Political News

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ హెడ్‌.. వేములపాటి అజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

“జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని షేక్ జానీని ఆదేశించ‌డ‌మైంది. ఆయ‌న‌పై రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైన నేప‌థ్యంలో పార్టీనాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుంది” అని అజ‌య్ కుమార్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

సినీ రంగానికి చెందిన జానీ మాస్ట‌ర్.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ప‌వ‌న్‌కు అనుకూలంగా పాట‌లు, డ్యాన్సుల‌తో కూడిన వీడియోల‌ను ఆయ‌న పోస్టు చేశారు. ఎన్నిక‌ల వేళ వైసీపీకి వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించ‌డంలో నూ కీల‌క రోల్ పోషించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ పాల్గొన్నారు.

అయితే.. తాజాగా రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో ఓ మ‌హిళ ఆయ‌నపై కేసు పెట్టింది. త‌న‌ను జానీ మాస్ట‌ర్ లైంగికంగా వేధించా ర‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యం వెలుగు చూడ‌గానే జానీ మాస్ట‌ర్ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోం ది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌నను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇటీవ‌ల టీడీపీ స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపైనా ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌చ్చాయి. సాక్షాత్తూ.. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఒక‌రు ఆయ‌న త‌న‌ను ప‌లుమార్లులైంగికంగా వేధించారంటూ.. మీడియా ముందుకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత తిరుప‌తి ఈస్ట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విష‌యం తెలిసిన వెంట‌నే పార్టీ అధిష్టానం ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on September 16, 2024 6:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి.. దీదీ కోటలో బీజేపీ మ్యాజిక్!

పశ్చిమ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోట…

30 minutes ago

బీజేపీ కూటమితో విజ‌య్ క‌లుస్తారా?.. ఏం జ‌రుగుతుంది?

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న విజ‌య్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…

1 hour ago

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

1 hour ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

1 hour ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

2 hours ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

2 hours ago