశారు.
దీంతో ఏపీ ప్రభుత్వం వరద సాయంపై కోటి ఆశలు పెట్టుకుంది. ఈ లోగా దాతల నుంచి విరాళాలు సేకరించి.. బాధితులకు పంచుతోంది. ఇదిలావుంటే.. తాజాగా కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. జాతీయ విపత్తు నివారణ కింద.. ఈ నిధులను పలు రాష్ట్రాలకు విడుదల చేశారు. దీనిలో ఏపీ రూ.6880 కోట్లు అడిగితే.. కేంద్రం ఇచ్చింది… మాత్రం రూ.1,036 కోట్లు, అంటే.. కనీసం మూడో వంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఇదేసమయంలో వచ్చే కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు మాత్రం 1432 కోట్ల రూపాయలను కేటాయించింది.
ఈ పరిణామంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రధాన కారణమైన.. ఏపీ కష్టాల్లో ఉంటే ఇలానేనా సాయం చేసేదన్న వాదన వినిపిస్తోంది. నిధులు అడిగితే.. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసిన తర్వాత కూడా.. విదిలింపులేనా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on October 2, 2024 7:36 am
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…