Political News

సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు.. ఏపీ స‌ర్కారు రియాక్ష‌న్ ఇదీ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ ఘ‌ట‌నపై ఏపీ ప్ర‌భుత్వం మ‌రోసారి స్పందించింది. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మంత్రి డీబీవీ స్వామి రియాక్ట్ అయ్యారు. హిందువులు ప‌విత్రంగా భావించే శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ అయిన మాట వాస్త‌వ‌మ‌ని.. త‌మ వ‌ద్ద ఆధారాలు ఉండ‌బ‌ట్టే సీఎం చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు. అయితే.. న్యాయ‌ప‌రంగా కొన్ని అంశాలు తెర‌మీదికి రావ‌డం స‌హ‌జ‌మేన‌ని అన్నారు.

సుప్రీంకోర్టు లేవ‌నెత్తిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌మ వ‌ద్ద స‌మాధానం ఉంద‌న్న మంత్రి డీవీబీ స్వామి.. ముఖ్య మంత్రి చంద్ర‌బాబు శ్రీవారికి అమిత భ‌క్తుడు కావ‌డం వ‌ల్లే.. ర‌హ‌స్యాన్ని సైతం బ‌య‌ట‌కు చెప్పార‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏదీ దాప‌రికం ఉండ‌ద‌ని చెప్ప‌డానికి ఇదే ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నా రు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్నీ దాచేసేద‌ని.. ఏ విష‌యాన్నీ ప్ర‌జ‌ల‌కు చెప్పేది కాద‌ని.. అందుకే అనేక కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని ఈ ప‌రంప‌ర‌లోనే తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూకు వినియోగించే నెయ్యిలోనూ క‌ల్తీ జ‌రిగింద‌న్నారు.

దీనికి సంబంధించిన ల్యాబు రిపోర్టుల‌ను మ‌రోసారి సుప్రీంకోర్టుకు అంద‌జేస్తామ‌ని మంత్రి చెప్పారు. ఇదే స‌మ‌యంలో న్యాయ‌స్థానాల విష‌యంలో త‌మ‌కు అమిత‌మైన గౌర‌వం ఉంద‌ని వ్యాఖ్యానించారు. న్యాయ‌స్థానం లేవ‌నెత్తిన అన్ని సందేహాల‌కు కూడా తాము స‌మాధానం ఇచ్చి తీరుతామ‌న్నారు. ఈ విష‌యంపై ఎలాంటి ద‌ర్యాప్తునైనా ప్ర‌భుత్వం స్వాగ‌తిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) ఈ కేసును విచారిస్తున్న‌ద‌ని తెలిపారు.

అయితే.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం కావ‌డంతో సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వ‌మే విచార‌ణ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా సిట్‌ను నియ‌మించామ‌న్నారు. అయితే, సుప్రీంకోర్టు క‌నుక మ‌రేదైనా సంస్థ‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని భావిస్తే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి విచార‌ణ‌కైనా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్నారు. సీబీఐ స‌హా స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ కానీ, మాజీ న్యాయ‌మూర్తితో కానీ.. విచార‌ణ జ‌రిపించవ‌చ్చ‌ని స‌ర్కారుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పారు.

This post was last modified on October 1, 2024 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago