Political News

లడ్డూ కల్తీ..వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

తిరుపతి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని ల్యాబ్ ఇచ్చిన అధికారిక నివేదిక ప్రకారం చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు.

గతంలో కూడా కొందరు భక్తులు లడ్డు నాణ్యతపై, శుభ్రతపై ఫిర్యాదు చేయడంతో ల్యాబ్ కు పంపించి లడ్డు నాణ్యతను పరీక్షించడంతో ఈ విషయం బట్టబయలైంది. అయితే, తిరుపతి లడ్డు పై చంద్రబాబు చేస్తున్నది దుష్ప్రచారం అని, తిరుమల వెంకన్నను అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ప్రత్యారోపణలకు దిగారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై, వైసీపీ నేతల ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎంతో పవిత్రమైన, విశిష్టత కలిగిన తిరుపతి లడ్డూను కల్తీ చేయడమే కాకుండా ఆ కల్తీని ప్రశ్నించిన తమపై జగన్, వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తారా అని ఆయన ఫైర్ అయ్యారు.

గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడుతానని, స్వామికి అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా మాట్లాడనని చంద్రబాబు అన్నారు.

వాస్తవాలు వెల్లడించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న బాధ తనకు కూడా ఉందని, కానీ అలా అని గత పాలకులు చేసిన దుర్మార్గాలను బట్టబయలు చేయకుండా చూస్తూ ఊరుకోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. 200 ఏళ్ల పైబడిన చరిత్ర తిరుమలకు ఉందని, ఇంట్లో తిరుపతి లడ్డు ఉంటే ఇల్లంతా కమ్మటి వాసన ఘుమఘుమలాడేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుపతి లడ్డు విషయంలో, అక్కడి ఆహార పదార్థాల శుభ్రత, నాణ్యత విషయంలో రాజీ పడబోమని అన్నారు. గతంలో వాటి విషయంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆ తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని, వారిని కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని సాయం అందించాలని సూచించారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడు గ్రామంలో స్థానికులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు.

This post was last modified on September 21, 2024 4:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

22 minutes ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

1 hour ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

2 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

7 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

9 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

11 hours ago