Political News

‘జ‌గ‌న్’ కోసం బీజేపీ వెయిటింగ్‌.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌!!

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ కోసం.. బీజేపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇదేదో పార్టీల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కాదు.. వ్య‌క్తిగ‌త విష‌యాలు అంత‌క‌న్నా కావు. కేవ‌లం తిరుమ‌ల తిరుప‌తి వ్య‌వ‌హారం కోస‌మే కావ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం రాత్రికి తిరుప‌తి చేరుకుని ఆ వెంట‌నే ఆయ‌న ప్ర‌త్యేక కాన్వాయ్‌లో తిరుమ‌ల‌కు వెళ్తారు. అక్క‌డే శుక్ర‌వారం రాత్రి బ‌సచేసి శ‌నివారం ఉద‌యం శ్రీవారిని ద‌ర్శించుకుంటారు.

అయితే.. శ్రీవారిని ద‌ర్శించుకునే ముందు.. జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కాలు చేయాల‌న్న‌ది బీజేపీ నేత‌లు సంధిస్తున్న డిమాండ్. దీనికి వైసీపీ నేత‌లు స‌సేమిరా అంటున్నారు. మ‌రోవైపు.. టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నాయ‌కులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇంకో వైపు.. బీజేపీ నాయ‌కురాలు.. హైద‌రాబాద్ కు చెందిన మాధ‌వీల‌త ఏకంగా తిరుప‌తిలోనే తిష్ఠ‌వేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇచ్చి తీరాల్సిందేన‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. లేక‌పోతే.. తిరుమ‌ల గిరులు ఎక్క‌కుండా జ‌గ‌న్‌ను అడ్డుకుంటామ‌ని తేల్చి చెబుతున్నారు.

ఇంకోవైపు.. స్థానిక బీజేపీ నాయ‌కులు కూడా సీరియ‌స్‌గానే స్పందిస్తున్నారు. తిరుమ‌ల కు వెళ్లాలంటే.. ముందుగా జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి స‌హా కీల‌క నాయ‌కుడు భాను ప్ర‌కాష్ రెడ్డి వంటి నాయ‌కులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ వ్య‌వ‌హారం హాట్ హాట్‌గా మారింది. ఇదిలావుంటే.. బీజేపీ నేత‌ల హెచ్చ‌రిక‌లు, వైసీపీ నేత‌ల స‌వాళ్ల నేప‌థ్యంలో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త‌త‌లు త‌లెత్తాయి.

ఈ నేప‌థ్యంలో పోలీసులు యాక్ట్‌-30ని అమ‌లు చేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ప‌హారా పెంచారు. వైసీపీ నాయ‌కుల‌ను ముంద‌స్తు అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం త‌న డిక్ల‌రేష‌న్ వ్య‌వ‌హారంపై మౌనంగా ఉన్నారు. ఏం చేస్తార‌నేది ఆయ‌న చెప్ప‌డం లేదు. మొత్తానికి తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం.. చినుకు చినుకు గాలి వాన‌గా మారిన చందంగా రాజ‌కీయాలు మారిపోయాయి.

This post was last modified on September 27, 2024 3:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…

8 minutes ago

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

2 hours ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

జనసైనికుల మనసు దోచుకున్న నారా లోకేష్

“మనకు అన్నీ బాగున్నప్పుడు అందరూ తోడుంటారు. కానీ కష్టకాలంలో అండగా నిలిచినవారే మనవారు. అలాంటి వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు”…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

3 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

4 hours ago