Political News

సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు.. ఏపీ స‌ర్కారు రియాక్ష‌న్ ఇదీ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ ఘ‌ట‌నపై ఏపీ ప్ర‌భుత్వం మ‌రోసారి స్పందించింది. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మంత్రి డీబీవీ స్వామి రియాక్ట్ అయ్యారు. హిందువులు ప‌విత్రంగా భావించే శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ అయిన మాట వాస్త‌వ‌మ‌ని.. త‌మ వ‌ద్ద ఆధారాలు ఉండ‌బ‌ట్టే సీఎం చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు. అయితే.. న్యాయ‌ప‌రంగా కొన్ని అంశాలు తెర‌మీదికి రావ‌డం స‌హ‌జ‌మేన‌ని అన్నారు.

సుప్రీంకోర్టు లేవ‌నెత్తిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌మ వ‌ద్ద స‌మాధానం ఉంద‌న్న మంత్రి డీవీబీ స్వామి.. ముఖ్య మంత్రి చంద్ర‌బాబు శ్రీవారికి అమిత భ‌క్తుడు కావ‌డం వ‌ల్లే.. ర‌హ‌స్యాన్ని సైతం బ‌య‌ట‌కు చెప్పార‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏదీ దాప‌రికం ఉండ‌ద‌ని చెప్ప‌డానికి ఇదే ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నా రు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్నీ దాచేసేద‌ని.. ఏ విష‌యాన్నీ ప్ర‌జ‌ల‌కు చెప్పేది కాద‌ని.. అందుకే అనేక కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని ఈ ప‌రంప‌ర‌లోనే తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూకు వినియోగించే నెయ్యిలోనూ క‌ల్తీ జ‌రిగింద‌న్నారు.

దీనికి సంబంధించిన ల్యాబు రిపోర్టుల‌ను మ‌రోసారి సుప్రీంకోర్టుకు అంద‌జేస్తామ‌ని మంత్రి చెప్పారు. ఇదే స‌మ‌యంలో న్యాయ‌స్థానాల విష‌యంలో త‌మ‌కు అమిత‌మైన గౌర‌వం ఉంద‌ని వ్యాఖ్యానించారు. న్యాయ‌స్థానం లేవ‌నెత్తిన అన్ని సందేహాల‌కు కూడా తాము స‌మాధానం ఇచ్చి తీరుతామ‌న్నారు. ఈ విష‌యంపై ఎలాంటి ద‌ర్యాప్తునైనా ప్ర‌భుత్వం స్వాగ‌తిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) ఈ కేసును విచారిస్తున్న‌ద‌ని తెలిపారు.

అయితే.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం కావ‌డంతో సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వ‌మే విచార‌ణ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా సిట్‌ను నియ‌మించామ‌న్నారు. అయితే, సుప్రీంకోర్టు క‌నుక మ‌రేదైనా సంస్థ‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని భావిస్తే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి విచార‌ణ‌కైనా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్నారు. సీబీఐ స‌హా స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ కానీ, మాజీ న్యాయ‌మూర్తితో కానీ.. విచార‌ణ జ‌రిపించవ‌చ్చ‌ని స‌ర్కారుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పారు.

This post was last modified on October 1, 2024 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

18 minutes ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

44 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

1 hour ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

3 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago