జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ హెడ్.. వేములపాటి అజయ్ కుమార్ ప్రకటన జారీ చేశారు.
“జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని ఆదేశించడమైంది. ఆయనపై రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో పార్టీనాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది” అని అజయ్ కుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏం జరిగింది?
సినీ రంగానికి చెందిన జానీ మాస్టర్.. ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతు పలికారు. పవన్కు అనుకూలంగా పాటలు, డ్యాన్సులతో కూడిన వీడియోలను ఆయన పోస్టు చేశారు. ఎన్నికల వేళ వైసీపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నిర్వహించడంలో నూ కీలక రోల్ పోషించారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు.
అయితే.. తాజాగా రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఓ మహిళ ఆయనపై కేసు పెట్టింది. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించా రని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయం వెలుగు చూడగానే జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోం ది. అయితే.. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఆ వెంటనే ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఇటీవల టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. సాక్షాత్తూ.. టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆయన తనను పలుమార్లులైంగికంగా వేధించారంటూ.. మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం తెలిసిన వెంటనే పార్టీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
This post was last modified on September 16, 2024 6:52 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…