Political News

టీడీపీలో కొత్త ర‌చ్చ‌.. మంత్రి ప‌ద‌వుల కోస‌మేనా?

ఏపీలో కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీలో మ‌రో కొత్త ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. సీనియ‌ర్ నాయ‌కులు ఎవ రూ పార్టీకి స‌హ‌క‌రించ‌డం లేద‌న్న‌ది ప్ర‌స్తుతం వినిపిస్తున్న మాట‌. దీనిపై పెద్ద ఎత్తున పార్టీలో చ‌ర్చ కూడా సాగుతోంది.

వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు జిల్లాల వారీగా విరాళాలు సేక‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పారిశ్రామిక వేత్త‌లు, సినీరంగానికి చెందిన వారు.. ఇత‌ర ప్ర‌ముఖులు కూడా.. విరాళాల రూపంలో న‌గ‌దు అందిస్తున్నారు.

అయితే.. జిల్లాల స్తాయిలో నాయ‌కులు సేక‌రించాల్సిన నిధులపై ఢిల్లీకి వెళ్తూ వెళ్తూ.. సీఎం చంద్ర‌బాబు స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాల నుంచి సీనియ‌ర్ నాయ‌కులు పెద్ద‌గా ఈ విష‌యంపై దృష్టి పెట్ట‌లేదని నాయ‌కులు తేల్చి చెప్పారు. దీంతో చంద్ర‌బాబు ఖంగు తిన్నారు.

వ్య‌క్తిగ‌తంగానూ ఇవ్వ‌క‌… ప్ర‌జ‌ల నుంచి కూడా స‌మీక‌రించ‌క‌పో తే.. ఎలా! ఈ విష‌యంపై చ‌ర్చించండి! అని ఆదేశించి ఆయ‌న ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల కు సీనియ‌ర్లు ఫోన్లు చేయ‌డం ప్రారంభించారు.

దీనికి చాలా మంది నాయ‌కులు నిరాశా, నిస్పృహ‌లు వ్య‌క్తం చేశార‌ట‌. త‌మ ప‌రిస్థితి కూడా జిల్లాల స్తాయిలో అలానే ఉంద‌ని.. అందుకే అడ‌గ‌లేక‌పోయామ‌ని వారు చెప్పిన‌ట్టు తెలిసింది. అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌, నెల్లూరు జిల్లాల‌కు చెందిన నాయ‌కులు అత్యంత నిరాశ‌గా స‌మాధానం చెప్పారు.

తాము ఏమీ చేయ‌లేక పోతున్నామ‌ని వారు తేల్చి చెప్పారు. ఇక‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాలకు చెందిన సీనియ‌ర్లు మాత్రం కొంత బెట‌ర్ అనిపించారు. అలాగే.. కృష్ణా, గుంటూరు జిల్లాల నాయ‌కులు విరాళాలు బాగానే సేక‌రించారు.

దీనికి కార‌ణం.. సీఎం చంద్ర‌బాబు ప‌క్క‌నే ఉంటారు కాబ‌ట్టి. మిగిలిన వారు మాత్రం.. మౌనంగా ఉన్నారు. పెద్ద పెద్ద నాయ‌కులు కూడా ఎవ‌రూ ఈ బాధ‌ను త‌మ బాధ‌గా భావించ‌డం లేద‌ని సీనియ‌ర్లు గుర్తించారు. దీనికి సంబంధించి చంద్ర‌బాబు ఢిల్లీ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న‌కు చెప్ప‌నున్నారు. అయితే.. అసలు కార‌ణం వేరే ఉంద‌ని.. త‌మ‌కు మంత్రివ‌ర్గంలో చోటు ఇవ్వ‌లేద‌న్న ఆవేద‌న వారిలో క‌నిపిస్తోంద‌ని సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.

అనంత‌పురంలో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టారు. క‌ర్నూలులోనూ ఇదే జ‌రిగింది. ఇలా నాయ‌కులు మౌనంగా ఉన్న ప్ర‌తి జిల్లాలోనూ జూనియ‌ర్లే మంత్రులుగా ఉన్నారు. ఈ కార‌ణంగానే విరాళాల సేక‌ర‌ణ‌కు వారు మొగ్గు చూప‌న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on September 17, 2024 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

12 minutes ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

58 minutes ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

2 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

7 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

9 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

11 hours ago