Political News

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ హెడ్‌.. వేములపాటి అజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

“జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని షేక్ జానీని ఆదేశించ‌డ‌మైంది. ఆయ‌న‌పై రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైన నేప‌థ్యంలో పార్టీనాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుంది” అని అజ‌య్ కుమార్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

సినీ రంగానికి చెందిన జానీ మాస్ట‌ర్.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ప‌వ‌న్‌కు అనుకూలంగా పాట‌లు, డ్యాన్సుల‌తో కూడిన వీడియోల‌ను ఆయ‌న పోస్టు చేశారు. ఎన్నిక‌ల వేళ వైసీపీకి వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించ‌డంలో నూ కీల‌క రోల్ పోషించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ పాల్గొన్నారు.

అయితే.. తాజాగా రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో ఓ మ‌హిళ ఆయ‌నపై కేసు పెట్టింది. త‌న‌ను జానీ మాస్ట‌ర్ లైంగికంగా వేధించా ర‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యం వెలుగు చూడ‌గానే జానీ మాస్ట‌ర్ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోం ది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌నను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇటీవ‌ల టీడీపీ స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపైనా ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌చ్చాయి. సాక్షాత్తూ.. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఒక‌రు ఆయ‌న త‌న‌ను ప‌లుమార్లులైంగికంగా వేధించారంటూ.. మీడియా ముందుకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత తిరుప‌తి ఈస్ట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విష‌యం తెలిసిన వెంట‌నే పార్టీ అధిష్టానం ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on September 16, 2024 6:52 pm

Share

Recent Posts

నాయకుడు లేకుండా యుద్ధం ఎలా జగన్?

స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్‌ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్‌ ఇస్తున్న…

15 minutes ago

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

42 minutes ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

1 hour ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

2 hours ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

2 hours ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

2 hours ago