వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు పంపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, బటన్ నొక్కుడు ద్వారా అందుతున్న నగదు.. వంటి విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీని వల్ల ఎన్నికల్లో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ, ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే.
ఇక, ఇప్పుడు కూటమి పార్టీల ప్రభుత్వం కూడా ఇదే పని చేయనుంది. ఈ నెల 20(శుక్రవారం) నుంచి రా ష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల(టీడీపీ, జనసేన, బీజేపీ) ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రతి ఇంటికీ వెళ్లనున్నా రు. వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలను కలుసుకోనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేసిన మేళ్లను తీసుకున్న నిర్ణయాలను.. అమలు చేస్తున్న పథకాలను కూడా వివరించనున్నారు. ఇదేసమయంలో విపక్షం వైసీపీ నిర్లక్ష్యం గురించి కూడా ప్రచారం చేయనున్నారు.
కూటమి సర్కారు వంద రోజులు పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చేసింది చెప్పుకోలేక పోతే.. ఆగమై పోతామన్న భావనను వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనలో తొలి నాడే 7 వేల పింఛను ఇచ్చిన విషయాన్ని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న తీరును కూడా ప్రజలకు వివరించనున్నారు.
ఈ క్రమంలో వంద రోజుల్లో సర్కారుకు ఎదురైన సవాళ్లను, వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నదీ కూడానాయకులు ప్రజలకు వివరించనున్నారు. వంద రోజుల పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేసుకోవాలన్న ది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. మార్పులు సహజంగా జరగకపోతే.. ఇబ్బందులు తప్పవన్నది కూడా ఆయన మాటే. ఈ నేపథ్యంలోనే గడపగడపకు కూటమి సర్కారు పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ నెల20న ప్రారంభించనున్నారు. మరి ఏమేరకు ప్రజలు తమ అభిప్రాయం చెబుతారనేది చూడాలి.
This post was last modified on September 19, 2024 12:12 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…