Political News

లడ్డూ కల్తీ..వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

తిరుపతి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని ల్యాబ్ ఇచ్చిన అధికారిక నివేదిక ప్రకారం చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు.

గతంలో కూడా కొందరు భక్తులు లడ్డు నాణ్యతపై, శుభ్రతపై ఫిర్యాదు చేయడంతో ల్యాబ్ కు పంపించి లడ్డు నాణ్యతను పరీక్షించడంతో ఈ విషయం బట్టబయలైంది. అయితే, తిరుపతి లడ్డు పై చంద్రబాబు చేస్తున్నది దుష్ప్రచారం అని, తిరుమల వెంకన్నను అడ్డుపెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ప్రత్యారోపణలకు దిగారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై, వైసీపీ నేతల ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఎంతో పవిత్రమైన, విశిష్టత కలిగిన తిరుపతి లడ్డూను కల్తీ చేయడమే కాకుండా ఆ కల్తీని ప్రశ్నించిన తమపై జగన్, వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తారా అని ఆయన ఫైర్ అయ్యారు.

గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడుతానని, స్వామికి అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా మాట్లాడనని చంద్రబాబు అన్నారు.

వాస్తవాలు వెల్లడించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న బాధ తనకు కూడా ఉందని, కానీ అలా అని గత పాలకులు చేసిన దుర్మార్గాలను బట్టబయలు చేయకుండా చూస్తూ ఊరుకోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. 200 ఏళ్ల పైబడిన చరిత్ర తిరుమలకు ఉందని, ఇంట్లో తిరుపతి లడ్డు ఉంటే ఇల్లంతా కమ్మటి వాసన ఘుమఘుమలాడేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తిరుపతి లడ్డు విషయంలో, అక్కడి ఆహార పదార్థాల శుభ్రత, నాణ్యత విషయంలో రాజీ పడబోమని అన్నారు. గతంలో వాటి విషయంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆ తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని, వారిని కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు, ప్రతి నెల 1వ తేదీన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని సాయం అందించాలని సూచించారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడు గ్రామంలో స్థానికులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు.

This post was last modified on September 21, 2024 4:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా హత్య కేసు.. 4 వారాల్లో తీర్పు!

వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…

17 minutes ago

కవిత దీక్ష.. ఎవరికీ పట్టట్లేదా?

బీఆర్‌ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…

27 minutes ago

సుకుమార్ శిష్యుడికి ‘మెగాస్టార్’ గ్రీన్ సిగ్నల్ ?

కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…

57 minutes ago

మల్లారెడ్డికి మళ్ళీ పెళ్లి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…

1 hour ago

విద్యుత్ చార్జీల పెంపుపై చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

అస‌లే వేస‌వి కాలం.. సాధార‌ణ ఇళ్ల‌లో ఫాన్లు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో కూల‌ర్లు, ఆపై త‌ర‌గ‌తుల ఇళ్ల‌లో ఏసీలు క‌నీసంలో క‌నీసం…

2 hours ago

కెమెరామెన్ పేల్చిన ‘విశ్వంభర’ బాంబులు

విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…

2 hours ago