జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ హెడ్.. వేములపాటి అజయ్ కుమార్ ప్రకటన జారీ చేశారు.
“జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని ఆదేశించడమైంది. ఆయనపై రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీనాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది” అని అజయ్ కుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏం జరిగింది?
సినీ రంగానికి చెందిన జానీ మాస్టర్.. ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతు పలికారు. పవన్కు అనుకూలంగా పాటలు, డ్యాన్సులతో కూడిన వీడియోలను ఆయన పోస్టు చేశారు. ఎన్నికల వేళ వైసీపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించడంలో నూ కీలక రోల్ పోషించారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు.
అయితే.. తాజాగా రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఓ మహిళ ఆయనపై కేసు పెట్టింది. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించా రని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయం వెలుగు చూడగానే జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోం ది. అయితే.. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఆ వెంటనే ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఇటీవల టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. సాక్షాత్తూ.. టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆయన తనను పలుమార్లులైంగికంగా వేధించారంటూ.. మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
This post was last modified on September 16, 2024 6:52 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…