Political News

మోడీ వ‌ర‌ద సాయం ఏపీ కన్నా మ‌హారాష్ట్ర‌కు ఎక్కువ ఎందుకు?

ఏపీలోని విజ‌య‌వాడ‌, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో గ‌త నెల 1 నుంచి 15 వ తేదీల మ‌ధ్య తీవ్ర వ‌ర‌ద వ‌చ్చిన విష‌యం తెలిసిందే. విజ‌య‌వాడ‌లో శివారు ప్రాంతాలైతే.. ప‌ది రోజుల పాటు వ‌ర‌ద నీటిలోనే నానిపోయాయి.

ఇక‌, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ప‌దుల సంఖ్య‌లో గ్రామాలు ముంపు బారిన ప‌డ్డాయి. ఆయా ప్రాంతాల్లో నిద్రాహారాలు లేక‌.. ప్ర‌జ‌లు అల్లాడిపోయారు. ఆస్తులు పోగొట్టు కున్నారు. వాహ‌నాలు పోగొట్టుకున్నారు. డ‌బ్బులు పోగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నానా ప్ర‌యాస‌లు ప‌డింది. సీఎం చంద్ర‌బాబు నేరుగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రం నుంచి కూడా సాయం ఆశించారు. ప్రాథ‌మిక న‌ష్టాల‌ను అంచ‌నా వేసిన ఏపీ ప్ర‌భుత్వం సుమారు రూ.6880 కోట్లను త‌మ‌కు త‌క్ష‌ణ సాయంగా అందించాల‌ని వేడుకుంది.

ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌డంతోపాటు బాధిత ప్రాంతాల ఛాయా చిత్రాల‌తో పాటు.. వీడియోల‌ను కూడా పెన్ డ్రైవ్‌లో వేసి పంపించింది. కేంద్రం నుంచి విప‌త్తు ప‌రిశీల‌న బృందాలు వ‌స్తే.. వాటిని కూడా క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లి ప‌రిస్థితిని వివ‌రించారు. ఇక‌, కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఏపీకి వ‌చ్చి రెండు రోజులపాటు ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో వ‌ర‌ద నీటిలోనే ప‌ర్య‌టించి ప‌రిస్థితిని క‌ళ్లారా చూశారు.

దీంతో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర‌ద సాయంపై కోటి ఆశ‌లు పెట్టుకుంది. ఈ లోగా దాత‌ల నుంచి విరాళాలు సేక‌రించి.. బాధితుల‌కు పంచుతోంది. ఇదిలావుంటే.. తాజాగా కేంద్రం నుంచి నిధులు విడుద‌ల‌య్యాయి. జాతీయ విప‌త్తు నివార‌ణ కింద‌.. ఈ నిధుల‌ను ప‌లు రాష్ట్రాల‌కు విడుద‌ల చేశారు. దీనిలో ఏపీ రూ.6880 కోట్లు అడిగితే.. కేంద్రం ఇచ్చింది… మాత్రం రూ.1,036 కోట్లు, అంటే.. క‌నీసం మూడో వంతు నిధులు కూడా ఇవ్వ‌లేదు. ఇదేస‌మ‌యంలో వ‌చ్చే కొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌హారాష్ట్ర‌కు మాత్రం 1432 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింది.

ఈ ప‌రిణామంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. కేంద్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు ప్ర‌ధాన కార‌ణ‌మైన‌.. ఏపీ క‌ష్టాల్లో ఉంటే ఇలానేనా సాయం చేసేద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిధులు అడిగితే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌లు చేసిన త‌ర్వాత కూడా.. విదిలింపులేనా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం స్పందించాల్సి ఉంది. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on October 2, 2024 7:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ దర్శకుడిపై మోయలేని భారం

అయాన్ ముఖర్జీ.. ‘వేకప్ సిద్’ అనే క్లాస్ మూవీతో పరిచయమైన బాలీవుడ్ దర్శకుడు. ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని…

12 mins ago

శంకర్‌కు నష్టం.. నిర్మాతకు లాభం

ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్‌ల క్రేజీ…

4 hours ago

నా భ‌వ‌నాలైనా కూల్చేయండి: రేవంత్‌కు కేపీవీ ఆఫ‌ర్‌

కేవీపీ రామ‌చంద్ర‌రావు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వాన్ని దాదాపు…

7 hours ago

ప్రభాస్ పుట్టినరోజుకి ఏం ఇవ్వబోతున్నారు

ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…

8 hours ago

నందిగం సురేష్‌కు బెయిల్‌.. ఎన్ని ష‌ర‌తులంటే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బాప‌ట్ల‌ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జైల్లో…

8 hours ago

తగ్గిపోతున్న OTT జోరు దేనికి సంకేతం

కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…

10 hours ago