ఒక మహిళ కేసు.. దానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ లు.. అందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు. వారందరిని సస్పెన్షన్ వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఒకే కేసులో ఇలా ముగ్గురు ఐపీఎస్ లపై వేటు పడటం ఏపీ చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీపై కేసు నమోదు చేయటానికి ముందే ఆమెను ముంబయి నుంచి తీసుకురావటం.. ఆమెపై ఫిర్యాదు రావటానికి ముందే విమానం టికెట్లు కొనుగోలు చేయటం మొదలు ప్రతి మలుపులోనూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన అదికారుల పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంపై డీజీపీ సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు కాక ముందే అరెస్టుకు ఆదేశించి తప్పు చేసినట్లుగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ సీతారామాంజనేయులుగా తేలితే.. ఫిర్యాదు అందక ముందే విమాన టికెట్లు కొని టీంను ముంబయికి పంపిన కాంతిరాణా వ్యవహారం బయటకు రాగా.. దర్యాప్తులో ప్రాథమిక సూత్రాల్ని విస్మరించిన విశాల్ గున్ని పై వేటు పడింది.
గత ప్రభుత్వంలో ముఖ్యనేత సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను.. ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి.. అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితంగా తాజా వేటుగా అభివర్ణిస్తున్నారు.
సినీ నటి జెత్వానీ అరెస్టుకు సీఎం కార్యాలయంలోనే కుట్ర పథక రచన జరిగినట్లుగా తేల్చారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. అధికార దుర్వినియోగంతో పాటు తీవ్రమైన దుష్ప్రవర్తనకు కారణమైనట్లుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి పూర్తిస్థాయి రిపోర్టును ఇచ్చారు.
సాక్షులను.. సహచరులను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న వీరు ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని.. అందులో భాగంగా ముంబయికి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదిక నేపథ్యంలో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి పెట్టి వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకూ డీజీపీ రిపోర్టులో కీలక అంశాల్ని చూస్తే..
This post was last modified on September 16, 2024 10:36 am
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పటివరకు ఆయన మీద ఆరోపణలు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పదే పదే చెబుతున్న జమిలి ఎన్నికలకు తాజాగా మరింత ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు…
రాజమౌళి కుటుంబం నుంచి వచ్చాడనే పేరు, కీరవాణి వారసుడనే బ్రాండ్ హీరోగా శ్రీసింహకు తొలినాళ్లలో ఉపయోగపడ్డాయి కానీ అతనితో సినిమాలు…
ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కంగనా రౌనత్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన సినిమా ఎమర్జెన్సీ సెన్సార్ అడ్డంకులు దాటుకున్నా…
టెక్నాలజీ ఎంత పెరిగినా, సెట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులను ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. స్టూడియోలో, గ్రీన్…
వైసీపీలో మరో కీలక వికెట్ పడిపోయింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన…