తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఏపీ ప్రభుత్వం మరోసారి స్పందించింది. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి డీబీవీ స్వామి రియాక్ట్ అయ్యారు. హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ కల్తీ అయిన మాట వాస్తవమని.. తమ వద్ద ఆధారాలు ఉండబట్టే సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారని తెలిపారు. అయితే.. న్యాయపరంగా కొన్ని అంశాలు తెరమీదికి రావడం సహజమేనని అన్నారు.
సుప్రీంకోర్టు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు తమ వద్ద సమాధానం ఉందన్న మంత్రి డీవీబీ స్వామి.. ముఖ్య మంత్రి చంద్రబాబు శ్రీవారికి అమిత భక్తుడు కావడం వల్లే.. రహస్యాన్ని సైతం బయటకు చెప్పారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఏదీ దాపరికం ఉండదని చెప్పడానికి ఇదే ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నా రు. గతంలో జగన్ ప్రభుత్వం అన్నీ దాచేసేదని.. ఏ విషయాన్నీ ప్రజలకు చెప్పేది కాదని.. అందుకే అనేక కుంభకోణాలు జరిగాయని ఈ పరంపరలోనే తిరుమల శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలోనూ కల్తీ జరిగిందన్నారు.
దీనికి సంబంధించిన ల్యాబు రిపోర్టులను మరోసారి సుప్రీంకోర్టుకు అందజేస్తామని మంత్రి చెప్పారు. ఇదే సమయంలో న్యాయస్థానాల విషయంలో తమకు అమితమైన గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం లేవనెత్తిన అన్ని సందేహాలకు కూడా తాము సమాధానం ఇచ్చి తీరుతామన్నారు. ఈ విషయంపై ఎలాంటి దర్యాప్తునైనా ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసును విచారిస్తున్నదని తెలిపారు.
అయితే.. ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కావడంతో సీఎం చంద్రబాబు.. ప్రభుత్వమే విచారణ చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా సిట్ను నియమించామన్నారు. అయితే, సుప్రీంకోర్టు కనుక మరేదైనా సంస్థతో దర్యాప్తు చేయించాలని భావిస్తే.. ప్రభుత్వం తరఫున ఎలాంటి విచారణకైనా తమకు అభ్యంతరం లేదన్నారు. సీబీఐ సహా స్వతంత్ర దర్యాప్తు సంస్థ కానీ, మాజీ న్యాయమూర్తితో కానీ.. విచారణ జరిపించవచ్చని సర్కారుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
This post was last modified on October 1, 2024 2:40 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…