Political News

మోడీ వ‌ర‌ద సాయం ఏపీ కన్నా మ‌హారాష్ట్ర‌కు ఎక్కువ ఎందుకు?

ఏపీలోని విజ‌య‌వాడ‌, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో గ‌త నెల 1 నుంచి 15 వ తేదీల మ‌ధ్య తీవ్ర వ‌ర‌ద వ‌చ్చిన విష‌యం తెలిసిందే. విజ‌య‌వాడ‌లో శివారు ప్రాంతాలైతే.. ప‌ది రోజుల పాటు వ‌ర‌ద నీటిలోనే నానిపోయాయి.

ఇక‌, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ప‌దుల సంఖ్య‌లో గ్రామాలు ముంపు బారిన ప‌డ్డాయి. ఆయా ప్రాంతాల్లో నిద్రాహారాలు లేక‌.. ప్ర‌జ‌లు అల్లాడిపోయారు. ఆస్తులు పోగొట్టు కున్నారు. వాహ‌నాలు పోగొట్టుకున్నారు. డ‌బ్బులు పోగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నానా ప్ర‌యాస‌లు ప‌డింది. సీఎం చంద్ర‌బాబు నేరుగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలోనే కేంద్రం నుంచి కూడా సాయం ఆశించారు. ప్రాథ‌మిక న‌ష్టాల‌ను అంచ‌నా వేసిన ఏపీ ప్ర‌భుత్వం సుమారు రూ.6880 కోట్లను త‌మ‌కు త‌క్ష‌ణ సాయంగా అందించాల‌ని వేడుకుంది.

ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌డంతోపాటు బాధిత ప్రాంతాల ఛాయా చిత్రాల‌తో పాటు.. వీడియోల‌ను కూడా పెన్ డ్రైవ్‌లో వేసి పంపించింది. కేంద్రం నుంచి విప‌త్తు ప‌రిశీల‌న బృందాలు వ‌స్తే.. వాటిని కూడా క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లి ప‌రిస్థితిని వివ‌రించారు. ఇక‌, కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఏపీకి వ‌చ్చి రెండు రోజులపాటు ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో వ‌ర‌ద నీటిలోనే ప‌ర్య‌టించి ప‌రిస్థితిని క‌ళ్లారా చూశారు.

దీంతో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర‌ద సాయంపై కోటి ఆశ‌లు పెట్టుకుంది. ఈ లోగా దాత‌ల నుంచి విరాళాలు సేక‌రించి.. బాధితుల‌కు పంచుతోంది. ఇదిలావుంటే.. తాజాగా కేంద్రం నుంచి నిధులు విడుద‌ల‌య్యాయి. జాతీయ విప‌త్తు నివార‌ణ కింద‌.. ఈ నిధుల‌ను ప‌లు రాష్ట్రాల‌కు విడుద‌ల చేశారు. దీనిలో ఏపీ రూ.6880 కోట్లు అడిగితే.. కేంద్రం ఇచ్చింది… మాత్రం రూ.1,036 కోట్లు, అంటే.. క‌నీసం మూడో వంతు నిధులు కూడా ఇవ్వ‌లేదు. ఇదేస‌మ‌యంలో వ‌చ్చే కొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మ‌హారాష్ట్ర‌కు మాత్రం 1432 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించింది.

ఈ ప‌రిణామంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. కేంద్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు ప్ర‌ధాన కార‌ణ‌మైన‌.. ఏపీ క‌ష్టాల్లో ఉంటే ఇలానేనా సాయం చేసేద‌న్న వాద‌న వినిపిస్తోంది. నిధులు అడిగితే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న‌లు చేసిన త‌ర్వాత కూడా.. విదిలింపులేనా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం స్పందించాల్సి ఉంది. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on October 2, 2024 7:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

2 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

2 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

5 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

6 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

6 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

8 hours ago