Political News

లడ్డు గొడవ.. చాలా దూరం వెళ్లిపోయింది

మొన్న ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం సందర్భం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు నాణ్యత దెబ్బ తినడంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. లడ్డులో వాడిన నెయ్యిలో జంతు కొవ్వులు వాడినట్లుగా ఆయన చేసిన ఆరోపించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చగా మారింది.

ముందు ఈ ఆరోపణలను మామూలుగానే చూశారు, తెలుగు రాష్ట్రాల వరకే దీని గురించి కొంత చర్చ జరిగింది. కానీ ఒక్క రోజు గడిచేసరికి వ్యవహారం మారిపోయింది. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిందా.. లేక అక్కడి మీడియానే దీని మీద దృష్టిసారించిందా అన్నది స్పష్టత లేదు కానీ.. గురువారం రాత్రి నుంచి ఈ గొడవ జాతీయ అంశంగా మారిపోయింది.

కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా తిరుమల లడ్డులో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లుగా నిరూపించే ల్యాబ్ రిపోర్టులను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టడంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం సాయంత్రం నుంచే జాతీయ స్థాయిలో తిరుమల లడ్డు టాపిక్ ట్రెండ్ అయింది. ఒక దశలో ఇండియాలో నంబర్ వన్ టాపిక్‌గా మారింది. దీంతో పాటుగా జగన్ పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 50 ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్న నాణ్యమైన నందిని నెయ్యిని పక్కన పెట్టి వేరే వ్యక్తులకు కాంట్రాక్టునివ్వడంతో నాణ్యతను పట్టించుకోవడం మానేశారని.. దీంతో లడ్డు క్వాలిటీ దెబ్బ తిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీ.. ఇలా వరుసగా జాతీయ టీవీ ఛానెళ్లు ఈ అంశం మీద చర్చలు పెట్టడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశం అయింది. తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా భక్తులు ఎలా కొలుస్తారో తెలిసిందే. ఇక్కడి లడ్డును పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రసాదం విషయంలో తప్పు జరిగిందని తెలిసేసరికి తట్టుకోలేక వైసీపీ మీద సామాజిక మాధ్యమాల్లో హిందువులు విరుచుకుపడుతున్నారు.

This post was last modified on September 20, 2024 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

20 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

36 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago