Political News

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల మేర‌కు జ‌న‌సేన పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ హెడ్‌.. వేములపాటి అజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

“జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని షేక్ జానీని ఆదేశించ‌డ‌మైంది. ఆయ‌న‌పై రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైన నేప‌థ్యంలో పార్టీనాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌స్తుంది” అని అజ‌య్ కుమార్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

సినీ రంగానికి చెందిన జానీ మాస్ట‌ర్.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ప‌వ‌న్‌కు అనుకూలంగా పాట‌లు, డ్యాన్సుల‌తో కూడిన వీడియోల‌ను ఆయ‌న పోస్టు చేశారు. ఎన్నిక‌ల వేళ వైసీపీకి వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించ‌డంలో నూ కీల‌క రోల్ పోషించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ పాల్గొన్నారు.

అయితే.. తాజాగా రాయ‌దుర్గం పోలీసు స్టేష‌న్‌లో ఓ మ‌హిళ ఆయ‌నపై కేసు పెట్టింది. త‌న‌ను జానీ మాస్ట‌ర్ లైంగికంగా వేధించా ర‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఈ విష‌యం వెలుగు చూడ‌గానే జానీ మాస్ట‌ర్ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోం ది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సీరియ‌స్ అయ్యారు. ఆ వెంట‌నే ఆయ‌నను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఇటీవ‌ల టీడీపీ స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపైనా ఇలాంటి ఆరోప‌ణ‌లే వ‌చ్చాయి. సాక్షాత్తూ.. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఒక‌రు ఆయ‌న త‌న‌ను ప‌లుమార్లులైంగికంగా వేధించారంటూ.. మీడియా ముందుకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత తిరుప‌తి ఈస్ట్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విష‌యం తెలిసిన వెంట‌నే పార్టీ అధిష్టానం ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on September 16, 2024 6:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశాఖ ఉక్కుకు కేంద్రం మ‌రో షాక్‌!

ఆంధ్రుల హ‌క్కుగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కును ప్రైవేటు ప‌రం కాకుండా నిల‌బెట్టుకునేందుకు కార్మికులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు,…

9 hours ago

వ‌ర‌ద బాధితుల‌కు 25 వేల సాయం..:  చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌

విజ‌య‌వాడ, గుంటూరు, బాప‌ట్ల‌, ఏలూరు జిల్లాల్లో వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. స్వ‌యంగా సీఎం…

9 hours ago

కిల్ రీమేక్ అతడితోనా.. వామ్మో

ఇటీవలి కాలంలో ఓ చిన్న సినిమా బాలీవుడ్లో సంచలనం రేపింది. లక్ష్య అనే కొత్త హీరోను పెట్టి నిఖిల్ నగేష్…

11 hours ago

ఒక్కడిగా వస్తేనే కంగువకు లాభం

ఏదో దసరాకు మంచి డేట్ దొరికిందని అక్టోబర్ 10 లాక్ చేసుకుంటే రజనీకాంత్ వెట్టయన్ ఇచ్చిన షాక్ కి వాయిదా…

12 hours ago

ప్రకంపనలు రేపుతున్న జానీ మాస్టర్ వివాదం

లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి చేసిన ఆరోపణలు నివురు గప్పిన నిప్పులా మొదలై…

15 hours ago

రావణుడు చేసిన గాయానికి భైర చికిత్స

ఆదిపురుష్ రిలీజైనప్పుడు ఎక్కువ శాతం ట్రోలింగ్ కి గురైన పాత్ర సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణుడు. దర్శకుడు ఓం…

16 hours ago