Political News

‘చంద్రబాబు వద్దకు వెళితే నిన్ను కనబడకుండా చేస్తాం’

బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీ ఇష్యూతో తెర మీదకు వచ్చిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా.. విశాల్ గున్ని.. పీఎస్ఆర్ ఆంజనేయుల దందాలు లీలలు మామూలుగా లేవు.

వీరి వివాదాస్పద వైఖరి ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని తెలిపే పలు ఉదంతాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆ జాబితాలోకి చేరారు.

గత ప్రభుత్వ హయాంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని.. సీరియస్ వార్నింగ్ గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. ఉద్యోగుల పట్ల నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాలపై పోరాడిన దానికి ఫలితంగా తనకు ఎదురైన బెదిరింపులు.. పోలీసు అధికారులు తనను టార్గెట్ చేసిన వైనాన్ని వివరించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ నటి కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తున్న వైనాన్ని తమ సంఘం సమర్థిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తనకు వ్యక్తిగతంగా ఎదురైన పరిస్థితిని సూర్యనారాయణ వివరించారు. ‘ఉద్యోగుల పీఎస్ సొమ్మును గత ప్రభుత్వం ఇష్టానుసారం డ్రా చేసేస్తుందని గవర్నర్ కు కంప్లైంట్ చేశా. దాంతో నన్ను టార్గెట్ చేశారు. దొంగ కేసులు బనాయించారు. సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. సీఎస్.. డీజీపీలతో కలిసి కోర్టులో వాదించేలా రూ.25 లక్షలు ఖర్చు చేశారు” అని పేర్కొన్నారు. అంతేకాదు. ఈ ఇష్యూ తర్వాతి దశల్లో మరింత దారుణంగా మారిందని చెప్పుకొచ్చారు.

ఈ కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత పటమట పోలీస్ స్టేషన్ కు నన్ను పిలిపించారన్న సూర్యనారాయణ అప్పట్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని నన్ను పిలిపించారు. అప్పటి నిఘా చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడించారు. చంద్రబాబు వద్దకు వెళితే నిన్ను కనబడకుండా చేస్తాం” అంటూ సూటిగా వార్నింగ్ ఇచ్చారంటూ అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాలను రివీల్ చేశారు. సూర్యనారాయణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

This post was last modified on September 17, 2024 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశాఖ ఉక్కుకు కేంద్రం మ‌రో షాక్‌!

ఆంధ్రుల హ‌క్కుగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కును ప్రైవేటు ప‌రం కాకుండా నిల‌బెట్టుకునేందుకు కార్మికులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు,…

9 hours ago

వ‌ర‌ద బాధితుల‌కు 25 వేల సాయం..:  చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

విజ‌య‌వాడ, గుంటూరు, బాప‌ట్ల‌, ఏలూరు జిల్లాల్లో వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. స్వ‌యంగా సీఎం…

9 hours ago

కిల్ రీమేక్ అతడితోనా.. వామ్మో

ఇటీవలి కాలంలో ఓ చిన్న సినిమా బాలీవుడ్లో సంచలనం రేపింది. లక్ష్య అనే కొత్త హీరోను పెట్టి నిఖిల్ నగేష్…

11 hours ago

ఒక్కడిగా వస్తేనే కంగువకు లాభం

ఏదో దసరాకు మంచి డేట్ దొరికిందని అక్టోబర్ 10 లాక్ చేసుకుంటే రజనీకాంత్ వెట్టయన్ ఇచ్చిన షాక్ కి వాయిదా…

12 hours ago

ప్రకంపనలు రేపుతున్న జానీ మాస్టర్ వివాదం

లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై…

15 hours ago

రావణుడు చేసిన గాయానికి భైర చికిత్స

ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం…

16 hours ago