తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఏపీ ప్రభుత్వం మరోసారి స్పందించింది. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి డీబీవీ స్వామి రియాక్ట్ అయ్యారు. హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ కల్తీ అయిన మాట వాస్తవమని.. తమ వద్ద ఆధారాలు ఉండబట్టే సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారని తెలిపారు. అయితే.. న్యాయపరంగా కొన్ని అంశాలు తెరమీదికి రావడం సహజమేనని అన్నారు.
సుప్రీంకోర్టు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు తమ వద్ద సమాధానం ఉందన్న మంత్రి డీవీబీ స్వామి.. ముఖ్య మంత్రి చంద్రబాబు శ్రీవారికి అమిత భక్తుడు కావడం వల్లే.. రహస్యాన్ని సైతం బయటకు చెప్పారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఏదీ దాపరికం ఉండదని చెప్పడానికి ఇదే ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నా రు. గతంలో జగన్ ప్రభుత్వం అన్నీ దాచేసేదని.. ఏ విషయాన్నీ ప్రజలకు చెప్పేది కాదని.. అందుకే అనేక కుంభకోణాలు జరిగాయని ఈ పరంపరలోనే తిరుమల శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలోనూ కల్తీ జరిగిందన్నారు.
దీనికి సంబంధించిన ల్యాబు రిపోర్టులను మరోసారి సుప్రీంకోర్టుకు అందజేస్తామని మంత్రి చెప్పారు. ఇదే సమయంలో న్యాయస్థానాల విషయంలో తమకు అమితమైన గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం లేవనెత్తిన అన్ని సందేహాలకు కూడా తాము సమాధానం ఇచ్చి తీరుతామన్నారు. ఈ విషయంపై ఎలాంటి దర్యాప్తునైనా ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసును విచారిస్తున్నదని తెలిపారు.
అయితే.. ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కావడంతో సీఎం చంద్రబాబు.. ప్రభుత్వమే విచారణ చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా సిట్ను నియమించామన్నారు. అయితే, సుప్రీంకోర్టు కనుక మరేదైనా సంస్థతో దర్యాప్తు చేయించాలని భావిస్తే.. ప్రభుత్వం తరఫున ఎలాంటి విచారణకైనా తమకు అభ్యంతరం లేదన్నారు. సీబీఐ సహా స్వతంత్ర దర్యాప్తు సంస్థ కానీ, మాజీ న్యాయమూర్తితో కానీ.. విచారణ జరిపించవచ్చని సర్కారుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…