Political News

చంద్రబాబుపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో అతలాకుతలమైన రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరముందని గుర్తించిన ప్రజలు ఆయనను ఏరి కోరి ఎన్నుకున్నారు. అందుకే, తనను నమ్ముకున్న ప్రజల కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరదలు అతలాకుతలం చేస్తే వరద బాధితులకు నేనున్నాను అని చంద్రబాబు అండగా నిలిచారు.

ఏడు పదుల వయసులోనూ ముఫ్ఫై ఏళ్ల యువకుడిలా చంద్రబాబు కష్టపడ్డ వైనంపై ప్రశంసలు కురిశాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్…సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశఆరు.

నాలుగో సారి సీఎం అయినప్పటికీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన విధంగా కసితో పనిచేస్తున్నారని సీఐఐ సదస్సులో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు తేవడం, లక్షలాది ఉద్యోగాలు సృష్టించండి వంటి అజెండాతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. సీఎం చంద్రబాబు నిత్యం రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారని అన్నారు. పెట్టుబడుల వికేంద్రీకరణతో ముందుకు వెళుతున్నామని, ప్రతి జిల్లాలో ఒక్కో రంగంలో పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారు.

ఏఐ వంటి సాంకేతికత కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామని, విశాఖ కేంద్రంగా ఐటీ, డేటా సెంటర్ ఏర్పాటు కు ప్రయత్నిస్తున్నామని లోకేశ్ చెప్పారు. ఐఎస్ బీ మోడల్ లో ఏఐ యూనివర్సిటీ స్థాపించే యోచనలో ఉన్నామని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. నెల రోజుల్లో ఎకనమిక్ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్టుబడుల కోసం కంపెనీల వద్దకే వస్తామని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ నినాదంతో తమ ముఖ్యమంత్రి, తమ ప్రభుత్వం పనిచేస్తున్నాయని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

This post was last modified on September 21, 2024 4:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…

57 minutes ago

హిట్ 3 విలన్ వెనుక ఊహించని విషాదం

గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…

1 hour ago

కశ్మీర్ లోని ఏపీ విద్యార్థుల భద్రతపై ఫోకస్

భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…

2 hours ago

తెలుగు జవాన్ మురళి వీర మరణం

పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్‌కు బ్రేక్… బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…

3 hours ago

అత్తరు సాయుబు బయటకు వచ్చాడు

ఒక హిట్టు లేదా ఫ్లాపుని బట్టి డైరెక్టర్ సత్తాని అంచనా వేయలేం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ఇలాంటి విషయాల్లో…

3 hours ago