Political News

సౌండ్ లేని బీజేపీ స‌భ్య‌త్వం!

రాష్ట్రంలో బీజేపీని పుంజుకునేలా చేయాల‌ని.. స‌భ్య‌త్వాల‌ను పెంచాల‌ని రాష్ట్ర క‌మ‌ల‌నాథుల‌కు టార్గెట్లు విధించా రు. దీనికి కేంద్రంలోని పెద్ద‌లు పెద్ద టార్గెట్లే పెట్టార‌ని తెలుస్తోంది.

క‌నీసంలో క‌నీసం ల‌క్ష మందిని పార్టీలోకి తీసు కురావాల‌ని.. నూత‌న స‌భ్య‌త్వాలు ఇప్పించాల‌ని కూడా దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచే రాష్ట్రం లో క‌మ‌ల నాథులు స‌భ్య‌త్వాల‌పై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున బిల్ బుక్స్ రెడీ చేసుకున్నారు. స‌భ్య‌త్వ రుసుమును రూ.200గా నిర్ణ‌యించారు.

ఇప్ప‌టికే టీడీపీ రూ.200, జ‌న‌సేన రూ.500గా స‌భ్య‌త్వ రుసుములు పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. టీడీపీలో రుసుము లేకుండా కూడా స‌భ్య‌త్వం ఇస్తున్నారు. మ‌రోవైపు.. టీడీపీ డిజిట‌ల్ కూడా స‌భ్య‌త్వాన్ని ఇస్తోంది.

పైగా ఈ రెండు పార్టీలు గ‌త నెల‌లోనే స‌భ్య‌త్వ న‌మోదును చేప‌ట్టి.. దాదాపు పూర్తి చేశాయి. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీ స‌భ్యత్వ న‌మోదు చేప‌ట్టినా.. పెద్ద‌గా ప్ర‌యోజనం క‌నిపించ‌డం లేదు. స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాలు ఎక్క‌డ జ‌రు గుతున్నాయో కూడా తెలియ‌దు.

కానీ, బీజేపీ నాయ‌కులు మాత్రం స‌భ్య‌త్వ న‌మోదు జ‌రుగుతోంద‌ని చెబుతున్నా.. ఆ త‌ర‌హా వాతావ‌ర‌ణం మాత్రం క‌నిపించ‌డం లేదు. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. త‌ప్పుకొన్నారు. త‌ర్వాత క‌నీసం ఈ కార్య‌క్ర‌మం ఎలా జ‌రుగుతోంద‌న్న విష‌యంపైనా ఆమె ఆరా తీసిన‌ట్టుక‌నిపించ‌డం లేదు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న స‌హ‌కారం పెద్ద‌గా లేక‌పోవ‌డం.. మేం ఇది చేశాం.. ఇది చేస్తున్నాం.. అని చెప్పుకొనే అవ‌కాశం కూడా లేక‌పోవ‌డంతో స‌భ్య‌త్వాల న‌మోదు మంద‌గించింద‌ని తెలుస్తోంది.

ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణు వ‌ర్థ‌న్‌రెడ్డి, మాధ‌వ్ వంటి ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయ‌కులు స‌భ్య‌త్వాన్ని త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా వదిలేశారు. అంతా పురందేశ్వ‌రి చూసుకుంటున్నార‌ని.. తమ చేతిలో ఏమీ లేద న్న‌ట్టుగా వారు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌తోనే బీజేపీ స‌భ్య‌త్వాన్ని పుచ్చుకునేవారు క‌నిపించ‌క‌పోతే.. ఇచ్చే వారు కూడా క‌నిపించ‌కుండా పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలాగైతే.. పార్టీ పుంజుకునేనా? అనేది కొంద‌రి ప్ర‌శ్న‌.

This post was last modified on September 17, 2024 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

8 minutes ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

2 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

3 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

4 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

4 hours ago