తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఏపీ ప్రభుత్వం మరోసారి స్పందించింది. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి డీబీవీ స్వామి రియాక్ట్ అయ్యారు. హిందువులు పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ కల్తీ అయిన మాట వాస్తవమని.. తమ వద్ద ఆధారాలు ఉండబట్టే సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారని తెలిపారు. అయితే.. న్యాయపరంగా కొన్ని అంశాలు తెరమీదికి రావడం సహజమేనని అన్నారు.
సుప్రీంకోర్టు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు తమ వద్ద సమాధానం ఉందన్న మంత్రి డీవీబీ స్వామి.. ముఖ్య మంత్రి చంద్రబాబు శ్రీవారికి అమిత భక్తుడు కావడం వల్లే.. రహస్యాన్ని సైతం బయటకు చెప్పారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఏదీ దాపరికం ఉండదని చెప్పడానికి ఇదే ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నా రు. గతంలో జగన్ ప్రభుత్వం అన్నీ దాచేసేదని.. ఏ విషయాన్నీ ప్రజలకు చెప్పేది కాదని.. అందుకే అనేక కుంభకోణాలు జరిగాయని ఈ పరంపరలోనే తిరుమల శ్రీవారి లడ్డూకు వినియోగించే నెయ్యిలోనూ కల్తీ జరిగిందన్నారు.
దీనికి సంబంధించిన ల్యాబు రిపోర్టులను మరోసారి సుప్రీంకోర్టుకు అందజేస్తామని మంత్రి చెప్పారు. ఇదే సమయంలో న్యాయస్థానాల విషయంలో తమకు అమితమైన గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం లేవనెత్తిన అన్ని సందేహాలకు కూడా తాము సమాధానం ఇచ్చి తీరుతామన్నారు. ఈ విషయంపై ఎలాంటి దర్యాప్తునైనా ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసును విచారిస్తున్నదని తెలిపారు.
అయితే.. ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కావడంతో సీఎం చంద్రబాబు.. ప్రభుత్వమే విచారణ చేయాలని నిర్ణయించుకున్న దరిమిలా సిట్ను నియమించామన్నారు. అయితే, సుప్రీంకోర్టు కనుక మరేదైనా సంస్థతో దర్యాప్తు చేయించాలని భావిస్తే.. ప్రభుత్వం తరఫున ఎలాంటి విచారణకైనా తమకు అభ్యంతరం లేదన్నారు. సీబీఐ సహా స్వతంత్ర దర్యాప్తు సంస్థ కానీ, మాజీ న్యాయమూర్తితో కానీ.. విచారణ జరిపించవచ్చని సర్కారుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
This post was last modified on October 1, 2024 2:40 pm
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…